గులాబీ ఎప్పుడూ గుబాళిస్తూనే ఉంటుంది. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ సంక్షేమ పరిమళాన్ని గుర్తించి కారు జోరుకు మద్దతుగా నిలిచారు. నోట్ల కట్టలు, మద్యం సీసాలు, తులం బంగారం ఆశ చూపినా.. ఆత్మగౌరవాన్ని గుజరాత్ గులాములకు తాకట్టు పెట్టేందుకు అంగీకరించలేదు. పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టి బీఆర్ఎస్కు పచ్చ జెండా ఊపారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కుట్రదారులకు, ఇంటిదొంగలకు ఒక చెంప పెట్టు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తే తమకు ముప్పు ఏర్పడుతుందని భయపడిన గుజరాత్ గద్దలు టీఆర్ఎస్ను అస్థిరపరచాలని మునుగోడు ఉపఎన్నిక ఎత్తుగడ వేశారు. కానీ మునుగోడు ప్రజలు ఆ ఎత్తులను చిత్తు చేసి, బీఆర్ఎస్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మంచి సంకల్పానికి ప్రపంచంతోపాటు పంచభూతాలు సహకరిస్తాయంటారు. బీఆర్ఎస్ సంకల్పానికి దేశ మంతా సహకరిస్తున్నది.
మునుగోడు ఉపఎన్నిక ద్వారా అధికా ర పార్టీని ఓడగొట్టి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ అధినాయకత్వం జూలై నెలలో కుట్ర పన్నింది. ఇందులో భాగంగా జార్ఖండ్లోని గోడా నియోజకవర్గ ఎంపీ దూబే మధ్యవర్తిత్వంతో రాజగోపాల్రెడ్డిని ఢిల్లీలో అమిత్ షా రహస్యంగా కలిశారు. తమ పార్టీలో చేరి ఉప ఎన్నిక తెచ్చి టీఆర్ఎస్ను దెబ్బకొడితే కాంట్రాక్టులను తాయిలాలుగా ఇస్తామని అమిత్ షా రాజగోపాల్రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. ఈ కుట్రను టీఆర్ఎస్ అధినాయకత్వం ఆ మర్నాడే తెలంగాణ సమాజం ముందుంచింది. తనకు రూ.18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టులను కేంద్రం ఇచ్చిందని రాజగోపాల్రెడ్డే ఓ టీవీ ఛానల్ చర్చలో అప్రయత్నంగా ఒప్పుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు చూశారు. ఇంకేముంది.. ఆ వ్యూహం బెడిసికొట్టి ఓటమి ఖరారైంది.
కావాలనే ఎన్నికల సంఘం కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ను ఈ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి కేటాయించింది. టీఆర్ఎస్కు చెందిన బూర నర్స య్య గౌడ్ లాంటి నాయకులకు పదవుల ఆశ చూపి పార్టీలో చేర్చుకున్నది. కానీ బీజేపీకి దీటుగా టీఆర్ఎస్ కూడా పై ఎత్తులు వేయడం వల్ల ఇయ్యాల మునుగోడులో బీజేపీ ఓటమిపాలైంది. టీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను కూడా అధికార పార్టీ చాకచక్యంగా ఛేదించింది. త్వరలో కొంద రు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ బీజేపీ నేత ముందే చెప్పడం.. ఆ తర్వాత ఓ మధ్యవర్తి సాయంతో స్వామీజీలు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించడం.. వాళ్లు ఈ కుట్రను పోలీసులకు చెప్పడం.. నిందితులు ఆధారాలతో సహా చిక్కడం దేశంలో పెను సంచలనం. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మొదలైన ఎనిమిది రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అక్కడి ప్రజా ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ దెబ్బకు బొక్క బోర్లా పడింది.
కింద పడ్డా తమదే పై చేయి కావాలన్నట్లుగా ఫామ్హౌజ్ కుట్రతో తమ పార్టీకి సంబంధం లేద ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ యాదాద్రిలో ప్రమాణం చేయడం దేవుడు కూడా క్షమించని నేరం. అవకాశం వస్తే బీజేపీ నేతలు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇది నిదర్శనం. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ బెడిసికొట్టడంతో మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తన బహిరంగసభను రద్దు చేసుకున్నారు. పట్టుబడింది బీజేపీ వాళ్లు కానప్పుడు ఆ పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రతిసారి ఎన్నికల్లో గెలిచేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టడం, సానుభూతికి ప్రయత్నించడం, దుష్ప్రచారం లాంటి కుట్రలను అమ లుచేస్తూ ఉంటుంది. నియ్యత్ నీళ్లల్ల వేసినా చెడిపోదన్నట్లు.. మునుగోడు ఉప ఎన్నికకు సం బంధించి టీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా నిజాయితీ చాటుకుంటూనే.. బీజేపీ కుట్రలను ఛేదించింది.
తెలంగాణను అనతికాలంలో అన్నింటా నెంబర్వన్గా నిలిపి.. గుజరాత్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం అని నిరూపించిన నాయకుడు కేసీఆర్. ఆయన ఇలాగే ముందుకు వెళ్తే.. తమ పీఠం ఎక్కడ కదులుతుందోనని భయపడిన బీజేపీ పెద్దలు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయకుండా మోకాలడ్డుతూ వస్తున్నారు. చివరికి ధాన్యం సేకరణలోనూ పంజాబ్పై పక్షపాతం, తెలంగాణపై వివక్ష చూపించారు. వీటన్నింటినీ గ్రహించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పోకడలను బహిరంగంగానే ప్రశ్నించడం మొదలుపెట్టారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఆకలి చావులు, పేదరికం, రైతు ఆత్మహత్యలు ఎందుకు న్నాయని మోదీ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దేశానికి దిశానిర్దేశం చేసేందు కు అద్భుతమైన ప్రణాళిక ఆవిష్కరించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తే తమకు ముప్పు ఏర్పడుతుందని భయపడిన గుజరాత్ గద్దలు టీఆర్ఎస్ను అస్థిరపరచాలని మునుగోడు ఉపఎన్నిక ఎత్తుగడ వేశారు. కానీ మునుగోడు ప్రజ లు ఆ ఎత్తులను చిత్తు చేసి, బీఆర్ఎస్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మంచి సంకల్పానికి ప్రపంచంతోపాటు పంచభూతాలు సహకరిస్తాయం టారు. బీఆర్ఎస్ సంకల్పానికి దేశ మంతా సహకరిస్తున్నది. బీఆర్ఎస్ కారు నిమ్మ కాయలను తొక్కేసిన ట్లు కుట్రల కమలాలను తొక్కేసి మెరుపు వేగంతో జాతీయ రాజకీయాల రహదారిపై దూసుకు పోవ డం ఖాయం. దానికి మునుగోడు ప్రజలు దిద్దిన విజయ తిలకమే ఇంధనం కానున్నది.
బచ్చు శ్రీనివాస్
93483 11117