ఒక చిన్న పాయగా మొదలైన గోదావరి.. పెను ప్రవాహంగా ఎలా మారిందో.. ఇప్పుడు దేశ రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ శక్తిమంతమైన బీఆర్ఎస్ పార్టీగా మారబోతున్నది. తెలంగాణ స్వరాష్ట్రమే ఎజెండాగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పురుడు పోసుకున్నప్పుడు.. ఎవ్వరూ నమ్మలేదు. ప్రజలకు మంచి చేయాలన్న మొండి ధైర్యంతో కేసీఆర్ ఎవరితోనైనా కొట్లాడేందుకు, ఎంత వరకైనా వెళ్లేందుకు వెనకాడలేదు. ఆయనలోని ఆ లక్షణమే ఇయ్యాల తెలంగాణకు ఒక నిఖార్సయిన ఉద్యమకారుడిని, స్వరాష్ట్రం కల సాకారం చేసిన రాష్ట్ర పితను చేసింది. ఆనాడు టీఆర్ఎస్కు పట్టం కట్టి సిద్దిపేట చరిత్ర సృష్టిస్తే.. ఈనాడు బీఆర్ఎస్ ప్రస్థానానికి మునుగోడు మరో నాంది పలికింది.
60 ఏండ్ల వలస పాలనలో తెలంగాణ చిక్కి శల్యమైన వేళ.. స్వరాష్ట్రం ఇక తీరని కలగానే మిగులుతుందనే సందర్భంలో కేసీఆర్ పిడికిలి బిగించారు. సబ్బండ వర్గాలను చైతన్యం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకా రం చేశారు. వచ్చిన తెలంగాణలో ప్రజల ఆశీర్వా దం కోరి వారిచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఒక రైతు బిడ్డగా, సాధారణ ఇంటి పెద్దగా, పేదల కష్టాలు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వినూత్న ఆలోచనలతో, విధానాలతో తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
తెలంగాణ ఖ్యాతిని నలుదిశలకు విస్తరిస్తున్న కేసీఆర్ పాలనా దక్షతను ఓర్వలేని కాషాయ పార్టీ పగబట్టింది. అభివృద్ధిలో పోటీ పడే ధైర్యం లేక.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తూ, రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ కుట్రలకు తెరలేపింది. మత విధ్వేషా లు రెచ్చగొడుతూ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టులా మారిన బీజేపీపై కేసీఆర్ సమరశంఖం పూరించి నవ భారత నిర్మాణానికి పిడికిలి బిగించారు. జాతీ య రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సంచలన ప్రకటన చేయడంతోపాటు టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. మొన్న టి ఉప ఎన్నికల్లో విజయం కట్టబెట్టి బీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు బంగారు సద్ది గట్టారు.
దేశంలో నీటి లభ్యత, వాడకంపై బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ దేశ ప్రజలకు విధాన పరమైన పరిష్కారం చూపే అవకాశం ఉన్నది. కేసీఆర్ మొదటి నుంచి రైతు పక్షపాతి. బీఆర్ఎస్తో దేశంలోని రైతులను ఏకం చేయనున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు గా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగు తున్నది. అందుకే అటు కేసీఆర్ను, ఇటు టీఆర్ఎస్ పార్టీని దేశంలో ఏ పార్టీని ఆదరించనంత స్థాయిలో రాష్ట్ర ప్రజలు ఆదరించారు. మునుగోడులో గెలిచిన సీటుతో రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104కు చేరింది. ఆంగ్లో ఇండియన్ను కలుపుకుంటే 105. దేశంలోని అన్ని రాష్ర్టాల అసెంబ్లీల్లో అత్యధిక శాతం సంఖ్యాబలం ఉన్న పార్టీలు మూడే మూడు. మొదటిది ఆప్, రెండు టీఆర్ఎస్, మూడు వైసీపీ. రేపు బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా కలిసొచ్చే అంశాల్లో మొదటిది ప్రజ లు, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల బలమే.
రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి లిఫ్ట్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ది. రాష్ట్రంలో కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇంకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, చేనేతకు చేయూత, పల్లె, పట్టణ ప్రగతి లాంటి విప్లవాత్మక పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్ రేపు బీఆర్ఎస్ ద్వారా ఈ పథకాలను దేశ ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం పండితే.. ఇయ్యా ల కేసీఆర్ కృషి, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా 2.60 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది. దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా ధాన్యం పండించేది.. తెలంగాణనే అని సాక్షాత్తు నీతి ఆయోగే చెప్పింది. ఇలా ఏ రంగం తీసుకున్నా.. విప్లవాత్మక, గుణాత్మక మార్పు లు తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రేపు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ మాడల్ను దేశానికి చూపి బీఆర్ఎస్ ను ఆవిష్కరించబోతున్నది.
దేశంలో నీటి లభ్యత, వాడకంపై బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ దేశ ప్రజలకు విధాన పరమైన పరిష్కారం చూపే అవకాశం ఉన్నది. కేసీఆర్ మొదటి నుంచి రైతు పక్షపాతి. బీఆర్ఎస్తో దేశంలోని రైతులను ఏకం చేయనున్నారు. తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు, రైతు బీమాలను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని ప్రజల నమ్మకం పొందబోతున్నారు. తెలంగాణ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. పరిశ్రమలకు నిమిషం కూడా విరామం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నది. కానీ దేశంలో చాలా రాష్ర్టాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలే. దీన్ని కూడా కేసీఆర్ సవాలుగా తీసుకొని దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని బీఆర్ఎస్ ద్వారా చెప్పబోతున్నారు.
ఏ గుజరాత్ మాడల్ పేరు చెప్పి నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యారో.. ఇప్పుడా గుజరాత్ మాడల్ ఫెయిల్ అయింది. ప్రధానిగా తన సొంత రాష్ట్రంపై ప్రేమతో కోట్లాది రూపాయల ప్రాజెక్టులను అప్పనంగా మళ్లిస్తున్నా.. అక్కడ చెప్పుకోవడానికి పెద్ద గా అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేవు. ఇయ్యాల ఎందులో చూసినా తెలంగాణ గుజరాత్తో పోలిస్తే నెంబర్ వన్గానే ఉన్నది. అందుకే ఇప్పుడు దేశానికి కావలసింది తెలంగాణ మాడల్.
సయ్యద్ నజీం అహ్మద్
90323 16234