Telangana | 75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్య్రం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్య్రానికి సార్థకత.
దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో కేసీఆర్ నేతృత్వం లో మనం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంస మయ్యాయి. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ము కాస్తూ రావడం వల్ల తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.
పది సంవత్సరాల కిందటి తెలంగాణ జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తది. ఎటుచూసినా పడావు పడ్డ పొలాలు, పూ డుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులం తా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, తినడానికి తిండిలేక గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు.
ఇటువంటి పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమథనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైన తెలంగాణను విజయవంతంగా వికాసం వైపు నడిపించారు సీఎం కేసీఆర్.
ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన నాయకుడు కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేశారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సా ధించారు. అనేక రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలో అగ్రస్థానం లో నిలబెట్టారు. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కించారు.. తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది. అనే దశకు తెలంగాణను తీసుకొచ్చిన నిత్యకృషీవలుడు కేసీఆర్.
నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాలువలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో అలరారుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం ఆశ్చర్యానికి లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన రానున్న ఎన్నికల్లో అందించాలని తీర్మానించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ర్టాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ.3,12,398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు కంటే 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటుకంటే 70శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ 2014లో రూ.4,51,580 కోట్లు. అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వ్యూహాత్మక పాలనా కొనసాగించడంతో 2023 నాటికి రూ.13,13,391 కోట్లు పెరిగింది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. అదే విధంగా తెలంగాణ తలసరి ఆదాయం చూసుకుంటే 2014లో రూ.1,24,104 ఉంటే, అదే తలసరి ఆదాయం 2023లో రూ.3,17,117 లకు పెరిగింది, అంటే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది.
అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్ధ్యం: 2014లో 7,778 మెగావాట్లు. తొమ్మిదేండ్ల పాలన తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 2023లో 26,000 మెగావాట్లు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2014లో 13 56 యూనిట్స్గా ఉంటే తొమ్మిదేండ్ల పాలనలో 2023 నాటికి 2150 యూనిట్స్కు చేరుకున్నది.
రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయానికి సాగునీరు 2014లో 62 లక్షల ఎకరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2023లో 135 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన ఘనుడు కేసీఆర్. పంటల సాగు విస్తీర్ణం 2014లో 131 లక్షల ఎకరాలు మాత్రమే ఉంటే అది నేడు 2023 లెక్కల ప్రకారం 220 లక్షల ఎకరాలు. ధాన్యం ఉత్పత్తి 2014 నాటికి 68 లక్షల టన్నులైతే రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదేండ్లకు మూడింతలై 2023 నాటికి 272 లక్షల టన్నులు అయింది.
2014లో ఐటీ పరిశ్రమలో 3,23,396 ఉద్యోగాలు ఉంటే నేడు 9.05.715 ఉద్యోగాలు పెరిగాయి. ఐటీ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. నాడు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే నేడు జిల్లాకు ఒక్కటి చొప్పున 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది ఎంబీ బీఎస్ సీట్లు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో 298 ఉన్న ప్రభుత్వ గురు కులాలు 1005 కు చేరుకున్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో పదిలం గా ఉన్నారు. ప్రతిపక్ష నేతలు చేసే అసత్య ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజ లు లేరు. మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జి. రాజేశ్వర్
96035 79115