మెజారిటీవాదం పేర మతతత్వ శక్తులు దేశంలో చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. మోదీ అధికా రంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా విద్యనే కాషాయీకరణ చేసే కుట్రకు తెరలేపారు. విద్యను ప్రైవేటీకరించటం, విదేశాల్లో చదివేందుకు ఇచ్చే స్కాలర్షిప్లో కోత పెట్టడం కొన్ని వర్గాలకు ఉన్నత విద్య అందకుండా చేయటమే.
తరతరాల వివక్షను రూపుమాపటానికి ప్రజలందరికీ అవకాశాల్లో సమానత్వం ప్రసాదించింది మన రాజ్యాం గం. ఈ స్ఫూర్తిని నాశనం చేసే దిశగా విద్యను ప్రైవేటీక రిస్తూ, కాషాయీకరణ చేస్తూ బీజేపీ విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతున్నది. 2014 నుంచి క్రమేపీ విద్యా పరిశోధ న అవకాశాలు బహుజనులకు అందకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ‘హిందువులం- గంగ సింధు బిందువులం’ అని ప్రవచించే మోదీ పరివారం ఆచరణలో ఎంత నిర్దయగా ఉన్నదో కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పనితీరు ద్వారా తెలుసుకోవచ్చు.
బహుజన వర్గ విద్యార్థులకు చరిత్ర సంస్కృతి వారసత్వం వంటి శాస్ర్తాల్లో అగ్రశ్రేణి విదేశీ విశ్వవిద్యాలయా ల్లో విద్య, పరిశోధనకు తోడ్పడే జాతీయ ఓవర్సీస్ స్కాల ర్ షిప్ను మోదీ ప్రభుత్వం నిలిపివేసింది. అణగారినవర్గాలకు ఈ అంశాలపై పట్టు అందకూడదనే కుట్ర దీంట్లో దాగి ఉన్నది. బ్రిటిష్ కాలంలోనే విదేశీ విద్య ఉపకార వేతనంతో విద్యా పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని అంబేద్కర్ ఇచ్చారు. 1930 పుణే ఒప్పందంలో షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదన వదులుకొని అప్పటి వైస్రాయ్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, సంచార, అర్ధ సంచార, చేతివృత్తుల, భూమిలేని నిరుపేద వర్గాల విద్యార్థుల ఆర్థిక సామాజిక స్థాయి పెంచడానికి విదేశీవిద్య ఉపకార వేతనం ఏర్పాటు చేశా రు. తొలి ప్రధాని నెహ్రూ ఈ పథక విస్తృతిని మరింతగా పెంచి విద్యార్థుల ఫీజు, వైద్యం, ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరించేవిధంగా చేశారు.
దేశంలో విలసిల్లుతున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని మోదీ దెబ్బతీస్తున్నారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యం, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్మించిన అలీనోద్యమం వంటి పాఠాలను సీబీఎస్ఈ ప్రణాళిక నుంచి తొలగించా రు. అలాగే స్వాతంత్య్ర సమరంలో విశిష్ట సేవలు, త్యాగా లు చేసిన ఆజాద్, ఫైజ్ అహ్మద్ వంటి ముస్లిం యోధుల పాఠాలపై వేటు వేశారు. అన్నివర్గాల ప్రజల మధ్య సహజీవన విలువలను పెంచడానికి హర్ష్ మందర్, షబ్నం హష్మి వంటి మాజీ సివిల్ సర్వీస్ అధికారులు స్థాపించిన ACT NOW FOR HARMONY DEMOCRACY సంస్థ పై ఆంక్షలు విధించి వారి పాఠాలను తొలగించారు.
అజాన్, హలాల్, హిజాబ్ వంటి సున్నితాంశాలను వివాదం చేశారు. ఈ అంశాలతో మెజారిటీ మతస్థుల్లో ఇస్లామోఫోబియాను కలిగించి సామరస్యాన్ని భంగపరుస్తున్నారు. రకరకాల కల్పిత ప్రతీకలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను హిందూ మతంలో భాగమని చెప్తూనే వారి ఆహార, ఆహార్య, వివాహ ఎంపిక, ఆరాధన హక్కులకు భంగం కలిగిస్తున్నారు. జీవించే హక్కులో చొరబడి కాలరాస్తున్నారు. తాము చెప్పిన ప్రకారం జీవించకపోతే స్త్రీలను, దళితులను మైనారిటీలను అణగదొక్కుతామని తమ ఫాసిస్టు విధానాలను ప్రకటిస్తున్నారు. దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టేసి మళ్లీ అధికారాన్ని చేపట్టాలని తహ తహలాడుతున్నారు. ఇలాంటి అమానవీయ, అప్ర జాస్వామిక ధోరణులపై యుద్ధం చేసి మన భారత దేశా న్ని సామాజిక సమానత్వం వైపుగా నడిపించాల్సిన ఆవ శ్యకత ఉన్నది. గౌతమ బుద్ధుడి నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి వేలాది మార్గనిర్దేశకుల బోధనలను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అస్నాల శ్రీనివాస్, 9652275560
(వ్యాసకర్త: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)