దేశంలో ఎన్నడూ లేని పరిస్థితి నేడు నెలకొన్నది. నిరుద్యోగం తాండవిస్తున్నది. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి లేదు. మోదీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే దేశ ప్రజలకు సేవ చేస్తూ ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలుపాలనే ఆలోచన కేసీఆర్కు వచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలో అమలు చేసి ప్రగతి పథంలో నడిపించాలనుకుంటున్నారు. అందుకే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ అనే ఆలోచన ముందుకు వచ్చింది.
కేసీఆర్ ఏది చేసినా దానికి దూరదృష్టి ఉంటుంది. జాతీయ స్థాయిలో పార్టీ పెడుదామనే ఆలోచనను ఈ రోజు ప్రపంచమంతా హర్షిస్తున్నది. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ సేవతో పాటు, ప్రశ్నించే గొంతుకగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు, మేధావులు కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప పాలకుడు ఈ దేశానికి అవసరమంటున్నారు.
ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన తెలుసుకొని ఉండవల్లి అరుణ్కుమార్ హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి వారి ఆలోచన, నిర్ణయాలతో ఏకీభవించారు. అనంతరం- మీడియా లో ఉండవల్లి చేసిన ప్రకటన కేసీఆర్ నిర్ణయ నిబద్ధతను స్పష్టం చేసింది.
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండా లి. మోదీ ఒక నిరంకుశ రాజులా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం ఉం డొద్దనే రీతిలో ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. ఒక రాష్ట్ర సీఎంగా కేసీఆర్ మాత్రమే ధైర్యంగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వారి సంకుచిత భావాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కేసీఆర్కే ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై ఆయనకు చాలా స్పష్టత ఉన్నది. సాగు, తాగు నీరు, విద్యుత్తు, తదితర అంశాలపై చాలా హోం వర్క్ చేశారంటూ ఉండవల్లి కితాబివ్వటం గమనార్హం.
కేసీఆర్ జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ ఆలోచననుఎ న్నారైలు పూర్తిగా ఆహ్వానించారు. కేసీఆర్ పట్ల ఇంత నమ్మకానికి అనేక కారణాలున్నాయి. కేసీఆర్ మం చి కమ్యూనికేటర్.
దేశ రాజకీయాలపై ఎంత పట్టుం దో, పలు భాషలపై కూడా అం తే పట్టుం ది. ఎన్నో పోరాటాల తర్వాత తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టా న్ని కేసీఆర్ ఒక నమూనాగా అభివృద్ధి చేశారు. దేశంలోనే ఎన్నో రంగాల్లో ఈ రోజు తెలంగాణ ముందున్నది. 8 ఏండ్లలోనే 80 ఏండ్ల అభివృద్ధిని సాధించింది. ఇదే ప్రవాస భారతీయులకు నచ్చింది. ఇదే నమూనాను దేశ వ్యాప్తంగా అమ లు చేస్తే అన్ని రాష్ర్టాలు కూడా తెలంగాణ తరహాలో అభివృద్ధి సాధిస్తాయనే నమ్మకం వారిలో ఏర్పడింది. అందుకే దేశానికి కేసీఆర్ లాంటి నేత కావాలని కాంక్షిస్తున్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమం మహోన్నతమైనది. ఆ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు మృతి చెందారు. చివరకు మోదీ మెడలు వంచి రైతులే విజయం సాధించారు.
కానీ ఉద్యమంలో అసువులుబాసిన రైతు కుటుంబాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక ఉద్యమకారుడిగా కష్టనష్టాలు తెలిసిన కేసీఆర్ చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని నిశ్చయించారు. ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున అందజేసి రైతు పక్షపాతినని చాటారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం ఆహ్వానిస్తున్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు తాము తెలంగాణ రాష్ట్రం లో కలుస్తామంటూ ముందుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పెట్టే జాతీయపార్టీతో వారి ఆశలు తీరనున్నాయి.
అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రమూ అమలుచేయలేదు. ఇంటింటికి సురక్షిత నల్లా నీటి కోసం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. అదే విధంగా ‘రైతుబంధు’ పథకాన్ని కేంద్రం పీఎం కిసాన్ పథకంగా అమలు చేస్తున్నది. ఇవ్వాళ కేసీఆర్ ప్రభుత్వ పథకాలే దేశానికి దిక్సూచీగా మారాయంటే అతిశయోక్తి కాదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటమే డబుల్ ఇంజి న్ సర్కార్ అట. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ర్టాల్లో వృద్ధాప్య పింఛన్ రూ.300నుంచి 500 వరకు ఉంటే, తెలంగాణ ప్రభుత్వం రూ.2,016 ఇస్తున్నది. ఇదొక ఉదాహరణ మాత్రమే. తెలంగాణ పథకాలు, పారదర్శక పాలన దేశమంతా అమలు కావాలనే ఆకాంక్ష అన్ని రాష్ర్టాల ప్రజల్లో క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
(వ్యాసకర్త: ఎం.పి (రాజ్య సభ))
వద్దిరాజు రవిచంద్ర