స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ సమర్థ నాయకత్వంలో, అహింస మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నది. దేశంలో అనేక రాష్ర్టాలు కనీస మౌలిక వసతుల కోసం అల్లాడుతుంటే నూతన రాష్ట్రమైన తెలంగాణ ఆ దశను దాటి అద్భుతంగా పురోగమిస్తున్నది. గోదావరి, కృష్ణ జలాలను బీడు భూములకు మళ్లించి అన్నదాతల పాదాలను అభిషేకిస్తున్నది. సస్యశ్యామల రాష్ట్రమైన తెలంగాణ భరతమాతకు పచ్చని కొంగులా భాసిల్లుతున్నది. సంతోషాల సాగుబడిలో అధిక దిగుబడిని సాధిస్తూ రైతురాజ్యమై రాణిస్తున్నది. ఒకప్పుడు రేషన్ బియ్యం కోసం ఎదురు చూసిన తెలంగాణ ఇయ్యాల దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నది.
వ్యవసాయంతో పాటు పారిశ్రామిక ఐటీ ప్రగతితో సాటిలేని మేటిగా నిలుస్తున్నది. అత్యున్నత ప్రమాణలతో విద్యను, వైద్యాన్ని అందిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నది తెలంగాణ. అభివృద్ధిలో వికేంద్రీకరణను సాధిస్తూ పరిపాలనను, ప్రగతిని ప్రజలకు చేరువ చేస్తున్నది. అభివృద్ధి సూచికలలో, ఆర్థిక సంవృద్ధిలో ఎప్పటినుంచో స్థిరపడ్డ రాష్ర్టాలనూ అధిగమించి దూసుకుపోతున్నది తెలంగాణ.
నేడు భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యు త్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ వంటి వినూత్న పథకా లు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయరంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. విద్య, వైద్యరంగాల్లోనూ ముందంజలో ఉన్నది.
దాదాపు ఇరవై ఏండ్ల క్రితం మూడు కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయి. అవి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. పదేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడింది. ఇరవై ఏండ్లలో ఈ మూడు రాష్ర్టాలు సాధించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పదేండ్ల తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. సాటిలేని సంక్షేమం.. తిరుగులేని అభివృద్ధి రేటుతో ఎంతో ముందంజలో ఉన్నది. సమర్థ నాయకత్వం, సరైన దార్శనికత, సుస్థిరమైన పరిపాలనతో అన్ని రాష్ర్టాలతోనూ పోటీపడుతున్నది. స్వపరిపాలనలో అన్ని రంగాల్లోనూ పునర్నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల బహుముఖంగా రాష్ట్రం పురోగమిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు ఏ రంగంలోనూ తెలంగాణ దరిదాపుల్లో లేవు.
అసహాయులను అక్కున చేర్చుకొని, బలహీనులకు జీవన భద్రతను అందిస్తూ, రాజ్యాంగంలోని సంక్షేమ భావనను సాకారం చేస్తున్నది తెలంగాణ. గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సమప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తున్నది తెలంగాణ. సకల జనులను సమాదరిస్తూ ప్రగతి ఫలాలను పంచుతున్నది. లౌకిక ప్రజాస్వామ్య విలువలను పెంచుతున్నది. అంబేద్కర్ మహాశయుని ఆశయ సాధనలో దళితుల స్వావలంబన కోసం ఉద్యమ స్ఫూర్తితో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నది. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక ఐటీ ప్రగతితో సాటిలేని మేటిగా నిలుస్తున్నది తెలంగాణ రాష్ట్రం. అత్యున్నత ప్రమాణాలతో విద్యను, వైద్యాన్ని అంది స్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నది తెలంగాణ. అభివృద్ధిలో వికేంద్రీకరణను సాధిస్తూ పరిపాలనను, ప్రగతిని ప్రజలకు చేరువ చేస్తున్నది. అభివృద్ధి సూచికలలో, ఆర్థిక సంవృద్ధిలో ఎప్పటినుంచో స్థిరపడ్డ రాష్ర్టాలనూ అధిగమించి దూసుకుపోతున్నది తెలంగాణ .
ఈ పదేండ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మన విజయాలెన్నో కంటిముందు కనిపిస్తాయి. నేడు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల విద్యుత్తు సరఫరా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా, రైతు రుణమాఫీ, మిషన్ కాకతీ యతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా , సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దళిత బం ధు , బీసీబంధు , డబుల్ బెడ్రూం ఇండ్లు , చేప పిల్ల ల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు, ధోబీ ఘాట్ల కు ఉచిత విద్యుత్తు, అన్ని వర్గాలకు గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు, పల్లె, పట్టణ ప్రగతి, టీఎస్ ఐ పాస్, భూ రికార్డుల ప్రక్షా ళన, ధరణి వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగా గుర్తింపు పొందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగు, తాగునీటి రంగంలో చారిత్రక పురోగతి సాధించి తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల రంగంలో దేశానికి ఆదర్శం గా నిలిచింది. రాష్ట్ర భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమలకు నీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కలను నిజం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నదీ జలాలు ఎగువకు పయనిస్తూ ఎస్సారెస్పీని చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగుభూములకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం సీఎం కేసీఆర్ దార్శనికత నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు, పలు రాష్ర్టాలకు చెందిన అధికారులు, మేధావులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే పాల మూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కూడా అందు బాటులోకి రానున్నది.
‘గోదావరి, కృష్ణమ్మలు మనబీళ్లకు మళ్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి’ అన్న మన నినాదాన్ని, విధానాన్ని సాకారం చేసిన కేసీఆర్కు జలాభివందనాలు.
(వ్యాసకర్త : ఎంపీటీసీ,జగిత్యాల జిల్లా)
దొప్పల హైమావతి
95838 88111