రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ సారథ్యంలోని కూటమి ఘనవిజయం సాధించింది. ఆ కూటమికి నాయకుడు, బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. యుద్ధవీరుడిగా ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఈ గెలుపు మత్తులో ప్రజలు మళ్లీ తనకు పట్టం కడతారనే విశ్వాసంతో చర్చిల్ వెంటనే ఎన్నికలకు వెళ్లాడు. కానీ ఆంగ్లేయ ప్రజానీకం చర్చిల్ పార్టీని ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. ఉద్వేగాలకు లోనుగాకుండా, అభివృద్ధిని కోరుకున్న పరిణత ప్రజాస్వామ్య తీర్పుకు ప్రతీకగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందా ఫలితం.
సరిగ్గా 70 ఏండ్ల తర్వాత అలాంటి పరిణతినే చూపించింది తెలంగాణ ప్రజానీకం! అసాధ్యమనుకున్న స్వరాష్ట్ర కల సాకారమైన వేళ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాదని చంద్రశేఖరరావు (కేసీఆర్) సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే కాంగ్రెస్తో కంటే కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ప్రజలు నమ్మారు. ఉద్వేగాల కంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు.
ఆ అభివృద్ధి చేసే సత్తా గల నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్లో లేదని నమ్మారు కాబట్టి, ఉద్యమ నాయకుడైన కేసీఆర్కే రాష్ర్టాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా అప్పగించారు.ఒకసారి కాదు రెండుసార్లు!
మరి, తనపై ఉంచిన గురుతర బాధ్యతను కేసీఆర్ ఎలా నిర్వర్తించారు? ఎంతమేరకు సక్సెస్ అయ్యారు? తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఆయన ఎంతమేరకు నిలబెట్టుకున్నారు? ఆయన లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది? అనేవి ఆలోచించాల్సిన అంశాలు. ఎన్నికల సంవత్సరం సమీపిస్తున్న వేళ రాష్ట్రంపై ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ దాడులు తీవ్రమైన వేళ ఈ ప్రశ్నలకు నివద్ధిగా సమాధానాలిచ్చుకోవటం తెలంగాణ సమాజానికి అవసరం. తన చైతన్యాన్ని నిలబెట్టుకోవటం కోసమైనా వీటిపై చర్చించటం అత్యవసరం!
కేసీఆర్ చేపట్టిందేమీ పూలపాన్పు కాదు. ధరించిందేమీ బంగారు కిరీటం కాదు. రాష్ట్రం వచ్చిందన్న సంబరమేగాని అరకొర ఆధిక్యంతో అధికారం తెరాస పరమైంది. సరిపోని అధికార యంత్రాం గం, ఆరని రాజకీయ కోపతాపాలు, తేలని విభజన సమస్యలు, ప్రతిదానికీ వాగ్యుద్ధం, పోటీ, శాఖల మధ్య వివాదాలు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో అంటకాగుతూ అడక్కుండానే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేసింది మోదీ సర్కారు. ఐఐఎంలాంటి ఉన్నత విద్యాసంస్థతో మొదలుపెడితే నవోదయ విద్యాలయాల దాకా తెలంగాణ ఏది అడిగినా మొండిచెయ్యే! మరోవైపు ఆంధ్రకు మాత్రం ఇబ్బడిముబ్బడిగా సంస్థలు, నిధులిచ్చారు. వాళ్లకు ఇవ్వటంలో ఇ బ్బందేమీ లేదు. తెలంగాణకు రావల్సినవి, కావల్సినవి ఇవ్వమని విజ్ఞప్తి చేసినా వినకపోవటంపైనే ఆగ్రహమం తా! మోదీ సర్కారుకు తెలంగాణపై ఎందుకీ వివక్ష?
ఒకవైపు సరికొత్త అభివృద్ధికి బాటలు వేసుకుంటూ, తెలంగాణ ప్రయోజనాల కోణంలో అన్నింటినీ మార్చుకుంటూ, రాష్ట్రం వచ్చినా మాకేం వచ్చిందని పెదవి విరుస్తున్న విద్యావంతులకు ఓపికగా నచ్చజెపుతూ, మరోవైపు రాజకీయ ఉపద్రవాలను, రాష్ట్ర ఉనికికే ఉరి వేయాలన్న కుట్రలను ఎదుర్కోవటం అంటే మాటలు కాదు.
