బీజేపీ మతతత్వాన్ని సూటిగా, బలంగా, పదే పదే ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో మేధావులు అంతే స్పష్టంగా నిలవవలసిన సమయమిది. బీజేపీతో పాటు సంఘ్పరివార్ సంస్థల మతతత్తం రోజురోజుకు ఎంత ప్రమాదకరంగా మారుతున్నదో వారు స్వయంగా గమనించి ఆందోళన చెందుతున్నారు. ఈ ధోరణుల వల్ల శాంతిభద్రతలకు, సామాజిక సామరస్యతకు, దీర్ఘకాలంలో భారతీయ సమాజానికి, ప్రజాస్వామ్యానికి వాటిల్లగల హాని ఏమిటో కేసీఆర్కు ఎవరూ చెప్పనక్కరలేదు. ఇటువంటి స్థితిలో మేధావులు కేసీఆర్తో గొంతు కలపటం వారి చారిత్రక బాధ్యత.
ఇప్పుడు మన ఎదుట మూడు పరిస్థితులున్నాయి. ఒకటి, నానాటికి పెచ్చరిల్లుతున్న బీజేపీ మతతత్తం. రెండు, దాన్ని తీవ్రంగా బాహాటంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు. మూడు, మతోన్మాద ప్రమాదాన్ని గుర్తించి కూడా తమలో తాము ఆందోళన చెందటం మినహా ఇప్పటికీ బయటపడి గట్టిగా మాట్లాడని మేధావులు. ఈ వ్యాసం రాస్తున్నది ప్రధానంగా వీరి గురించే.
తెలుగు రాష్ర్టాల్లో విద్యావంతులు, మేధావులు, రచయితలు, కళాకారులు, చైతన్యవంతులు, రకరకాల ఉద్యమకారులు, సిద్ధాంతపరులు, ఆందోళనాజీవులకు కొరత లేదు. వీరందరి కార్యకలాపాలు ఒకప్పటితో పోల్చితే కొంత తగ్గినా ఇప్పటికీ తగిన స్థాయిలో ఉన్నాయి. ఆ కారణంగా వారు దేశంలోని జడలు విప్పుతున్న మతతత్తం గురించి తమ వ్యక్తిగత స్థాయిలో ఆందోళన చెందుతుండటం, పరస్పరం కలిసినప్పుడు కలవరపడుతూ మాట్లాడుకోవటం, ఇందుకు విరుగుడు ఏమిటని మధనపడుతుండటం వాస్తవం. కానీ అది చాలదు. వారు స్పష్టంగా బయటకురావటం అవసరం.
ఈ పరిస్థితులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి విడత అధికారంలో ఉండినప్పుడు కొంత సాధారణ స్థాయిలో కన్పించేవి. బీజేపీ మతతత్తం కూడా సాధారణ స్థాయిలోనే ఉండేది. కానీ ఆయన రెండవసారి ప్రధాని అయిన తర్వాత క్రమంగా విజృంభణ మొదలైంది. అక్కడి నుంచి జిల్లాలు, గ్రామాల స్థాయి వరకు విస్తరించసాగింది. బీజేపీ గెలిచిన రాష్ర్టాల్లో అందుకు అధికారం తోడు కాగా, గెలవనిచోట్ల అధికార కాంక్ష వారిని విచక్షణారహితంగా రెచ్చగొట్టడం మొదలైంది. యథాతథంగా వారి మతతత్తం మొదటి దశలో (2014-2019) కూడా సమాజానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా సుదీర్ఘమైన భారతీయ సంస్కృతికి, హిందూ ధార్మికతకు, నాగరికతకు విరుద్ధమైనది. కేవలం తమ అధికార కాంక్షతో, ధన కాంక్ష తో వారు వీటన్నింటిని ఉల్లంఘించసాగారు. 2019 నుం చి రెండవ దశ మొదలుకావటంతో వీరి దాహం ఒడలు విరుచుకున్నది. పైన చెప్పిన మూడింటి ఉల్లంఘనలు క్రమంగా భయంకర రూపం తీసుకుంటున్నాయి.
మేధావులంతా ఆయనతో బహిరంగంగా గొంతుకలిపి నిలవవలసిన సమయమిది. మరీ ముఖ్యంగా అట్లా మాట్లాడుతున్న నాయకుడు మరెవరూ మన మధ్య లేరు గనుక. బీజేపీ నుంచి ఒత్తిళ్లకు తట్టుకునే సాహసమూ మరెవరు చేయటం లేనందున ఇది ఆవశ్యం. కనుక మేధావులు తాము చేయవలసింది చేయనట్లయితే తెలంగాణ పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని విస్మరించిన వారవుతారు.
