ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడా. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇలాంటిదే. యాసంగి పంటలు ఎండిపోవడంతో నష్టాలపాలైన రైతన్నలకు ప్రభుత్వ చేయూత కరవైంది. కరవు నెలకొన్నా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందడం లేదన్నది వారి ఆవేదన. మిగిలిన వాటి మాట ఎలా ఉన్నా కనీసం రైతుబంధు అందినా ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అన్నదాతలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఐదెకరాలలోపు భూములున్న వారికే రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. మిగిలినవారికి మొండిచెయ్యి చూపింది. కనీసం పదెకరాలు ఉన్నవారికైనా పెట్టుబడి సాయం అందించి ఉంటే ఎక్కువమంది అన్నదాతల కష్టం తీరేది. యాసంగి పంటలు ఎండిపోయిన రైతన్నలకు ఇది కొంతమేరకు ఉపశమనంలా ఉండేది.
ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా ఈ అంశం గురించే చర్చ నడుస్తోంది. రైతుబంధు అవసరం గురించి అన్నదాతలు ఇంతగా మాట్లాడుకుంటున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారి దుస్థితికి గల కారణాలపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత తొమ్మిదేండ్లుగా లేనిది ఈ ఏడాదే కరవు ఎందుకు వచ్చిందన్న దానిపై పరిశీలన జరిపితే.. అసలు రాష్ట్రంలో ప్రకృతి కారణంగానే కరవు వచ్చిందా? అన్న సందేహం కలుగకమానదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కలు చూస్తే అలా అనిపించడం లేదు. తగినంతగా వర్షాలు కురిసినా నీటి నిర్వహణలో లోపాల కారణంగానే నేడు రాష్ట్రంలో దుర్భర పరిస్థితి సంభవించిందని చెప్పవచ్చు. గత 30-35 ఏండ్ల సగటు వర్షపాతాన్ని గమనిస్తే.. రాష్ట్రంలో 866.40 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే దాన్ని సాధారణ వర్షపాతంగానే భావించాలి. 2023-24లో 914.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా 5.4 శాతం అధికంగా వర్షాలు కురిసినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ వర్షాలు పంటల సాగుకు సరిపోతాయి. అంతకుముందు రెండేండ్లలో భారీగా వర్షాలు కురిసిన మాట వాస్తవమే. గతంతో పోల్చి చూసుకొని వానలు తగ్గాయని రైతులు అనుకోవడం సహజమే. సాధారణంగా తెలంగాణలో ఏడాదిలో 120 రోజుల పాటు వర్షాలు పడతాయి. గతేడాది మాత్రం కొద్ది అటూఇటుగా తక్కువ రోజుల పాటు వర్షాలు కురిశాయి. ఆగస్టులో కూడా కొద్ది రోజుల పాటే వానలు పడ్డాయి. అయినప్పటికీ వానలు పడ్డ రోజు భారీగా వర్షపాతం నమోదవడంతో నీటి లభ్యతకు ఇబ్బంది లేకుండాపోయింది. మొత్తం 33 జిల్లాలకు గాను 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 25 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, కేవలం రెండు జిల్లాల్లోనే లోటు నమోదైంది. నీటి వనరుల నిర్వహణ బాగుండటంతో చాలా ప్రాంతాల్లో వానకాలం పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
మరి యాసంగి పంటలకు వచ్చేసరికి ఎందుకు పరిస్థితి మారిపోయింది? కొత్త ప్రభుత్వం రావడమే అందుకు కారణమా? ఈ విషయాన్ని కూడా రైతులు చర్చించుకుంటున్నారు. నీటి వనరుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం తమ దుస్థితికి ప్రధాన కారణమని అన్నదాతలు అనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం నుంచి తగిన సూచనలు, సలహాలు అందకపోవడమే కారణమని వారు భావిస్తున్నారు. గతేడాది యాసంగితో పోల్చితే ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం కనీసం 15-20 శాతం మేర తగ్గిపోయింది. మొత్తంగా చూస్తే సాధారణ వర్షపాతం నమోదై, భూగర్భ జలాలు ఉండి, కరెంటు ఉండి ఎందుకు ఇంత కరవు వచ్చిందన్నదే రైతుల ప్రశ్న. ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని అన్నదాతలు ఇప్పుడు గ్రహిస్తున్నారు.
ఎన్నికల సందర్భంగా ఊరూరా తిరిగిన నాయకులందరూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినవారే. సమస్యను అవగాహన చేసుకున్నవారే. మరి కరవును అంచనా వేసి తక్షణ సాయాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారన్నది అసలు ప్రశ్న. గతంలో తక్కువ వర్షపాతం నమోదైనా కరవును ఎదుర్కొంటున్నామన్న భావన రైతుల్లో కలగలేదు. 2018-19లో 722.6 మిల్లీమీటర్లు, 2017-18లో 814.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా పంటలు ఎండిపోవడం గానీ, రైతులు ఆర్థికంగా నష్టపోవడం గానీ జరగలేదు. కరవు అనే మాటే లేదు. ఇందుకు కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడమే. అందుకే ‘తెలంగాణ మాడల్’ అన్నమాట దేశం దృష్టిని ఆకర్షించింది. వ్యవసాయ దిగుబడుల్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భూములు బీడుగా ఉండటానికి కారణం గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోకపోవడమే. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని లోపాలను బూచిగా చూపించి గోదావరి నీటిని కిందికి వదిలేశారు. కాళేశ్వరం అన్నది ఎత్తిపోత్తల ప్రాజెక్టు. ఆనకట్ట అవసరం లేకుండానే నదిలోని నీటిని పంపుల ద్వారా నేరుగా ఎత్తిపోసే అవకాశం ఉంది. కొన్ని మోటర్ల ద్వారా అయిన నీటిని నేరుగా ఎత్తిపోసి ఉంటే ఎంతో కొంత పంటకు నీరందేది. ఎంతో సాంకేతిక విజ్ఞానంతో, కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మోటర్లను వృథాగా ఉంచే బదులు కొన్నింటినైనా నడిపి ఉంటే కనీసం కొన్ని చెరువులైనా నిండేవి. గోదావరి జలాలను వృథా చేయడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో యాసంగి పంట సాగు చేయనేలేదు. ఇదంతా చూస్తుంటే నీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నది.