రాష్ట్రం సాధించిన కీర్తితోనే చరిత్రలో నిలిచిపోవచ్చు. కానీ కేసీఆర్ ఆ వ్యక్తిగత కీర్తికన్నా రాష్ట్ర కీర్తికి ప్రాధాన్యమిచ్చారు కాబట్టే పునర్ నిర్మాణ బాధ్యత కూడా చేపట్టారు. సరికొత్త అభివృద్ధి నమూనాను, సంక్షేమ నమూనాను సృష్టించారు. సంపదను సృష్టించటంతో పాటు దాన్ని ప్రజలకు పంచటం కూడా ఎలాగో చేసి చూపించారు. ప్రభుత్వం అంటే కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది కాదని, అన్ని వర్గాల వారిని ప్రభుత్వంలో భాగం చేశారు. వివిధ రాష్ర్టాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడి పథకాల అమలును చూసి భేష్ అంటూ వెళుతుండటమే కేసీఆర్ పనితీరుకు నిదర్శనం!
2014కు ముందు దాకా తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలకు మాత్రమే వినిపించే పేరు, ఆర్థిక సాయం అందించటానికి మాత్రమే కేంద్ర బృందాలు పర్యవేక్షించటానికి వచ్చే చోటు. కానీ ఇప్పుడు అభివృద్ధి పథకాల అమలును చూసి పోవటానికి వచ్చే చిరునామాగా మారింది. ఈ 9 ఏండ్లలో తెలంగాణలో రూపుదిద్దుకున్న సరికొత్త ఆర్థిక వ్యవస్థ పరిశోధనార్హం! ఎండి న చెరువుల్లో మళ్లీ నీరు నిలిచిన వైనం, వాటిలోని నీలి విప్లవం (చేపలు), అది తెచ్చిన గ్రామీణ ఆర్థిక మార్పు లు, రోడ్లు- ఇలా ఏ రాష్ట్రమైనా అసూయ చెందాల్సిందే! తెలంగాణ సంక్షేమ రాజ్యాన్ని దాటి శ్రేయో సర్కారుగా మారింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నీటి పారుదల ప్రాజెక్టు అంటేనే దశాబ్దాలు పట్టే ఈ కాలంలో మనతో విభేదాలు, వివాదాలున్న పొరుగు రాష్ర్టాలను ఒప్పించిన కేసీఆర్ తెలివిని రాజనీతిజ్ఞత అనకుండా ఉండగలమా? పట్టెడు మట్టి తవ్వటానికి ఏళ్లు పూళ్లు పడుతున్న కాలంలో పనులు మొదలుపెట్టి మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారించిన పాలకుడిని ఏమనాలి? మొనగాడు అనకుండా ఉండగలమా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ స్థావరం చేసుకుంటున్నా, భారత్లో తొలి ప్రైవేటు అంతరిక్ష రాకెట్ను తెలంగాణ టీ-హబ్ స్టార్టప్లో తయారు చేసినా, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి చూపించినా, ఎండిపోయిన చెరువులన్నింటినీ మూడేండ్లలోనే కళకళలాడేలా చేసినా, అన్నింటికీ మించి కుట్ర లు కుతంత్రాలకు రాష్ట్రం కుప్పకూలిపోకుండా కాపాడినా.. అది అనితర సాధ్యమే. ప్రైవేటు రాకెట్ను గుజరాత్లో తయారుచేసి ఉంటే మోదీ మీడియా గుజరాత్ ను, మోదీని ఇప్పటికి ఆకాశానికెత్తేసేది. దేశానికే ఆదర్శమని కీర్తించేది.
