‘పాకిస్థాన్, కశ్మీర్, హిందూ-ముస్లిం, చైనా’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే పాట పాడి బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. సరిహద్దు వివాదాల నుంచి సైనికుల వీరమరణం వరకు, మతాల మధ్య గొడవల నుంచి దేవుళ్ల వరకు దేన్ని బీజేపీ వదలడం లేదు. అన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రేపడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రసంగించడం లాంటివన్నీ బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.
పార్లమెంట్, ఏదేని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆఖరుకు మున్సి పల్ ఎన్నికలైనా ఫర్వాలేదు. ఎవరో ఒక నేత ఏదో ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు రేపేలా వ్యాఖ్యానిస్తాడు. అంతే ప్రచారాంశాలన్నీ మారుతాయి. అభివృద్ధి, రాష్ట్రంలో నెలకొ న్న సమస్యలు నాయకుల ఉద్వేగ ప్రసంగా ల్లో కొట్టుకుపోతాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదేతంతు. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేం ద్ర హోం మంత్రి అమిత్ షా ‘పీపుల్స్ ఫ్రం ట్ ఆఫ్ ఇండియా దాడుల నుంచి కర్ణాటక ను కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటెయ్యా లి’ అని పిలుపునిచ్చారు. ఆయనకు తోడు ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాన్ని వక్రీకరించి ‘కాంగ్రెస్ గతం లో రామునికి తాళం వేసింది. ఇప్పుడు ‘బజరంగ్ బలి’ అనే నోళ్లకు తాళం వేయాలని చూస్తున్నది’ అంటూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ వివాదం చుట్టే కర్ణాటక ప్రచారం సాగింది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే..
బీజేపీ దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ చే సిన ప్రయోగాన్నే కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా ప్రయోగించింది. 40 శాతం కమీషన్ ఆరోపణలతో ఏడాదిగా బసవరాజ్ బొ మ్మై సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. దీం తో బీజేపీ తన మాయా విద్యను బయటకు తీసింది. సరిగ్గా ఏడాది ముందు 2022 ఫిబ్రవరిలో కర్ణాటకలోని కళాశాలల్లో హిజా బ్ వివాదం మొదలైంది. ఓ కళాశాలలో మొదలైన ఈ వివాదం రాష్ట్రమంతటా వ్యా పించింది. బీజేపీ అనుబంధ సంస్థలు, విద్యార్థి సంఘాలు దీన్ని మరింత రాజుకునేలా చేశాయి. దీన్ని ఏడాదిపాటు కొనసాగించాలని అనుకున్నా హైకోర్టు కలగజేసుకుని వివాదం సద్దుమణిగేలా చేసింది. దీం తో రాష్ట్రంలో అవినీతి, స్థానిక సమస్యలు ప్రచారపర్వంలోకి దూసుకువచ్చాయి. తమ కు గెలుపు కష్టమేనని భావించిన బీజేపీ మ ర్మకళకు పనిచెప్పింది. అందులో ఉద్ధండు డైన అమిత్ షా పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండి యా అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతోపాటు బజరంగ్దళ్ను సైతం నిషేధిస్తామని పేర్కొన్నది. దీన్నే అదునుగా తీసుకున్న ప్రధాని మోదీ బజరంగ్ బలి అని చెప్పే నోర్లను నొక్కాలని కాంగ్రెస్ చూస్తున్నదని హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రచారపర్వం మొత్తాన్ని తమ వైపు తిప్పుకొని అధికార పీఠాన్ని ఎక్కాలనే వ్యూ హాన్ని బీజేపీ పెద్దలు పన్నారు.
పుల్వామా దాడి.. పీఎం పీఠానికి దారి
పుల్వామా దాడిని బీజేపీ ప్రభుత్వం నివారించలేకపోయిందని ఆర్మీ మాజీ చీఫ్ శంకర్రాయ్ చౌదరి, జమ్మూకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. బలగాలను రోడ్డు మార్గంలో పంపించడం శ్రేయస్కరం కాదని తాను కేంద్రానికి సూచించానని, తన మాటలను బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని సత్యపాల్ తెలిపారు. 2019లో ఎన్డీఏ ప్ర భుత్వం మరోసారి అధికారంలోకి రావడం కష్టమేననే సంకేతాలు వెలువడ్డాయి. అంతలోనే ఈ దారుణం జరిగింది. సైనికుల త్యా గాలను తనకు అనుకూలంగా మలుచుకుని, ఎన్నికల్లో ప్రచారం చేసి రెండోసారి అలవోకగా అధికార పీఠాన్ని అధిరోహించింది.
గంగలో తేలిన శవాల సాక్షిగా..
కేంద్రప్రభుత్వ వైఫల్యం కారణంగా క రోనా రెండో వేవ్ దేశాన్ని గడగడలాడిం చింది. దవాఖానల్లో ఆక్సిజన్ అంద క అనేక మంది మృత్యువాతపడ్డారు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లోని గంగా నదిలో కొట్టుకుపోతున్న శవాల దృశ్యాలు అప్పట్లో దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి పరిచాయి. ఈ వైఫల్యాలను పసిగట్టి బీజేపీ 2021 ఆగస్టులో జ్ఞానవాపి మసీదు దుమారాన్ని రేపింది. తద్వారా 2022 ఫిబ్రవరిలో యూపీతో పాటు మిగతా ఐదు రాష్ర్టాల్లోనూ ఫలితాలను బీజేపీకి అనుకూలంగా వచ్చేలా చేసుకుంది.
మున్సిపల్ ఎన్నికలను వదల్లేదు..
ఆఖరుకు మున్సిపల్ ఎన్నికలను సైతం బీజేపీ వదల్లేదు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, విద్వేష ప్రసంగాలకు చిరునామాగా నిలిచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని ఉద్వేగంతో ఊగిపోయారు. అప్పటి వరకు అభివృద్ధి, స్థానిక సమస్యలపై జరిగిన మాటల యుద్ధం కాస్త ఈ వ్యాఖ్యల వైపు మళ్లింది. విద్వేషా లు రెచ్చగొట్టి తన సీట్లను పెంచుకున్నది బీజేపీ.
ఎన్నికల వరకే… ఆ తర్వాత?
అన్ని ఎన్నికల్లో బీజేపీది ఇదే వ్యూహం. తమకు వ్యతిరేకత ఉన్న చోట సైతం ఇటువం టి కుతంత్రాల ద్వారానే నెగ్గుకొచ్చింది. కొసమెరుపేమిటంటే ఎన్నికల ముందు దేశాన్ని అట్టుడికేలా చేసే ఈ అంశాలు ఎన్నికలయ్యాక ఎక్కడా కానరావు.
ఇటీవల సుప్రీం వ్యాఖ్యలు
విద్వేష ప్రసంగాలపై ఫిర్యాదులు రా కున్నా కేసు నమోదు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఇది ఊరటనిచ్చే అంశమే.
మాలోతు సురేష్
98856 79876