కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసనోద్యమాలు చేశాయి. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం… కార్మిక చట్టాలను సరళతరం చేశామని చెప్పుకొస్తున్నది. లెక్కకు మించిన చట్టాలన్నింటిని కలిపి నాలుగు కార్మిక చట్టాల కిందికి తీసుకొచ్చామని నమ్మబలుకుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తున్నది. వేతనాలు, భద్రత, సంక్షేమం, పని గంటలు, సెలవులు, బోనస్, గ్రాట్యుటీ వంటి పలు అంశాలలో కార్మికులకు అనుకూలంగా చర్యలు చేపడుతున్నది.
కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం- పోరాటాల ద్వారా సంఘటిత మైన కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడమే. కార్మికుల హక్కులను కాలరాయటమే. అయినా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువేం ఆశించగలం! కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలనే మోదీ ప్రభు త్వం చూసీ చూడనట్టుగా వ్యహరించింది. కేంద్రం ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కార్మికుల కు అడుగడుగునా అండగా నిలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం.. కార్మికుల సంక్షేమం కోసం, ఆర్థిక సాయం అందించేందుకు ‘తెలంగాణ కార్మిక సంక్షేమ నిధి చట్టం-1987’ (తెలంగాణ అనుసరణ ఉత్తర్వులు 2014) చేసి, దీనిద్వారా సంక్షే మ నిధిని ఏర్పాటుచేసింది. ఆ నిధిని నిర్వహించడానికి కార్మిక సంక్షేమ మండలి కూడా ఏర్పాటైంది. దుకాణాలు, సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధర్మాదాయ, ఇతర ట్రస్టుల్లో పనిచేసే కార్మికుల కోసం ఈ సంక్షేమ నిధి ని ఉపయోగిస్తున్నది. ప్రతి కార్మికుడు తన వాటాగా రూ.2 చొప్పు న, ప్రతి యజమాని కార్మికుని తరఫున రూ.5 చొప్పున నిధికి ఏడాదికిగానూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంక్షేమ మండలి ద్వారా కార్మికులకు వైద్యసాయంగా తక్షణమే రూ.20 వేలు అందిస్తున్నది. ఒకవేళ కార్మికుడు ప్రమాదంలో ఆకస్మికంగా మరణిస్తే ఆర్థిక సాయంగా రూ.30 వేలు అందిస్తున్నది. సహజ మరణం సంభవిస్తే రూ.10 వేలు అందిస్తుంది. కార్మికుడి అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.5 వేలు అందిస్తున్నది. అంగవైకల్యం సంభవిస్తే రూ.20 వేలు అందిస్తున్నది. వివాహ కానుకగా రూ.10 వేలు ఎఫ్డీ రూపంలో అందిస్తున్నది. ప్రసూతి సాయంగా రూ.5 వేలు అందిస్తున్నది. ‘కుటుంబ నియంత్రణ’ చేసుకునే వారికి రూ.2 వేలు అందిస్తున్నది. విద్యా ప్రోత్సాహకం కింద ఒక విద్యా సంవత్సరానికి పదోతరగతి విద్యార్థి నుంచి ఉన్నత చదువులు చదువుకునే కార్మికుల పిల్లలకు వెయ్యి నుంచి రెండు వేల వరకు అందిస్తున్నది. ప్రత్యేక విద్యా ప్రోత్సాహకం ద్వారా వికలాంగ విద్యార్థు లకు రూ.4 వేలు అందిస్తున్నది. కార్మికుల కుటుంబ సభ్యుల ఆర్థిక వృద్ధికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ కార్మికశాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటోడ్రైవర్లకు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నది.
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నది. భవన, ఇతర నిర్మాణరంగంలో పనిచేసే కార్మికుల కోసం ‘1996- కార్మిక చట్టం’ ప్రకారం లబ్ధిదారుడిగా నమోదైన ప్రతీ కార్మికుడి కుటుంబంలో వివా హం జరిగితే రూ.30 వేలు అందిస్తున్నది. ప్రసూతి సాయంగా రూ.30 వేలు అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షల సాయం, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల సాయం, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.4 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నది.
మొత్తంగా కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి. కరోనా లాక్డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఏవిధంగానూ పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకొని అండగా నిలిచింది. ఏడున్నర లక్షల మంది కార్మికులకు వసతులు కల్పించింది. వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడే ఉండి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి నిత్యావసర సరుకులను అందించింది. సొం త ఊర్లకు వెళ్లాలనుకునేవారికి ప్రభుత్వమే సొం త ఖర్చులతో పంపించింది. కేంద్రం తీసుకువచ్చిన కార్మికవ్యతిరేక చట్టాలను వ్యతిరేకించింది. జాతీయ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. కార్మిక సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని కార్మికుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నది.
(వ్యాసకర్త: ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ)
దాస్యం వినయ్ భాస్కర్