కేసీఆర్ చేసిన పనుల్లో పావు చేసినా చంద్రబాబును ఆకాశానికెత్తేసేవారు. తాను చేయని వాటికే ఇప్పటికీ తన ఘనతగా చెప్పుకుంటున్న దశలో… ఇలాంటివి చేస్తే ఆ ప్రచారం ఎంతెత్తున సాగేదో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ఇన్ని చేసినా, రాష్ర్టాన్ని రాజకీయంగా కాపాడుతున్నా కేసీఆర్ను ఆడిపోసుకునే వారున్నారు. తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని పెదవి విరిచేవారు ఉన్నా రు. నిజంగానే రాష్ట్రం ఏర్పడ్డాక ఆశించిన కొన్నింటిని సాధించలేకపోవచ్చు. అంతమాత్రానికే తెలంగాణ విఫలమైనట్లు అవుతుందా? కేసీఆర్ పనికిరాని ముఖ్యమంత్రి అవుతారా? 9 ఏండ్లలోనే అన్నీ సమకూరేట్లయితే, 75 ఏండ్లలో ఈ దేశం ఎలా మారి ఉండాల్సింది? కేసీఆర్ పని చేయలేదని విమర్శించే ముందు, అన్ని రంగాల్లోని వారు రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత తమ బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తున్నారా? అవినీతికి దూరంగా ఉంటున్నారా? ఉపాధ్యాయులు చదువులు బాగా చెబుతున్నారా? ప్రతి ఒక్కరూ గుండెలపై చేయి వేసుకొని సమాధానం ఇచ్చుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ స్థావరం చేసుకుంటున్నా, భారత్లో తొలి ప్రైవేటు అంతరిక్ష రాకెట్ను తెలంగాణ టీ-హబ్ స్టార్టప్లో తయారు చేసినా, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి చూపించినా , అన్నింటికీ మించి కుట్ర లు కుతంత్రాలకు రాష్ట్రం కుప్పకూలిపోకుండా కాపాడినా..అది అనితర సాధ్యమే.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఉద్యమ కాలం నాటి నినాదం దాదాపు ఈ 9 ఏండ్ల కాలంలో అసలు అమలే కాదని ఎవ్వరైనా గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా? ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగంలో ఏ రాష్ర్టానికీ తీసిపోయి స్థాయిలో ఈ 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలను కల్పించింది. ఇక ప్రభుత్వ రంగంలో కూడా దాదాపు లక్షన్నర కొలువులు నింపిం ది. అయితే ఇందులో ఆశించినంత వేగం లేకపోవటం నిజం. ఇందుకు కారణాలు లేకపోలేదు. కొలువులు ఆలస్యమైంది స్థానికత కోసమే తప్ప మరో కారణం లేదు.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా దాచుకుంటే కేసీఆర్కు ఏమైనా ఒరుగుతుందా? ఆయన ఇంట్లో డబ్బులేమైనా కూడుతాయా? కొలువులిస్తే మంచిపేరు వస్తుంది. మరిన్ని ఓట్లు వస్తాయే తప్ప ఆయనకు పోయేదేమీ లేదుగదా! మరి అయినా ఇవ్వలేకపోవటానికి కారణం తెలంగాణ వారికి లాభం చేకూర్చేలా నియామక వ్యవస్థను మార్చాలనుకోవటం. అందుకు సమయం పట్టడం. అంతేగాని ఇవ్వకూడదని కాదు. ఇవ్వ లేక కాదు. ఇవ్వాలని లేక కాదు. అలా నిబంధనలు మార్చకుండా ఇస్తే, రాష్ట్రం సాధించిన ఫలితం నిరుద్యోగులకు దక్కేది కాదు.
మన విద్యార్థులకు ఇప్పుడే కాదు, శాశ్వతంగా భరోసా కలిగేలా, లాభం చేకూరేలా, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకే వచ్చేలా జోనల్ వ్యవస్థను కేసీఆర్ మార్చారు. ఇప్పుడు జోనల్ వ్యవస్థ మారాక నియామకాల ప్రక్రియ జోరందుకుంది. 15-20 వేల పోస్టులతో భారీ డీఎస్సీ వేసినట్లు ప్రకటిస్తేనే ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా భావించటానికి అలవాటైన మనకు, అంతకంటే ఎక్కువగా వేల సంఖ్యలో గురుకులాలు, మోడల్ స్కూళ్లలో టీచర్ పోస్టులు, ప్రిన్సిపాళ్ల పోస్టులను నింపితే కంటికి ఆనటం లేదు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు వస్తే టీచర్ పోస్టులు వాటంతట అవే పుట్టుకొస్తాయి. భారీ జీతాలు, మంచి సదుపాయాలకు తోడు ఆంగ్లమాధ్యమం పెట్టిన నేపథ్యంలో తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా టీచర్లు చదువులు చెబితే ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య పెరుగుతుంది. పిల్లలు పెరిగితే టీచర్లను భర్తీ చేయకుండా ప్రభుత్వం ఆగలేదు.
