ఇంగ్లీషులో ‘గివ్ అండ్ టేక్’ అని ఒక సామెత ఉంది. వారేమంటారంటే ‘జి’ అనే అక్షరం టేక్ అనే పదంలోని ‘టి’ కంటే ముందు వస్తుంది కాబట్టి, ఏదైనా మనం మొదటగా ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది అని. తెలుగు అక్షరమాలలో చూసినా, ‘ఇ’ అనే అక్షరం ‘ప’ కంటే ముందే వస్తుంది. అందుకే ఇచ్చిపుచ్చుకోవటం అన్న నానుడి వచ్చింది. ఆ ఇచ్చేది గౌరవమైతే అదే మనకు ఎదుటివారు ఇస్తారు. అదే ద్వేషమైతే దానికి త్వరగా పెరిగే గుణం ఉంటుంది కాబట్టి, మనం ఇచ్చిన దానికి రెండింతలై తిరిగి మనకి తగులుతుంది. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు తమ పిల్లలని గమనించి వారి మాటల్లో, చేతల్లో ఏదైనా నకారాత్మక భావాలు, చేష్టలు కనిపిస్తే వాటిని సరిచేస్తారు. సకారాత్మకంగా సమాజంలో ఎలా ఉండాలో నేర్పిస్తారు.
రాష్ట్రప్రభుత్వంతో సత్సంబంధాలు తొలి నుంచీ నెరిపితే, బహుశా ఆ ప్రారంభోత్సవం, ఆ అత్యద్భుత భవనానికి ఆవిడ చేతుల మీదుగా చేయించే వారేమో ముఖ్యమంత్రి! ఆవిడ పేరు శాశ్వతంగా అక్కడ లిఖించబడేది శతాబ్దాల వరకూ! కానీ, ఆ అవకాశాన్ని చేజార్చుకున్నదెవరు?
మరి వయసులో, అధికారంలో, పదవిలో ఉన్నతంగా ఉన్న వారి ఆలోచనలు, చేష్టలు చిన్నతనంగా ఉంటే ఏమవుతుంది? ఆ పదవికి ఉన్న గౌరవం సన్నగిల్లదా? ఒక చిన్న కుటుంబంలోనే కొత్తగా పెళ్ళి చేసుకుని తమ ఇంటికి వచ్చిన కోడలిని అత్తగారు ఆదరించక, ఆరళ్ళు పెడితే సంసారమే విచ్ఛిన్నమవుతున్నది కదా! అలాంటిది, ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండి, రాష్ట్ర పెద్దగా ప్రభుత్వాన్ని విపక్షాలని సంయమనంగా ఉంచి, రాష్ట్రప్రగతికి దోహదం చేస్తూ నిష్పక్షపాతంగా మెదలాల్సిన గవర్నర్ ఒక మధ్యతరగతి ఇంట్లో అత్తగారిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వం ప్రగతి సాధిస్తే సంతోషం వ్యక్తం చేసి, ఏదైనా పొరపాటు జరిగితే మందలించి సరైన దిశలో పాలన సాగేటట్టు చూడాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర గవర్నర్ అసూయాపరురాలైన ఆడబిడ్డలా ప్రవర్తిస్తే ఏం చేయాలి?
ఒక కుటుంబంలా సాగవలసిన రాష్ట్రంలో సలహాదారుగా ఉండవలసిన రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ పాలనని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని నడిపేవారి మీద కువిమర్శలు చేస్తూ, ప్రగతి పథకాల అమలు కోసం తీసుకొచ్చిన బిల్లులు ఆమోదించకుండా, ఉన్నవీ, లేనివీ చాడీలు కేంద్రప్రభుత్వానికి చెబుతూ ఉంటే ఆ రాష్ట్రం ఏంకావాలి? పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో, సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లాగే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవిని రాజకీయాలతో సంబంధాలు లేని మేధావులకి, తమ తమ రంగాలలో నిష్ణాతులుగా ఉన్న వారికి ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాయబారులుగా ఉండటానికి నిష్పక్షపాతంగా ఉండటం ఎంతో అవసరం. రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇస్తూ తమ వంతు సహాయం ప్రభుత్వానికి అందించటం వారి పని. మరి, తెలంగాణ గవర్నర్ ఎలా ఉన్నా రు? ఎలా ప్రవర్తిస్తున్నారు?
కాంగ్రెస్ హయాంలోనే తమ అనుయాయులని విపక్ష పార్టీల ప్రభుత్వాలున్న రాష్ర్టాలకు గవర్నర్లుగా పంపి అక్కడ ప్రభుత్వ పాలన సరిగా జరగకుండా అడ్డుకునే ప్రక్రియ మొదలైంది. కానీ, మతమౌఢ్య బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి గవర్నర్ నియామకాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి.
విచక్షణ, తార్కికత,నిబంధనలు ఏమీ లేకుం డా కేంద్రం ప్రతినిధులుగా బీజేపీయేతర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టడమే తమ ముఖ్య కార్యక్రమం అన్నట్టు ఈ గవర్నర్లు ప్రవర్తిస్తున్నారు. లేకపోతే 10 బిల్లులు పంపితే, అందు లో కేవలం మూడు బిల్లులను-అదీ సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత- ఆమోదించడం ఏమిటి? ఇది పరిపాలనకి అడ్డంకి కాదా? ప్రొటోకాల్ గురించి గొంతుచించుకునే గవర్నర్ మరి ఒక నిర్ణీత సమయంలో ఆమోదమో, అభ్యంతరమో తెలుపవలసిన అవసరం లేదా? ఇది తన చేతల ద్వారా గవర్నర్ చూపుతున్న వ్యతిరేకత. ప్రభుత్వ పనిని ఆపాలనే కుతం త్రమే ఇది.
