హిందువులే లక్ష్యంగా జమ్మూకశ్మీర్లో సాగుతున్న హత్యాకాండతో కశ్మీరీ పండిట్ల భవితవ్యం త్రిశంకు స్వర్గంగా మారింది. 1990లనాటి పరిస్థితి మళ్లీ పునరావృతమైందని ఆందోళన చెందుతున్నారు. ఈ హింసాత్మక పరిస్థితుల్లో కశ్మీర్ లోయను అంటిపెట్టుకొని ఉండటమా? లేదా వదిలివెళ్లటమా అనేది పండిట్లకు పెద్ద సమస్య అయ్యింది.
కొంతకాలంగా కశ్మీర్లో వరుస ఘటనలు జరుగుతున్నాయి. మిలిటెంట్లు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. బుద్గామ్లోని శేక్పొరా పండిట్ శరణార్థుల కాలనీ సందడిలేకుండా ఉన్నది. 300 కశ్మీరీ పండిట్ కుటుంబాలుండే మూడంతస్తులతో ఉన్న 14 అపార్ట్మెంట్లలో జనసంచారం లేదు. ఇది శ్రీనగర్ సరిహద్దులోని ఉన్నత కుటుంబాలుండే కాలనీకి సమీపంలోనే ఉన్నది. రెండు దశాబ్దాల కిందట బలవంతంగా తరలించబడిన పండిట్లు ఇటీవల తిరిగివచ్చి తాజా పరిణామాలతో ఎదుర్కొంటున్న దుస్థితి ఇది.
శేక్పొరా కాలనీలో నివసించే రాహుల్భట్ అనే 35 ఏండ్ల వ్యక్తిని ఆయన పనిచేస్తున్న చాదూరా తహసీల్ ఆఫీస్లోనే మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పరంపరలో భాగంగా ఇది జరిగింది. ఇంతకుముందు కూడా జమ్మూ సంబా జిల్లాలో ఓ హిందూ స్కూల్ టీచర్ను, రాజస్థాన్కు చెందిన బ్యాంకు మేనేజర్ను కాల్చిచంపారు. జమ్మూ రాజౌరీ జిల్లాలో ఓ దుకాణంలో పనిచేసే వ్యక్తిని హత్య చేశారు. ఇలా హిందువుల వరుస హత్యలతో జమ్మూకశ్మీర్లోని మైనారిటీలైన హిందువులు, ముఖ్యంగా పండిట్లలో తీవ్ర అభద్రతాభావం నెలకొన్నది. 90ల కన్నా ముందునాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. గాల్లో దీపంలా తమ ప్రాణాలు, భవిష్యత్తుపై భరోసా లేకుండా జీవిస్తున్నారు.
కశ్మీర్లో మిలిటెన్సీ పెరగటానికి 2010లో కశ్మీరీ పండిట్లు తిరిగివెళ్లటానికి తెచ్చిన ప్యాకేజీ కూడా ఒక కారణమన్న వాదన ఉన్నది. ప్యాకేజీలో భాగంగానే 6 వేల మంది పండిట్లకు శరణార్థ కాలనీలు ఏర్పాటయ్యాయి. ఆ క్రమంలోనే పండిట్లకు ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. వ్యవసాయ సాగు కోసం భూమి కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని హామీ ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్థానిక ముస్లింలలో అనుమానాలు, భయాలు తలెత్తాయి. తమ ప్రాంతాల్లో పాగా వేయటానికే ఇదంతా అనే అపోహ నెలకొన్నది.
గత దశాబ్దం అంతా శేక్పొరా కాలనీ ప్రశాంతంగా ఉండేది. పండిట్లు స్థానిక ముస్లింలతో కలసిమెలసి జీవించేవారు. దగ్గరలోని ఈద్గా మైదానం లో ముస్లిం పిల్లలు క్రికెట్, ఫుట్బాల్ ఆడేవారు. పండిట్లు ఎలాంటి భయం లేకుండా క్యాంపు బయ ట సంచరించేవారు. ఎవరు చనిపోయినా ఇరుగుపొరుగు వారంతా హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరూ అంత్యక్రియల్లో పాల్గొనే వారు. ఇలాంటి వాటితోనే కదా మనుషుల్లో మమతానుబంధాలు బలపడేవి. ఇప్పుడదంతా మారిపోయింది.