ఈ 9 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్నీ పూర్తి చేసి ఉండకపోవచ్చు. అలాగని ఏమీ చేయకుండా మాత్రం నిస్తేజంగా ఉండిపోలేదు. కొన్ని చేయనివి, చేసినా చెప్పుకోనివి, ఎందుకు చేయలేదో చెప్పుకోలేనివి, చేతగాక చెప్పుకోనివి ఉన్నాయి.
కొన్ని అసంతృప్తుల సంగతి ఎలా ఉన్నా కొత్త రాష్ట్రం తెలంగాణను నిలబెట్టడంలో, తలెత్తుకొనేలా చేయటంలో కేసీఆర్ విజయం సాధించారనేది యావత్ ప్రపంచం అంగీకరించే నిజం. రాజకీయంగా కేసీఆర్ అంటే పడనివారు, ఆయనను విమర్శించేవారు, విభేదించేవారు కూడా అంగీకరించే నిజం. దేశంలో కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రం సాధించని దాన్ని ఆయన సారథ్యంలో తెలంగాణ సాధించి చూపిందన్నది నిజం. నిలబడ్డ తెలంగాణ ఉరకలు వేయటానికి సిద్ధమవుతుంటే కాళ్లలో కట్టెలు పెట్టేవారు బయటి నుంచి, ఇంట్లోంచి పుట్టుకొస్తున్నారు. తెలంగాణమా పారాహుషార్!
అభివృద్ధితో పాటు రాజకీయ సుస్థిరత సాధించటం ఈ 9 ఏండ్లలో తెలంగాణ సాధించిన అతిపెద్ద ఘనతగా చెప్పుకోవాలి. ఇందుకు నూటికి నూరు మార్కులు కేసీఆర్కే. ఆయనే లేకుంటే కొత్త రాష్ట్రం తెలంగాణ ఇప్పుడిలా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆవిర్భావం నుంచి కేంద్రం సవతి ప్రేమ ఒకవైపైతే, ఉమ్మడి రాజధాని పేరుతో ఇక్కడే ఉంటూ, పక్కలో బల్లెంలా పొత్తిళ్లలో పసికూనను పొడిచి చంపే భారీ కుట్ర మరోవైపు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి దాకా తెలంగాణ అస్తి త్వాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నాలు అనుక్షణం జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించటానికి, తెలంగాణ వారికి పాలన చేతకాదని నిరూపించటానికి, రాష్ట్రం ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయారని ప్రపంచానికి చాటడానికి, దొడ్డిదారిన మళ్లీ తెలంగాణను దెబ్బతీయటానికి ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా ఎన్నో ఎత్తుగడలు నడిచాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. మునుముందు కూడా నడుస్తాయి.
కేసీఆర్ తనకు ప్రజలు పెట్టిన కిరీటాన్ని చూసి మురిసిపోకుండా, పీఠాన్ని చూసి సంతృప్తి పడకుండా, కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు కాబట్టి నాడు ఓటుకు నోటు దొంగలు; నేడు కాషాయ దొంగలు దొరికిపోయారు! రాష్ట్రం బతికి పోయింది. కేసీఆర్ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల కుట్రలను ఒంటిచేత్తో తుత్తునియలు చేస్తున్నారనే విషయం ఆయన విమర్శకులు కూడా అంగీకరించే నిజం. ఆయనే లేకుంటే ఈ కొత్త రాష్ట్రం ఇవాళ ఎలా ఉండేది? ఆయన అప్రమత్తతే లేకుంటే ఏమై పోయేది అనేది ప్రతి ఒక్కరూ తమకు తాము నిష్పక్షపాతంగా సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ఈ రోజుకూ నిలబడి ఉంది.
