ఒక కుటుంబానికి తండ్రిస్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంలోని అందరినీ సమదృష్టితో చూడాలి.అలా ఉన్నప్పుడే తండ్రిగా అతనికి విలువ. దేశం ఒక కుటుంబమైతే దేశానికి పెద్ద ప్రధానమంత్రి. రాష్ర్టాలు పిల్లల్లాంటివి. కుటుంబ పెద్దగా ఆయన అన్ని రాష్ర్టాలను ఒకే విధంగా చూడాలి, కానీ నేడు దేశంలో అలా జరగడం లేదు. సవతి తల్లి కూడా తనకు పుట్టని బిడ్డలనూ ప్రేమగానే చూసుకుంటుంది. కానీ తాము అధికారంలో లేని రాష్ర్టాల పట్ల ఈ దేశ ప్రధాని చూపుతున్న అణచివేత ధోరణి అంతా ఇంతా కాదు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రధాని నరేంధ్రమోదీ తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారు..
టీవీలలో, పత్రికలలో ‘దేశంలో ఫలానాచోట అభివృద్ధి జరిగింది. ఫలానా పనికి శంకుస్థాపన చేశారు. కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చారు’ అనే వార్తా కథనాలు కనిపించాలి. కానీ నేడు మనమేం చూస్తున్నాం. ప్రభుత్వాల కూల్చివేత, ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రశ్నించి ఎదురు తిరిగిన వారిపై ఈడీ, ఐటీ దాడులు’ ఈ వార్తలు మాత్రమే కనబడుతున్నాయి. ఇదేనా ప్రధాని చేసే దేశ ప్రగతి..?
అమిత్ షా హోంశాఖ మంత్రిగా దేశానికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తి. కానీ ప్రభుత్వాలను కూల్చుతూ వారిని అభద్రతాభావంలోకి నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. తమ శాఖకు ఉన్న గౌరవాన్ని దిగజార్చుతూ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ వికృతరాజకీయ క్రీడతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. దేశ ప్రగతికోసం పనిచేయాల్సిన పాలకులు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చుతున్నారు. కేంద్ర సహకారం లేకున్నా స్వశక్తితో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో చిచ్చులు పెట్టి రాజకీయాలకోసం అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారు.
తెలంగాణాకు ఒక్కరూపాయి కూడా సాయం చేయని కపటదారి, వినాశకాలకు కేంద్రబిందువైన విశ్వగురు తెలంగాణ తొవ్వబట్టిన్రు.కానీ తెలంగాణ ప్రజలేమో కైకూ ఆతా క్యా దేతా మోదీ జీ అంటున్నారు. ఇంటికి చుట్టమొచ్చినా పండ్లు తెస్తారు. కానీ తెలంగాణకు మోదీ వచ్చిన ఖర్చు దండుగ. తెలంగాణాకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఈ ప్రధాన మంత్రి ఇక్కడ యువతకు ఏం సమాధానం చెప్పకుండానే వచ్చి వెళ్లారు. తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారు..నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐఎం, నవోదయ విద్యాలయాలను ఎందుకు ఇవ్వలేకపోయారో మోదీ దగ్గర సమాధానం లేదు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ కు ఎందుకు తరలించారో చెప్పరు.
కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ వస్తే వరంగల్తో పాటు పరిసర ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు లభించేవి. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్నీ తరలించుకుపోయింది. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీతో ఎన్నికల్లో గెలిచి మాట తప్పింది. హక్కుగా రావాల్సిన బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వకుండా గిరిజనుల నోట్లో మట్టికొడుతున్నది బీజేపీ ప్రభుత్వం..హైదరాబాద్లో ఐటీఐఆర్ ఏర్పాటు చేయరు. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం చేయరు. దేశమే అబ్బురపడేవిధంగా ఇరిగేషన్ వండర్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు కేటాయించరు. హైదరాబాద్లో వరదలొస్తే బండి పోతే బండిస్తం. కారు పోతే కారు ఇస్తం అని చెప్పి కనీసం అర్ధరూపాయి సాయం చేయలేదు. తెలంగాణ నుంచి ట్యాక్స్ల రూపంలో వచ్చే నిధులను మాత్రం వారి పాలిత రాష్ర్టాల్లో ఖర్చుపెడుతున్నారు తప్ప తెలంగాణకు చేసింది శూన్యం.
ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్కసాయం చేయని మోదీ ఇదివరకే వినియోగంలో ఉన్న ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వచ్చారు. అదే ఊకదంపుడు ఉపన్యాసం మినహా తెలంగాణకు మోదీ పర్యటనతో ఒరిగిందేం లేదు.
సంక్షేమం, అభివృద్ధి పనులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దూసుకుపోతున్నది. ఇటీవల మునుగోడు ఫలితంతో ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి మరోమారు పట్టంకట్టి, కుట్రల పార్టీలకు బుద్ధ్ది చెప్పారు. కేసీఆర్కు దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆదరణను చూసి మోదీ షా ద్వయానికి మింగుడుపడటం లేదు.అందుకే పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూల్చడమే అలవాటుగా పెట్టుకున్న మోదీ,షాలు తెలంగాణాలో ఆ ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు.
ఇక్కడ కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉండ టం, వారి ఎత్తులను కేసీఆర్ ముందే పసిగట్టి కుట్రను ఛేదించడం, దొరికన వారు దేశం విస్తుపోయే విషయాలు చెప్పడంతో మోదీ, షాలకు గుబులు మొదలైంది. ఆ కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా తెలియజేశారు. ప్రజల్లో చర్చ పెట్టారు. బీజేపీ ప్రభు త్వం, మోదీ, షా అన్యాయాలను దేశం ముందు ఏకరవు పెట్టారు. దెబ్బకు ఏమి చేయాలో పాలుపోక దాన్ని డైవర్ట్ చేయటానికి ఇలా తెలంగాణ పర్యటనలు మొదలు పెడుతున్నారు. మోదీ ప్రసంగంలో పదే పదే నన్ను తిడుతున్నారు అంటూ చెప్పుకున్నారు. తెలంగాణకు అన్యా యం చేసే వాళ్ళను తిట్టకుండా మెచ్చుకుంటారా? ప్రగతి నిరోధకులను, ప్రజల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళను ప్రజలెప్పుడూ అసహ్యించుకుంటూనే ఉంటారు.
ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్కసాయం చేయని మోదీ ఇదివరకే వినియోగంలో ఉన్న ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వచ్చారు. అదే ఊకదంపుడు ఉపన్యాసం మినహా తెలంగాణకు మోదీ పర్యటనతో ఒరిగిందేం లేదు. ఈ ఢిల్లీ పార్టీలతో వారి బానిసలతో తెలంగాణకు ఒరిగేది శూన్యం. ఇప్పటికే రాజ్భవన్ను రాజకీయ భవన్లా మార్చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారు.
ఈ అకృత్యాలను అరికట్టేందుకు నాయకత్వం తెలంగాణలోనే పురుడు పోసుకున్నది. నాడు ఉమ్మడి రాష్ట్ర అణచివేతలను తిప్పికొట్టేందుకు సిద్దిపేట నుంచి మొదలైన ప్రస్థానం తెలంగాణను సాధించి పెట్టింది. నేడు మునుగోడులో మొదలైన ప్రస్థానం దేశాన్ని విజయ తీరాలకు చేర్చుతుంది. ముమ్మాటికీ దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారు.. దేశ భవితను మార్చుతారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి, తెలంగాణకు శ్రీరామరక్ష.
తెలంగాణ విజయ్
9491998702