ఏ రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏండ్ల తరబడి పార్టీలో జెండాలు మోస్తున్న తమకు గుర్తింపు రావడం లేదని దాదాపు అన్ని పార్టీలలో వాపోయేవారు ఉంటారు. కానీ గుర్తింపు లభించాలంటే జెండాలే మోయనవసరం లేదు. సందర్భం వచ్చినప్పడల్లా పార్టీని డ్యామేజ్ చేసినా గుర్తింపు వస్తుందని నిరూపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యునిగా ఇటీవల ఆయనకు స్థానం దక్కింది. మునుగోడులో పార్టీ అభ్యర్థిని కాకుండా బీజేపీని గెలిపించమని పిలుపు ఇచ్చినందుకు, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని తేల్చి చెప్పినందుకు నజరానాగా ఆయనకు పార్టీ అత్యున్నత కమిటీలో స్థానం లభించిందేమో అని ఆయన వ్యతిరేకులు గొనుగుకుంటున్నారు.