2010లో నిరసనకారులపై కాల్పులు జరిగి చాలామంది చనిపోయినప్పుడు కానీ, 2016లో హిజ్బుల్ మొజాహిద్దీన్ కమాండర్ బురాన్వనీ ఎన్కౌంటర్ తర్వాత నెలల తరబడి నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు కానీ పరిస్థితులు ఇంతగా దిగజారలేదు. 2020 డిసెంబర్ 31 నుంచి కొత్త రకమైన మిలిటెంట్ల ఉద్యమం మొదలైంది. ఇది కేవలం మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా హత్యాకాండ కొనసాగుతున్నది. 2020 జూన్ నుంచి 2022 మే 31 వరకు 19 దాడులు జరిగాయి. వీటిలో 13 మంది ముస్లింలు కూడా చనిపోయారు. గత ఏడాది కూడా 33 దాడుల్లో 20 మంది స్థానిక ముస్లింలు చనిపోయారు. ఇది కేంద్రం 2021 అక్టోబర్ నుంచి కొత్తగా తెచ్చిన చట్టాలు, అనుసరిస్తున్న విధానాలతోనే జరుగుతున్నది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ స్పెషల్ స్టేటస్ను నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్ రద్దు, రాష్ర్టాన్ని రెండు ప్రాంతాలుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం చేసిన తర్వాతనే పరిస్థితులు మారిపో యాయి. ఈ విధానాలతో కశ్మీర్లో ప్రధాన స్రవంతి రాజకీయాలను, ప్రాంతీయ పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలకు ఉనికి లేకుండా చేశారు.
కశ్మీరీ పండిట్ సంఘర్షణ సమితి నేత ప్రకా రం.. కశ్మీర్లో పరిస్థితి దిగజారటానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది.. కశ్మీర్లో పౌర సమాజం పాత్రను ఈ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. 2010, 2016లో పౌర సమాజమే అనేక ఉద్రిక్తతలను నివారించింది. ఇప్పుడు ఎవరూ ముందుకురావటం లేదు. వచ్చినా… పబ్లి క్ సేఫ్టీ యాక్ట్, యూఏపీఏ లాంటి చట్టాలు తమపై ఎక్కడ మోపుతారోనని భయపడుతున్నారు. అప్పటినుంచే మిలిటెంట్లు పండిట్లను, హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులు చేస్తున్నారు.
ప్రభుత్వ దమనకాండతో అజ్ఞాతంలో ఉన్న టిక్కూ ప్రకారం- 2019 నుంచి కేంద్రం అమలుచేస్తున్న దమననీతికి కాలం చెల్లింది. ఎల్లకాలం లాఠీ, తుపాకీ లేని సమస్యలకు పరిష్కారాలు చూప వు. ఇప్పుడు కశ్మీర్లో వీటి స్థానంలో రాజకీయ ప్రక్రియ అవసరమని చెప్తున్నాయి. మేం పౌరసమాజాన్ని, మసీదును ఏకం చేసి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కృషి చేస్తామంటున్నారు టిక్కూ.
జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలకు కశ్మీర్ బయట జరుగుతున్న ఘటనలూ కారణమవుతున్నా యి. తాజాగా నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. అజాన్ సమస్య, హిజాబ్, మసీదు-మందిర్ వివాదాలు, బుల్డోజర్ రాజకీయాల ఫలితంగా కూడా కశ్మీర్ వేడెక్కుతున్నది. ‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాతో కశ్మీరీయన్లందరినీ జీహాదీలుగా ముద్ర వేస్తున్నారు. దీంతో.. మిలిటెంట్లు చావో రేవో తేల్చుకునే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం ఉన్నది.
కశ్మీర్లో మిలిటెన్సీ పెరగటానికి 2010లో కశ్మీరీ పండిట్లు తిరిగివెళ్లటానికి తెచ్చిన ప్యాకేజీ కూడా ఒక కారణమన్న వాదన ఉన్నది. ప్యాకేజీలో భాగంగానే 6 వేల మంది పండిట్లకు శరణార్థ కాలనీలు ఏర్పాటయ్యాయి. ఆ క్రమంలోనే పండిట్లకు ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. వ్యవసాయ సాగు కోసం భూమి కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని హామీ ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్థానిక ముస్లింలలో అనుమానాలు, భయాలు తలెత్తాయి. తమ ప్రాంతాల్లో పాగా వేయటానికే ఇదంతా అనే అపోహ నెలకొన్న ది. వెరసి ప్రభుత్వ విధానాలు కశ్మీర్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా దండనీతి ని విడిచి రాజకీయ ప్రక్రియ ద్వారా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
– పీర్జాదా ఆషిఖ్