తెలంగాణ దక్కను పీఠభూమిలోని నడిగడ్డ. సగటు వర్షపాతమున్న ప్రాంతం. కాకతీయ పాలన కాలంలో ఊరూరా చెరువులు, కుంటలు, మోటబావులు,కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ కాలంలో నిర్మించిన భారీ నీటి ప్రాజెక్టులు నాగార్జునసాగర్, పోచంపాడు తప్ప పెద్ద ప్రాజెక్టులేవీ తెలంగాణలో నిర్మించలేదు. చెరువులు, కుంటలు కూడా పూడికతో పల్లంగా మారి నీటిని నిలువచేసుకునే వసతి మృగ్యమైంది.
వలసపాలకులు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టుల విషయం అసలే పట్టించుకోలేదు. క్రమంగా తెలంగాణ నేలలు వర్షపు నీటిని కూడా భూగర్భంలోకి తీసుకోలేని స్థితికి చేరుకున్నాయి. సరైన నీటి వసతి లేక అన్నం పెట్టే రైతన్నలు వ్యవసాయం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. 1465 కి.మీ పొడవునా ప్రవహించే గోదావరి 600 కి.మీ తెలంగాణలోనే పరుగులుపెట్టినా మనకు ఫలితం దక్కలేదు. వ్యవసాయం దండుగ అంటూ తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం శ్రద్ధచూపని గత పాలకులు ఈ ప్రాంతం లో వ్యవసాయాన్ని ధ్వంసం చేశారు.
ఆరు దశాబ్దాల అణచివేతతో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష బలపడ్డది. తెలంగాణ ప్రజలు కేవలం అభివృద్ధికోసం పోరాటం చెయ్యలేదు. తెలంగాణ ప్రజలది స్వయం పాలన, ఆత్మగౌరవ పోరాటం. అడుగడుగునా జరిగిన నీళ్ల వివక్షతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నీళ్లులేక 10,15 బోర్లు వేసుకొని రైతన్నలు అప్పుల పాలయ్యారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో నిలబడి కొట్లాడినం. ధర్మపోరాటంలో గెలిచినం.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నీటి అంశం ప్రధానాంశంగా నిలిచింది. బంగారు తెలంగాణలో జలమే జీవనాధారం అని పుడమితల్లి కోసం సమగ్రమైన పథక రచన చేసి దాన్ని నిండు శాసన సభలో దృశ్య మాధ్యమాలలో ప్రదర్శించారు కేసీఆర్. తెలంగాణ భౌగోళిక స్వరూపం, నిమ్నోన్నతాల పట్ల ఆయనకు ఎంతగొప్ప అవగాహన ఉందో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టడంతో విపక్షాలు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. పాలకులు తమ పబ్బం గడుపుకోవడానికి వస్తుంటారు, పోతుంటారు కానీ, నా తెలంగాణ కోటి రత్నాలవీణ నినాదంతో తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే.
పుడమితల్లికి పచ్చలహారంతో సస్యశామలం చేయాలనీ, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్టులలో కాళేశ్వరం ఒకటి. అలాగే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న ఆకాంక్షతోఅపర భగీరథుడు కేసీఆర్ చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథ. రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ అమలు చేసిన ఎన్నో పథకాలలో ఈ రెండు పథకాలు ప్రత్యేకమైనవి. కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యం ఒకటైతే, ప్రజలకు అవసరమైన తాగు నీటి కొరతను నిర్మూలించి దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వాలని సంకల్పించిన పథకం మిషన్ భగీరథ.
అలాగే మరో అద్భుత పథకం మిషన్ కాకతీయ. దీనితో చెరువులన్నీ నిండి ఎండకాలంలోనూ మత్తడి దుంకుతున్న దృశ్యాలు కండ్లముందే కనిపిస్తున్నాయి. పాలనాదక్షుడుగా, ఉద్యమకారుడిగా ఏకకాలంలో పేరుతెచ్చుకోవడం కేసీఆర్కు మాత్రమే చెల్లింది. తెలంగాణ ఉద్యమ పోరాట సారం కండ్ల ముందు గోదావరి జలాలతో సాకారమైంది. ‘ముంజేతి కంకణానికి అద్దం కావా లా’ అన్నట్టు తెలంగాణ అభివృద్ధికి ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి. పదమూడేండ్ల తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఎజెండాతో తన గమ్యాన్ని ముద్దాడింది బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ వారికి పరిపాలించుకోవడం చేతకాదు. అన్నవారే తలదించుకునేలా పాలనా పగ్గాలు చేపట్టిన అతితక్కువ కాలం లోనే సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం గా ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దశను మార్చిం ది. ప్రాజెక్టు మూలంగా చెరువులన్నీ నిండు కుండల్లా దర్శనమిస్తు న్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. ఒకప్పుడు బోర్లు వేస్తే తప్ప సాగునీరు అందని తెలంగాణలో ఈనా డు బోరువేయ కుండానే నీరు ఉప్పొంగి వస్తున్న దృశ్యాలెన్నో కండ్లముందు కనిపిస్తున్నా యి. నీటి వసతి పెరగడంతో పంటల విస్తీర్ణమూ పెరిగింది.
తొమ్మిదేండ్లలోనే తెలంగాణలో ఒక ఎకరం కూడా బీడుగా మి గిలిన సందర్భం లేదు. కాళేశ్వరంతో నాలుగు కోట్ల ప్రజల కల నిజమైంది.నదికి అడ్డంగా ఆనకట్టలు కట్టి ఆ నీటిని వెనక్కు నడిపిస్తూ ప్రకృతికే కొత్త నడకలు నేర్పిన బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పాదాల చెంత నుండి అన్నా రం, సుందిళ్ళ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా రంగనాయక స్వామి సాగర్ దాటి, కొంచెం దూరంలోనే ఉన్న కొమురెల్లి మల్లన్న పాదా లు ముద్దాడి, ఆయన చెల్లెలయిన కొండపోచమ్మ సాగర్కు నీరు చేరిన రోజే తెలంగాణ తాగు,సాగునీటి విజయపరంపర మొదలైంది. తెలంగాణ కోటి ఎకరా ల మాగాణిగా మారింది.
తెలంగాణ స్వప్నం కలగానే మిగిలిపోకుండా జలదృశ్యం నుం చి సుజల దృశ్యం వరకు అన్నీ తా నై సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించిన ఘనత కేసీఆర్కే ద క్కింది.ఇది తెలంగాణ సమాజం ఎన్నడూ ఊహించని విజయం. అపర భగీరథుడు కేసీఆర్ అఖండ విజయంతో దేశం దృష్టి తెలంగాణ ప్రగతి వైపుమళ్లిన సందర్భం.
-డా.సంగని మల్లేశ్వర్
98662 55355