‘పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు’ అన్న గాంధీజీ కలను నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు – 2023’లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా 46 పురస్కారాలకు గానూ 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. ప్రకటించిన అవార్డులలో 30 శాతం తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి. గత సంవత్సరం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పురస్కారాల్లో తొలి 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణ గ్రామ పంచాయతీలుండటం విశేషం.
ఒకప్పుడు అరకొర నిధులతో సతమతమయిన తెలంగాణ పల్లెలు నేడు కంపోస్ట్ షెడ్ ద్వారా చెత్త నుంచి సంపదను తయారు చేస్తున్నాయి. ఆదిలాబాద్లోని ముఖరా (కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పరిచి గ్రామపంచాయతీ పరిధిలో వీధి దీపాలకు విద్యుత్ను అందిస్తున్నది. ఇలాంటి గ్రామ పంచాయతీలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం ప్రకటించే ఏ పురస్కారాలైన ఈ-పంచాయతీ, ఆన్లైన్ ఆడిటిం గ్, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛ భారత్, ఓడీఎఫ్ వంటి ఏ విభాగమైనా తెలంగాణదే పై చేయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత 9 ఏండ్లలో ఏకంగా 79 జాతీయ పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం గెల్చుకున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పల్లెలు పాతగోడలు, పాడుబడ్డ బావులు, చెత్త కుప్పలు, పారిశుద్ధ్యలోపం, అరకొర నిధులతో అస్తవ్యస్తం గా ఉండేవి. సమైక్య పాలనలో ఆంధ్ర పాలకులు తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఎడారి లో ఎండమావి లాంటివే. స్వరాష్ట్ర సాధన తర్వా త ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలను మార్చడానికి 2015లో గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలను సాధించడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి దార్శనికత, నిబద్ధతకు తోడు 2018లో తీసుకువచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం.
తెలంగాణ రాష్ట్రంలో 61.3% జనాభాను కలిగి ఉన్న గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి 2019లో పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న 8369 గ్రామ పంచాయతీలను, 12769 గ్రామ పంచాయితీలుగా మార్చి ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. కార్యదర్శుల నియామకం వలన గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు, సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో 9355 జూనియర్ గ్రామ కార్యదర్శులను రెగ్యులర్ చేయడం వలన వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేయనున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్కి విశేష అధికారాలను కల్పించింది. గ్రామ స్థాయిలో అభివృద్ధికి పాల్పడే సర్పంచ్లకు ప్రోత్సాహకాలను కల్పిస్తూ అవకతవకలకు పాల్పడే వారిని తొలగించే అధికారాన్ని సైతం కలెక్టర్లకు పంచాయతీరాజ్ చట్టం కల్పించింది.
పల్లె ప్రగతి దేశానికి ఆదర్శం
ఐదు విడుతలుగా సాగిన తెలంగాణ పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారి క్రమంగా అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయి. సీసీ రోడ్లు, సీసీ కెమెరాలతో, వేలాడే విద్యుత్ తీగల స్థానంలో ఎల్ఈడీ లైట్లు మిరిమిట్లు గొల్పుతున్నాయి. డ్రైనేజీలు, డంప్ యార్డ్ల నిర్మాణంతో పారిశుద్ధ్య వసతులు మెరుగయ్యాయి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పరిశుభ్రతకు రథచక్రంగా మారింది. పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వైకుంఠధామాలు నిర్మించకముందు కుల ప్రాతిపదికన శ్మశాన వాటికలు ఉండేవి. ఇప్పుడు అందరికీ ఒకే వేదికను నిర్మించి అందరూ సమానమనే భావనను తీసుకు వచ్చారు. హరితహారం, రైతువేదికలు, ఇంకు డు గుంతల వంటి భూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
ఒకప్పుడు అరకొర నిధులతో సతమతమయిన తెలంగాణ పల్లెలు నేడు కంపోస్ట్ షెడ్ ద్వారా చెత్త నుంచి సంపదను తయారు చేస్తున్నాయి. ఆదిలాబాద్లోని ముఖరా (కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సొంత సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పరిచి గ్రామపంచాయతీ వీధి దీపాలకు విద్యుత్ అందిస్తున్నది. ఇలాంటి గ్రామ పంచాయతీలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఓడీఎఫ్, ఓడీఏఫ్+, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామాలు అధికంగా కలిగిన ఏకైక రాష్ట్రం కూడా మనదే. తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం రూ.14,235.50 కోట్లు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హెూదా కల్పిస్తూ 9 వభాగం, 11వ షెడ్యూల్ను ఏర్పరిచి 29 అధికారాలను కేటాయించారు. కానీ వీటిని కొన్ని రాష్ర్టాలు నేటికీ గ్రామపంచాయతీలకు కేటాయించలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా నేటికి రవాణా సౌకర్యాలు, తాగునీటి వసతులు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు దేశంలో కోకొల్లలు. సొంత గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలు సగానికి పైగానే ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాలలను పంచాయతీ భవనాలుగా వినియోగిస్తూ ప్రాథమిక విద్య సౌకర్యాలకు ఆటంకం కలిగిస్తున్న గ్రామాలెన్నో. గ్రామ పంచాయతీలకు ప్రధాన సమస్య నిధుల కొరత. ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన పాలన అస్తవ్యస్తంగా మారుతున్నది.
చిన్న గ్రామ పంచాయితీలు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఉన్నది. దీనికి తోడు పాలనా పరమైన అనుమతుల పరంగా, అధికారుల అలసత్వం, జాప్యం, అవినీతి వల్ల గ్రామా ల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. కేంద్రం స్థాయిలో షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలకు PESA చట్టం ద్వారా కల్పించిన ప్రత్యేకమైన అధికారాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఇటీవల కేంద్ర అటవీ హక్కుల చట్టం – 2006కు సవరణలు తీసుకురావడానికి చేసే ప్రయత్నం షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభ అధికార పరిధిని తగ్గించేలా ఉందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సహకార సంఘాలకు, స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణాలు మంజూరు కావడం లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.60,000 కోట్లు మాత్రమే. అంటే గతంతో పోలిస్తే 18% నిధులు తగ్గాయి. ఈ ఏడాది బడ్జెట్తో సగటున ఒక కూలీకి 40 రోజుల పని మాత్రమే లభించనుంది.
తీసుకోవలసిన సంస్కరణలు
-మండల సాయిరాం గౌడ్
9959885359