ఇక మాటలలో గవర్నర్ చూపుతున్న ద్వేషం, అసహనం చాల ఆశ్చర్యకరంగా ఉంది. తన అ త్యున్నత పదవిని మరచి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిలాగే మాట్లాడితే ఎలా? ‘తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం సాధ్యం కాదు’ అని మాట్లాడటం ఏమిటి? తను ఈ రాష్ర్టానికి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చేస్తున్న పనులు, సాధిస్తు న్న ప్రగతి కనపడటం లేదా? వేరే రాష్ర్టాలలో, పోనీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ఏ ఒక్క రంగంలోనైనా తెలంగాణలో జరిగిన ప్రగతిలో పదోవంతు జరిగిందా? మరి, ఈ ప్రగతి గురించి మాట్లాడకుండా అహర్నిశలు రాష్ట్రం గు రించి ఆలోచిస్తూ, పని చేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించటమేమిటి? అసలు ఎవరికైనా విమర్శించే హక్కు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకరిని, లేక ఒక పనిని విమర్శించాలంటే వారు చేసిన మంచిపనులను గుర్తించినప్పుడే వ స్తుంది. ఒక్క మంచి మాటా మాట్లాడకుండా, విపక్షాలలాగే అత్యున్నత పదవిలో ఉన్నవారు మాట్లాడితే వారి స్వంత గౌరవమే కాకుండా, ఆ పదవి పరువు కూడాపోయే ప్రమాదముంది.
మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి పిలువలేదని చెప్పారు. ఇళ్ళల్లో 90 ఏళ్ళు దాటి కళ్ళు, కాళ్ళు సరిగా లేని ముసలమ్మలని ఎక్కడికన్నా తీసుకెళ్ళకపోతే వాళ్ళు అలుగుతారు. ఈ వ్యవహారమూ అలాగే ఉంది. ప్రొటోకాల్ అని తర చూ ప్రస్తావించే ఆమెకు, ఆ సందర్భంలో.. గవర్నర్ను పిలువాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదనే విషయం తెలియదా? అంతేకాదు, రాష్ట్రప్రభుత్వంతో సత్సంబంధాలు తొలి నుంచీ నెరిపితే, బహుశా ఆ ప్రారంభోత్సవం, ఆ అత్యద్భుత భవనానికి ఆవిడ చేతుల మీదుగా చేయిం చే వారేమో ముఖ్యమంత్రి! ఆవిడ పేరు శాశ్వతంగా అక్కడ లిఖించబడేది శతాబ్దాల వరకూ! చిన్నచూపుతో, చిన్న బుద్ధితో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నదెవరు?
మిగతావారిని – అంటే విపక్షాలని, మీడియాని- రానియ్యలేదని చెత్త పలుకుల సంపాదకులు కూడా రాశారు. దానికీ కారణముంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆ భవనాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తాం అన్నాడు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్చేస్తామన్నాడు. తెలంగాణలోనేకాదు, భారతదేశమంతటా కూడా అటువంటి గుమ్మటాలు దర్శనమిస్తాయి. వాటినీ కూల్చేస్తారా? ఇంతకు, తెలంగాణ సంస్కృతి ఆయనకు తెలుసా? ఈ సంస్కృతి సనాతన ధర్మానికి చెందినది. ఏ ప్రాంతం, మతం, భాష వారు ఇక్కడికి వచ్చినా అక్కున చేర్చుకున్నది.
శతాబ్దాల కింద కట్టిన ఆలయాలకి తీసిపోకుండా యాదాద్రిని పునర్నిర్మించిన ముఖ్యమంత్రికి ఈ సంస్కృతి గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. కానీ, అడ్డగోలుగా మాట్లాడే బీజేపీ అధ్యక్షుడికి సంస్కృతి అనే పదానికి అర్థం తెలుసా? కూల్చేవాళ్ళని, పేల్చేవాళ్ళని, తవ్పేవాళ్ళని ఎవరైనా ప్రారంభోత్సవాలకు పిలుస్తారా? ఇప్పుడే కాదు.. ఇక తర్వాతైనా ఇటువంటి వాళ్లు ఆ చుట్టుపక్కలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి!
హెన్రీజేమ్స్ అనే ఒక అమెరికన్ సాహిత్యకారుడు ఒక విషయం చెప్తాడు. మనం పెద్దవాళ్ళు అని వయసుని బట్టి, ఆకృతిని బట్టి అనుకునేవాళ్ళు కొందరు, శారీరకంగా పెద్దగా కనిపించే వాళ్లే తప్ప మనసు, బుద్ధి ఎదగని చిన్న పిల్లలు అని. ఎంతబాగా నిర్వచించాడు అనిపిస్తుంది ఇ లాంటి మనుష్యులని చూస్తే. మరి వీరితో ఎలా వ్యవహరించాలి? వారి పదవీకాలం పూర్తయ్యేదాకా వేచి ఉండాలి. ఘనంగా వీడ్కోలు సభ జరి పి సాగనంపాలి. ఒక మహానుభావుడంటాడు: ‘కొందరు మనింటికి వచ్చి సంతోషపెడితే, కొం దరు మనింటి నుంచి వెళ్ళి సంతోషపెడతారు. మనుష్యులందరూ మంచివాళ్లే. ఏదోరకంగా మ నకి సంతోషం కలిగిస్తారు’ అని. వేచి చూద్దాం. సహనమే కాలానికి తగిన మందు.
-కనకదుర్గ దంటు
89772 43484