కదలకుండా ఒక్క గంటసేపు ఉండుమంటనే మనతోని కాదు. కానీ, ఒక మహిళ ముప్ఫై ఏండ్లుగా కదలకుండా మంచం మీదనే గడుపిందంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఆమె పడుతున్న కష్టం చెప్పలేనిది. ఇంతటి పరిస్థితికి కారణమైన బీమారి పేరు ‘మస్యులర్ డిస్ట్రొఫీ (కండర క్షీణత)’. నయం కానీ ఈ మాయరోగంతో బాధపడుతున్న ఆమె పేరే షేక్ నఫీస్.
ఓ రోజు నఫీస్ను కలుద్దామని వాళ్లింటికి పోయిన. చీకటి గదిలో, చిన్న మంచం మీద పడుకొని ఉన్నది. దగ్గరికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా దీశాను. వాళ్లింట్లో ఉన్న గోడలపై అతికించి ఉన్న బొమ్మలు నా కంట్లె వడ్డయి. ‘నీకు బొమ్మలంటే ఇష్టమా’ అని అడిగితే ‘ఔను’ అనే సమాధానం ఇచ్చింది నఫీస్. ‘ఎక్కడ నుంచి తెచ్చారు’ చాలా బాగున్నాయనగానే ‘నేనే వేశాను’ అని చెప్పింది. నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఆమె వేసిన ఓ నలభై చిత్రాలను తీసి చూపించింది. ఒక్కో చిత్రాన్ని చూస్తుంటే అద్భుత కళాఖండాలుగా కనిపించినై. ‘ఇంత గొప్ప కళ నీలో దాగుంది. ఇవి ఎవరికైనా చూపించావా?’ అని అడిగితే ‘నాకెవరు తెలుసని చూపిస్తాను. నేను బయటికి పోయి ఇరువైఏండ్లు అయ్యింద’ని చెప్పింది. నేను అక్కడికి వెళ్లిన విషయాన్ని మర్చిపోయి ఆమె చిత్రాలను చూస్తూ ఉండిపోయిన. ‘ఇంకొన్ని చిత్రాలు గీసి నాకు పంపించు. నేను నీ బీమారీ తగ్గించలేను. కానీ, నాలుగు గోడల మధ్యనే మిగిలిపోయిన నీ కళను ఓ నలుగురికి చూపించే ప్రయత్నం చేస్తా’నని చెప్పి వచ్చిన. ఆమె చిత్రాలన్నీ తీసుకొని సీదా చిక్కడపల్లి పోయి ప్రేములు చేపించిన. వీటితో ఎగ్జిబిషన్ పెట్టాలె. దానికి గెస్టుగా కేటీఆర్ను పిలువాలని మనసులనుకున్న.
కానీ అప్పుడే టెన్షన్ మెదలైంది. అసలు కేటీఆర్ను కలిసి పిలవడానికి అవకాశం ఉం టదా? పిలిచినా ఆయన వస్తరా? అనే డౌట్లు స్టార్టయినై. మొత్తానికి ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసే డేట్ దగ్గరపడుతున్నది. మిత్రుల సహాయంతో కేటీఆర్కు ఈ విషయం తెలియజేసిన. ఈ విషయాలు నఫీస్ వాళ్లకు చెప్పలేదు. ‘నీ చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తున్న ఓ నలభైమం ది వచ్చి చూసినా చాలు నీ కళను బయటకు తీసినవాడినవుతా’నని చెప్పిన. ఎగ్జిబిషన్ రేప నంగ కేటీఆర్కు విషయం తెలిసింది. వీలుంటే చూద్దాం అన్నరంట. మొదటిరోజు పొద్దున 10 గంటలకు ఇరువై ఏండ్లుగా బయటికి రాని నఫీసుతోపాటు వాళ్ల చెల్లెలిని ప్రత్యేక కారులో రవీంద్రభారతికి రప్పించాను.
నఫీస్ దగ్గరికి వచ్చిన కేటీఆర్ ఆమెతో చేయి కలిపి ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ పలకరించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఎగ్జిబిషన్లో చిత్రాలన్నింటిని తిరిగి చూసిండ్రు. గంటసేపు అక్కడే ఉన్న కేటీఆర్ నఫీస్ కుటుంబంతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండిపోయారు.