ఇప్పటికీ తెలంగాణ అంటే ఓ చిన్నచూపు, తెలంగాణ ప్రజలంటే అలుసు.. అందుకే రాష్ట్రమిచ్చాం అదే గొప్ప అన్నట్లుగా కేంద్రం ప్రవర్తిస్తున్నది. పక్క రాష్ర్టానికి, బీజేపీ పాలిత రాష్ర్టాలకు విద్యాసంస్థలను, నిధులను ఇస్తూ తెలంగాణను మాత్రం విస్మరిస్తున్నది. మరొకరేమో రాష్ట్రం విడిపోయి పదేండ్లవుతున్నా ఇక్కడి ప్రతి ప్రగతికీ నేనే కారణమని చెప్పుకొని ఊగిపోతున్నాడు. నేను కొక్కొరొక్కో అన్నాను కాబట్టే సూర్యుడు ఉదయించాడని కోడి భ్రమించినట్లుగా తెలంగాణ ప్రతి ఘనతకూ తానే బాబునంటున్నాడు. విడిపోయిన వేళ అనుభవంతో ఏదో చేస్తాడని ఆంధ్ర ఓటర్లు ఎంతో నమ్మకంతో అధికారం అప్పగిస్తే, ప్రాధాన్యాలు మరచి, తమ ప్రజల్ని ఏమార్చి, సొంతరాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, తెలంగాణప్రభుత్వాన్ని కూల్చటానికి కోట్ల రూపాయలు, శక్తియుక్తులు ఖర్చు చేసిన పెద్దమనిషి, తన రాష్ట్రంలో విఫలమై మళ్లీ తెలంగాణలో తన పార్టీ పాగా వేయాలని కలలు కంటున్నాడు. ఇలా బాబు నుంచి కేఏపాల్ దాకా (మధ్యలో పవన్లు, షర్మిలల్లాంటి) పిల్లబిత్తిరి గ్యాంగులన్నీ తెలంగాణపై పడుతున్నాయి. వీరంతా బీజేపీతో కలసి తెలంగాణ మనసుల్లో, సమాజంలో మాలిన్యం నింపే కార్యక్రమంలో పడ్డారు. రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు మరో కుట్రకు తెరలేపుతున్నారు.
కేసీఆర్ తనకు ప్రజలు పెట్టిన కిరీటాన్ని చూసి మురిసిపోకుండా, పీఠాన్ని చూసి సంతృప్తి పడకుండా, కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు కాబట్టి నాడు ఓటుకు నోటు దొంగలు; నేడు కాషాయ దొంగలు దొరికిపోయారు! రాష్ట్రం బతికి పోయింది. కేసీఆర్ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల కుట్రలను ఒంటిచేత్తో తుత్తునియలు చేస్తున్నారనే విషయం ఆయన విమర్శకులు కూడా అంగీకరించే నిజం.
ఈ 9 ఏండ్లలో తెలంగాణ సాధించిన ఘనతలను, కేసీఆర్ అందించిన విజయాలను మరుగున పరిచేలా, తెలంగాణ సమాజాన్ని మాయచేసేలా, సమర్థ నాయకత్వాన్ని తక్కువ చేస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎత్తుగడలు సాగుతున్నాయి. తద్వారా తెలంగాణను మళ్లీ ఆత్మన్యూనతలోకి నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. టీఆర్ఎస్పై కుటుంబ వారసత్వ పార్టీగా ముద్రవేయటం; కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బురద జల్లటం, డబుల్ ఇంజిన్తో రాష్ట్రం ముందుకు పోతుందనటం; ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవటం రాజకీయ అవినీతికి నిదర్శనమన్నట్లు విమర్శించటం.. వాటన్నింటి నుంచి రక్షించటానికి తాము వస్తున్నట్లు ప్రగల్భాలు పలుకటం ఇవన్నీ ఆ కుట్రలో భాగం గా జరుగుతున్నవే.
– కమల