ఇటువంటి స్థితిని ధిక్కరించి నిలువరించగలవారు ఎవరన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఏ ధిక్కారమైనా అంతిమంగా ప్రజల భాగస్వామ్యం లేనిదే జరగదనేది సత్యం. అదేవిధంగా, ఒక గొప్ప ప్రజా ఉద్యమం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించుకొని, తమకు ఒక మహత్తరమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఇచ్చుకొని, దశాబ్దాల పాటు ప్రజాస్వామికంగా పాలించుకున్న దేశంలో ఒక మతతత్తశక్తి ఎట్లా వ్యాపించి స్థిరపడింది? అందుకు ఎవరు బాధ్యులనే ప్రశ్న ఉండనే ఉన్నది. అందు కు సమాధానం ఏదైనా.. మన ఎదుట ఉన్నది సమస్యే గనుక, ఇందుకు పరిష్కారం కోసం ప్రయత్నాలు కొందరి వైపు నుంచి 1980ల నుంచే మొదలయ్యాయి. కానీ వివిధ కారణాల వల్ల అవి విఫలమవుతూ బీజేపీ బలం పుంజుకోసాగింది. ఆ దశ ఈ సారికి పరాకాష్ఠకు చేరుతుండటం ఒక స్థితి కాగా, బీజేపీ వంటి శక్తులను వ్యతిరేకించవలసిన కొందరు తమ రాజకీయ స్పృహను, సామాజిక స్పహను కోల్పోయి అధికార కాంక్షతో, ధన కాంక్షతో బీజేపీ వెనుక చేరుతుండటం మరొక స్థితి. అట్లా జాతీయస్థాయిలో, వివిధ రాష్ర్టాల్లో ఎవరెవరు చేరుతూ వస్తున్నారో ఇక్కడ జాబితా రాయనక్కరలేదు. ఇటువంటి జాబితా ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి కూడా మొదలైంది. వారిలో బాహాటంగా చేరేవారు కొందరైతే, తెర వెనుక చేతులు కలిపేవారు మరికొందరు. ఈ ప్రభావాలు సాధారణ ప్రజలపైనా కొంతవరకు కనిపిస్తున్నాయి.
ఇటువంటివన్నీ తట్టుకుంటూ, వీటిలోని ప్రశ్నలకు (ఉదాహరణకు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం) సమాధానం కనుగొంటూ బీజేపీ వంటి అప్రజాస్వామిక శక్తిని ధిక్కరించి నిలబడేందుకు ప్రయత్నిస్తున్న నాయకుడు కేసీఆర్. కేవలం మాటల్లో కాకుండా ఆచరాణాత్మకంగా ఆయన ధిక్కారస్వరం చూసి ఇప్పుడు దేశమే ఆశ్చర్యపోతున్నది. అంతే ముఖ్యంగా తన మాటలలో గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన కేవలం సింగిల్ పాయింట్ అజెండా వలె మతతత్వాన్ని విమర్శించటం కాదు. ఈ స్థితిలో ముడిపడి ఉన్న భారతదేశ చరిత్ర-సంస్కృతులు, ధార్మికత, ఈ సువిశాల దేశ పు వైవిధ్యతలు, సామాజిక సహజీవనాలూ, సామరస్యతలు, రాజ్యాంగ స్వరూప స్వభావాలు, స్ఫూర్తులు, భారతదేశ అంతర్జాతీయ సంబంధ సహకారాలు, మాన వ నాగరికతలూ, చిరకాల సంబంధ బాంధవ్యాలు, భవిష్యత్తులు, అభివృద్ధి అవసరాలు మొదలైన అన్నింటిని వివరించి విశ్లేషించి చెప్తున్నారు. ఎక్కడా అరమరికలు, సందేహాల్లేవు.
అందువల్ల మేధావులంతా ఆయనతో బహిరంగంగా గొంతుకలిపి నిలవవలసిన సమయమిది. మరీ ముఖ్యంగా అట్లా మాట్లాడుతున్న నాయకుడు మరెవరూ మన మధ్య లేరు గనుక. బీజేపీ నుంచి ఒత్తిళ్లకు తట్టుకునే సాహసమూ మరెవరు చేయటం లేనందున ఇది ఆవశ్యం. కనుక మేధావులు తాము చేయవలసింది చేయనట్లయితే తెలంగాణ పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని విస్మరించిన వారవుతారు. ఒక అతి క్లిష్టమైన చారిత్రక దశ లో తమ చారిత్రక ధర్మాన్ని వదిలివేసిన వారవుతారు.
టంకశాల అశోక్