రైతుల ఆవేదనకు మరో కారణం మార్కెటింగ్లో నెలకొన్న లోపాలు. కాయకష్టం చేసి ధాన్యం పండించిన రైతన్న దాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ఎంత? ఎప్పడు కొంటారు? కొన్న తర్వాత సొమ్ము ఎప్పుడిస్తారు? తరుగు, తేమ కింద ఎంత తగ్గిస్తారు? ఇలా ఏ విషయంలోనూ రైతులకు స్పష్టత లేదు. చెప్పేవారు లేరు. వరి సాధారణ రకానికి మద్దతు ధర క్వింటాలుకు రూ.2,183గా ఉంది. అదే ఏ గ్రేడు రకానికి క్వింటాలుకు రూ.2,203గా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్గా ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు.
రైతుల ఆవేదనకు మరో కారణం మార్కెటింగ్లో నెలకొన్న లోపాలు. కాయకష్టం చేసి ధాన్యం పండించిన రైతన్న దాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ఎంత? ఎప్పడు కొంటారు? కొన్న తర్వాత సొమ్ము ఎప్పుడిస్తారు? తరుగు, తేమ కింద ఎంత తగ్గిస్తారు? ఇలా ఏ విషయంలోనూ రైతులకు స్పష్టత లేదు. చెప్పేవారు లేరు. వరి సాధారణ రకానికి మద్దతు ధర క్వింటాలుకు రూ.2,183గా ఉంది. అదే ఏ గ్రేడు రకానికి క్వింటాలుకు రూ.2,203గా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్గా ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు.
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ ధర చెల్లించడం లేదు. ఓపెన్ మార్కెట్లో కొన్నిచోట్ల సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,200-2,600 వరకు పలుకుతున్నా తగిన సౌకర్యాలు లేకపోవడంతో అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా హామీ ఇచ్చినట్టుగా బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారని రైతన్నలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.
నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు కొంతవరకు జరుగుతున్నా మిగిలిన జిల్లాల్లో మాత్రం అంతంతమాత్రంగానే కొనుగోళ్లు సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఎన్నికల ప్రచారాల్లో తలమునకలైన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి రైతుల గోసను పట్టించుకోవడం లేదు. కనీసం ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చే పాపాన కూడా పోవడం లేదు. ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా అవి అమలయ్యే వరకు నమ్మకం లేని పరిస్థితి నెలకొన్నది. అందుకే చాలాచోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్ హామీలను గుర్తుచేస్తూ హరీశ్రావు ఆధ్వర్యంలో సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట రైతులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలందరూ పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొనాలని సంగారెడ్డి ప్రజాసభ వేదికగా ప్రజా నేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఉద్యమం చేయాలని రైతులను కోరారు.
రుణమాఫీ, రైతు కూలీలకు సాయం వంటి హామీల గురించి ప్రస్తుతం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం ఇప్పుడే వాటి జోలికి పోదని కూడా రైతులకు తెలుసు. ఇన్ని సమస్యలతో రైతులు సమమతం అవుతున్నప్పుడు పదెకరాలు భూములున్న రైతులకు కూడా రైతుబంధు ఇచ్చి ఉంటే ఎంతో ఊరట కలిగి ఉండేది. కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయడంపైనా నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది.
గతంలో పెద్ద రైతుల నుంచి చిన్న రైతులు భూములను కౌలుకు తీసుకునే వారు. ఇప్పుడు చిన్న రైతులే తోటి రైతులకు భూములను కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్తున్నారు. భూమి యజమానిది, కౌలు రైతుది ఒకటే పరిస్థితి. ఇద్దరిలో ఎవరికీ నష్టం కలగకుండా ఉభయులకూ లాభం చేకూరేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే రైతులను సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకొని మంచిచెడులపై సమీక్ష జరిపి ఉంటే రైతులకు కొంత భరోసా కలిగి ఉండేది. కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం కలిగి ఉండేది. కష్టకాలంలో నాలుగు మంచి మాటలు చెవినపడితే బతుకుకు నిబ్బరం కలుగుతుంది. ఇలాంటి తక్షణ సాయం లేకపోవడం వల్లనే రైతులు అసంతృప్తి చెందుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో పక్కన బ్యాంకు వాళ్లు చాలా గ్రామాల్లో రైతుల ఇంటికి వెళ్లి రుణాలు కట్టాలంటూ వేధిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ రైతులకు భరోసా ఇస్తున్నారు. ఆత్మైస్థెర్యం నింపుతున్నారు. ‘మీ పంటను కొనిపించే బాధ్యత నాది. మీకు తాగు, సాగు నీరు ఇప్పించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి’ అని పొలంబాట పట్టి రైతులకు గుండె ధైర్యం ఇస్తున్నారు తెలంగాణ బాపు కేసీఆర్.
ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలి. లేకుంటే గ్రామీణులు, ముఖ్యంగా రైతులు తిరగబడటం ఖాయం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని తప్పక చవిచూస్తుంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్కు కర్రు కాల్చి వాతపెట్టడం తథ్యం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– గోసుల శ్రీనివాస్యాదవ్
98498 16817