మహిళలు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ బిలు’్ల పార్లమెంటు ఉభయ సభల్లో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. ఈ మహిళాబిల్లులో ఎస్సీ, ఎస్టీలకు ముప్పై మూడు శాతం కోటా కల్పించిన ప్రభుత్వం ఓబీసీలను మాత్రం విస్మరించింది.
దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చాలాకాలంగా కోరుతున్నారు. అలాగే విద్య, ఉద్యోగ, పంచాయితీ రాజ్ ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల శాతం పెంచడం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో, జడ్జిల నియామకాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక విజ్ఞప్తులు చేశారు. వాటిలో ఒక్కదానిపై కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు.
అదేవిధంగా ప్రస్తుత నారీ శక్తి వందన్ బిల్లులో కూడా ఓబీసీలకు స్థానం కల్పించకపోవడంతో భారతీయ జనతా పార్టీ వ్యవహారశైలిపై రెండు తెలుగు రాష్ర్టాలతో పాటూ దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు రగిలిపోతున్నారు. దేశ జనాభాలో పురుషులతో పాటూ సమానంగా మహిళలు యాభైశాతం ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా దూసుకుపోతున్నారు. అయినా దేశానికి స్వాతంత్య్రం లభించి డెభ్బై ఆరు సంవత్సరాలు గడిచినా మహిళలు అత్యధిక భాగం ఇంకా సామాజికంగా, ఆర్థ్ధికంగా, రాజకీయంగా నిరాదరణకు గురవుతున్నారు.
ఈ విధంగా నిరాదరణకు గురవుతున్న మహిళల కు రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడు మాత్ర మే మహిళలు పురుషులతో సమానంగా సమాజంలో మనుగడ సాగించ గలుగుతారని సామాజిక వేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళాబిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిం ది. ఇది నిజంగా శుభపరిణామం. ఈ బిల్లును ప్రతి ఒక్కరూ ఆహ్వానించవలసిందే. అదేవిధంగా దేశ జనాభాలో ఓబీసీలు 52శాతానికి పైగా ఉన్నారు. వారంతా కులవృత్తు ల ఆధారంగా జీవనం సాగిస్తున్నా రు. అభివృద్ధ్ది చెందిన సాంకేతికత ను ఆసరా చేసుకొని కార్పొరేట్ శక్తులు ప్రవేశించడంతో ఓబీసీల కులవృత్తులు అత్యధిక భాగం కుదేలయ్యాయి. తద్వారా ఓబీసీల జీవనప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయి.
ఓబీసీలకు విద్య,ఉద్యోగాల్లో 1992లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నాటి నుంచి నేటి వరకు ఓబీసీల జనాభా దేశవ్యాప్తంగా రెండు రెట్లు పెరిగింది. అయినా కేంద్రం రిజర్వేషన్లు పెంచకపోవడం ఆశ్చర్యకరం. గత కొద్ది కాలంగా విద్య, ఉద్యోగాలలో జనా భా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీ సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఈ విషయంలో వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. బీసీల సంక్షేమానికి రాష్ర్టాలు నామమాత్రంగానే నిధులు కేటాయిస్తున్నాయి. 52 శాతానికి పైగా జనాభా ఉన్న ఓబీసీలు ఇప్పటివరకు 14 శాతం మాత్రమే రాజకీయంగా అవకాశాలు పొందారు. రాజ్యాధికారంలో వాటా లభించినప్పుడే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడటంతోపాటూ అణగారిన తమ బతుకులు బాగుపడతాయని ఓబీసీలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓబీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల సాధనకోసం గత నాలుగు దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు నిర్విరామ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.
అయినా కేంద్రంలోని పెద్దలు రిజర్వేషన్లు కల్పించే విషయంలో నామమాత్రంగా కూడా స్పందించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఓబీసీల జనగణన చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ప్రస్తుత నారీ శక్తి వందన్ మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని అధికార, ప్రతిపక్ష, తటస్థ పార్టీలు ఉభయ సభ ల్లో స్పష్టం చేశాయి. ఈ విషయంపై కేంద్రం తన అభిప్రాయాన్ని ఇంతవరకూ వెల్లడించకపోవడం గమనార్హం. అదేసమయంలో 10 శాతం లేని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాంటిది ఓబీసీల సమస్యల పరిష్కారంలో కేంద్రప్రభు త్వం ఎందుకంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అంతుచిక్కడం లేదు. కేంద్రం మహిళాబిల్లులో ఓబీసీలకు కోటా కల్పించకపోయినట్లయితే అన్ని వర్గాల ప్రజలు కేంద్రం ఓబీసీలకు వ్యతి రేక మనే భావించాల్సి వస్తుంది. మహిళా బిల్లు ఆమోదించి ఓబీసీ బిల్లును విస్మరిస్తే బీజేపీతో పాటు, ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రతి రాజకీయ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓబీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
-కైలసాని శివప్రసాద్
94402 03999