న్యూఢిల్లీ, మే 31: పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై రూ.3 నుంచి రూ.1.5కి తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ.16.5 నుంచి రూ.13.5కు కేంద్రం తగ్గించింది. అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద లీటర్కు రూ.16 నుంచి రూ.9.5 వరకు తగ్గిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాలపై కేంద్రం మార్పులు చేస్తుంటుంది.