ఆధునిక సమాజంలో ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గాలి, నీరు వంటి వాటికి అదనంగా విద్యుత్తు వచ్చి చేరింది. విద్యుత్తు లేకుంటే గాలి కూడా స్తంభించేదశకు చేరుకున్నది. మానవాభివృద్ధిని లెక్కగట్టడానికి తలసరి ఆదాయం, విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు తలసరి విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తున్నారు.75 ఏండ్ల సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేడు తలసరి విద్యుత్ వినియోగం 1201 యూనిట్లు మాత్రమే ఉన్నది. ఇతర దేశాలతో పోల్చిచూసినపుడు హస్తిమ శకాంతరంతేడా ఉన్నది.
‘విజయదశమి’ నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయపార్టీని ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్రంగ సంస్థలు, రైతులు, ప్రజలకు దార్శనికత కలిగిన నాయకుని అవసరం ఎంత ఉన్నదో ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నమే ఈ వ్యాసం. చెదరని సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా నిరూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వస్తే చీకట్లు ముసురుకుంటాయని ఆంధ్రా పాలకులు సృష్టించిన భయాలను పటాపంచలు చేస్తూ విద్యుత్రంగంలో తెలంగాణ సాధించిన అపూర్వమైన ప్రగతే అందుకు సాక్ష్యం.
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్నవిద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సామర్థ్యాన్ని ఎనిమిదేండ్లలో రెండింతలు వృద్ధి చేసి అన్నివర్గాల రాష్ట్ర ప్రజలకు 24 గంటలు నిరంతరాయ విద్యుత్తును, ప్రత్యేకించి రైతులకు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కేసీఆర్ హయాంలో కేవలం నాలుగేండ్ల స్వల్ప కాలంలోనే ఇది సాధ్యమైందంటే, ఆ కృషి వెనుకున్న కార్యదక్షత, నిబద్ధత, దార్శనికత అనితరసాధ్యం.
రాష్ట్రంలోని 26 లక్షల 97 వేల పంపుసెట్లకు ఉచిత విద్యుత్తును అందించడమే కాకుండా 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 9.2 లక్షల మందికి, 250 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 57 వేల దోభీ ఘాట్లు, లాండ్రీ షాపులకు, 30 వేల సెలూన్లకు కూడా ఉచిత విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 6,500 పౌల్ట్రీఫారంలు, 5,000 పవర్లూమ్స్కు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్కు రూ. 2 రాయితీ ఇవ్వడం విశేషం. గత ఎనిమిదేండ్లలో సుమారు రూ.92 వేల కోట్లు వెచ్చించి ప్రజలకు, రైతులకు, సంస్థ ఉద్యోగులకు సౌకర్యవంతమైన విద్యుత్ వ్యవస్థను తయారుచేయడం తెలంగాణ రాష్ర్టానికే సాధ్యపడింది.
దేశవ్యాప్తంగా 355 మిలియన్ ఎకరాల సాగు యోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నది. ఇందులో 138 మిలియన్ ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. కాల్వల ద్వారా 34 శాతం, చెరువు తదితరాలతో 10 శాతం, బోర్లు బావుల కింద 56 శాతం వ్యవసాయ భూమి సాగవుతున్నది. అంటే దేశంలోని ప్రభుత్వాలు 47 మిలియన్ ఎకరాలకే సాగునీరు అందించగలుగుతున్నాయి. ఇది ఘోర వైఫల్యంగా పేర్కొనవచ్చు. నదుల అనుసంధానం తదితర బృహత్ కార్యక్రమాల ద్వారా అందరికీ సాగునీరు అందించడమే కాకుండా, నీటి వృథాను అరికట్టి భూగర్భజలాలను కూడా పెంచుకోవచ్చు.
దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల పరిస్థితి (తెలంగాణ రాష్ర్టాన్ని మినహాయిస్తే) దుర్భరంగా ఉన్నది. పాలకులకు రైతుల పట్ల సానుభూతి కొరవడి సరిపోను కరెంటు, గిట్టుబాటు ధరలు లభించక వేలసంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్ష నుంచి లక్షా ఇరవై వేల మెగావాట్ల సౌరవిద్యుత్ను డెడికేటెడ్గా రైతులకు అందుబాటులో తీసుకువచ్చినట్లయితే పగలు 10 గంటలు రైతులకు నిరంతరాయ ఉచిత విద్యుత్ 25 ఏండ్ల వరకు అందించే వీలున్నది. అందుకు కావల్సింది నాయకులకు చిత్తశుద్ధి, అంకితభావం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థల్లో 11,856 కొత్త ఉద్యోగ నియామకాలు చేయడమే కాకుండా 22,722 కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించింది. సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉదారంగా రెండు పీఆర్సీలను, తెలంగాణ ఇంక్రిమెంట్ను, 24/7 వ్యవసాయ ఇంక్రిమెంట్ను ఇవ్వడం ద్వారా సేవలను గుర్తించి తమ పెద్దమనసును చాటుకున్నారు.
ప్రమాదంలో 26 లక్షల ఉద్యోగుల భద్రత: వానకాలం పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి, స్టాండింగ్ కమిటీకి పంపిన ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’పై దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు, ప్రజా, ఉద్యోగ వ్యతిరేక బిల్లును కేంద్రం అమలుపరిస్తే దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమా దం ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థల్లో 11,856 కొత్త ఉద్యోగ నియామకాలు చేయడమే కాకుండా 22,722 కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించింది. సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉదారంగా రెండు పీఆర్సీలను, తెలంగాణ ఇంక్రిమెంట్ను, 24/7 వ్యవసాయ ఇంక్రిమెంట్ను ఇవ్వడం ద్వారా సేవలను గుర్తించి తమ పెద్దమనసును చాటుకున్నారు.
దేశంలోని కోయంబత్తూరు, కలహంది, పలము, మీర్జాపూర్, కబ్ సౌరాష్ట్ర, తిరునల్వేలి, బుందేల్ఖండ్, విదర్భ, పురూలియా లాంటి తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాల ప్రజలు కడగండ్లు కడతేర్చే నాయకత్వం దేశానికి ప్రస్తుతం అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది రైతులు, తెలంగాణ ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు తమకూ అందాలని కోరుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. రైతులకు మీటర్లు పెట్టే ‘విద్యుత్ బిల్లు -2022’కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిఉద్యోగులకు, సంస్థలకు మద్దతుగా గర్జిస్తున్న కేసీఆర్ వంక దేశవ్యాప్త కరెంటు ఉద్యోగులు ఆశగా చూస్తున్నారు.
దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలు, గిరిజన ఆవాసాలు వేల సంఖ్యలో ఇంకా విద్యుదీకరించబడాల్సి ఉందనేది చేదు వాస్త వం. భారతదేశాన్ని పరిపాలించిన మెజారిటీ ప్రధానులు ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్తో నడుస్తు న్నా ఇంకా 62 లక్షల గృహాలు విద్యుదీకరణకు నోచుకోకపోవడం శోచనీయం. ప్రజలకు విద్యుత్ను అందించడంలో, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో కేంద్రప్రభుత్వాలు కావల్సినంత పురోగతిని సాధించలేదు. అందుకే దేశ ప్రజలు కేసీఆర్ దిక్కు చూస్తూ ‘మీ రాక మా అవసరం సార్’ అని నినదిస్తున్నారు.
(వ్యాసకర్త: అధ్యక్షులు టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్)
తుల్జారాం సింగ్ ఠాకూర్
78930 05313