ఇగ ఆ రోజు కేటీఆర్ నుంచి ఎలాంటి ఫోన్ కానీ రెస్పాన్స్ కానీ రాలేదు. ఈ విషయం తెలిసిన మిత్రులందరూ ‘ఏ కేటీఆర్ ఏడొస్తడు. పెద్దపెద్ద కార్యక్రమాలకు మాత్రమే వస్తడాయ న. గీ చిన్న ఎగ్జిబిషన్కు రాడంటూ’ నాకినవ డేటట్టు మాట్లాడుకుంటున్నారు. నాక్కూడా గీ చిన్న ప్రొగ్రాం ఆయనకు యాది ఉంటదా వస్తాడా అనిపించింది. ఆ రోజు ఎగ్జిబిషన్ ముగిసి ఇంటికి వచ్చిన రాత్రి పది గంటలకు ఫోన్ వచ్చింది. ‘మేం కేటీఆర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం రేపు సార్ వీలు చూసుకొని మీ ఎగ్జిబిషన్కు వస్తానన్నారు’ అని. నాకు మస్తు సంతోషమైంది. వెంటనే దోస్తులకు, నఫీస్ వాళ్లకు ఫోన్చేసి చెప్పిన. రేపు పొద్దున జల్ది రావాలని, వాళ్లకు కేటీఆర్ గురించి చెప్పలేదు. ఎందుకంటే వస్తారని ఆశ పెడితే పుసుక్కున రాకపోతే వాళ్లు నిరాశపడతారని. కొంతమంది అధికారులకు, దోస్తులకు చెప్తే ఎవరూ నమ్మలేదు.
సరే ఏదైతే అదైతదని పొద్దున్నే తయారై ఎగ్జిబిషన్కు వచ్చినం. మధ్యాహ్నం వరకు ఎదిరిచూసినం, ఇంకా రాలేదు. నఫీస్ కూడా ఎక్కువసేపు కూర్చొలేదు కాబట్టి వాళ్లు ‘ఇంటి కి వెళ్లిపోవాలా’ అని అడుగుతున్రు. అప్పుడే కాల్ వచ్చింది ‘కేటీఆర్ సర్ రెండు నిమిషాల్లో అక్కడ ఉంటున్న’రని. సంతోషం తో కిందికి పోయిన. ఓ ఐదు కార్లు రయ్మని వచ్చినయ్. అందులోంచి కేటీఆర్ అన్న దిగంగనే షేక్హ్యాండ్ ఇచ్చి వెల్కం చెప్పిన. సీదా నఫీస్ దగ్గరికి తోల్కపోయిన. కేటీఆర్ను చూసిన నఫీస్ వాళ్లమ్మ, చెల్లెలు ఒక్కసారిగా షాకయ్యారు. నిజమా కలనా అనే విధంగా వాళ్ల మొహాలు ఆనందంతో నిండుగా మారిపోయినై. చింతిం చే ఆ మొహాల్లో చిరునవ్వు వచ్చేసింది.
నఫీస్ దగ్గరికి వచ్చిన కేటీఆర్ ఆమెతో చేయి కలిపి ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ పలకరించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఎగ్జిబిషన్లో చిత్రాలన్నింటిని తిరిగి చూసిండ్రు. గంటసేపు అక్కడే ఉన్న కేటీఆర్ నఫీస్ కుటుంబంతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండిపోయారు. ఈ ఒక్క గంటలో ఆమె ఇరువైఏండ్లు పడ్డ కష్టం మరిచిపోయింది. ‘ఏం కావాలమ్మా’ అంటూ కేటీఆర్ అడిగితే ‘మీ ఇష్టం సర్’ అని నఫీస్ చెప్పింది. వెంటనే సాంస్కృతిక శాఖ డైరెక్టర్కు కాల్ చేసి నఫీస్కు రూ.10 వేల పింఛన్ వచ్చేలా ఏర్పాటుచేయమని ఆదేశించారు. దీంతోపాటు నిమ్స్ దవఖానలో ట్రీట్మెంట్ కోసం డాక్టర్తో మాట్లాడారు. ఇగ ఎగ్జిబిషన్లోని 20 చిత్రాలను మెట్రో స్టేషన్లో పెట్టాల ని ఆయన వెంటవచ్చిన మెట్రో ఎండీనీ ఆదే శించారు. ఎడారిలో నడుస్తున్న వారికి చెరువు కనిపించినట్లుగా జీవితంలో ఒక కొత్త అనుభూతి నఫీస్కు కేటీఆర్ ద్వారా లభించింది. కేటీఆర్ ఆదేశించినట్లుగానే ఒక్క నెలలో జీఓ వచ్చేసింది.
స్పెషల్ ఆర్టిస్ట్ పింఛన్ కింద ఇప్పు డు ఆమెకు నెలకు రూ.10 వేలు వస్తున్నాయి. కేటీఆర్ ఇలాంటి చిన్న కార్యక్రమాలకు రాడు అనేటోళ్లకు సమాధానంగా ఆయన వచ్చి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. నఫీస్ కుటుంబానికి భరోసా లభిం చింది. ఈ మధ్య ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం పెట్టారు. కానీ కేటీఆర్ ఆయనకు తెలియకుండానే ఎంతోమందికి నవ్వుల్ని బహుమతిగా ఇస్తున్నారు. నేను పిలువగానే వచ్చి ఓ అభాగ్యురాలికి అండగా నిలిచినందుకు గుండెను గుండె తాకే లా కేటీఆర్కు అలయి బలయి. సెప్టెంబర్ 30 కండర క్షీణత దినోత్సవం. అందుకే నఫీస్ సంఘటన యాదికొచ్చింది.
(నేడు కండరాల క్షీణత వ్యాధి అవగాహన దినం)
ఖాజా అఫ్రీదీ
83414 76364