ఆధునిక భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు, గొప్ప సంస్కర్త, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురువుగా భావించిన ‘మహాత్మా జ్యోతిభా ఫూలే’ పుట్టినరోజు ఏప్రిల్ 11న దేశంలోని అణగారిన వర్గాలకు పండుగ రోజు. అవిద్య, మహిళా సాధికారత, కుల వివక్షలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి సమాజంలో నిబిడీకృతమై ఉన్న అజ్ఞానాంధకారాల్ని పారదోలిన విజ్ఞానజ్యోతి ఫూలే, ఫూలే,అంబేద్కర్ వంటి మహనీ యుల ఆశయాలనే అజెండాగా అమలు చేస్తున్నారు సీఎం కేసీఆర్.
భారతీయ సమాజంలోని అట్టడుగు వర్గాల బాలికల చదువు కోసం పోరాడి, మహి ళా విద్యను ప్రోత్సహించి దేశ ఔన్నత్యాన్ని పెంచిన గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిభా ఫూలే. వారి బాటలోనే సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ అట్టడుగువర్గాల అభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలుచేస్తున్నారు.
మనదేశంలో, రాష్ట్రంలోనూ అత్యధిక జనాభా బీసీ కులాలదే. పేరుకు మెజారిటీయే అయినా బీసీ వర్గాలకు ఉమ్మడి ప్రభుత్వ హయాంలో పెద్దగా ఒరిగిందేం లే దు. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెచ్చిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా గొప్ప మార్పు కలిగింది. బీసీల్లోని ప్రతి కులానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్ర భుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతం చేస్తున్నది. సీఎం కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రం లో తెచ్చిన ప్రభుత్వ పథకాలతో బీసీలు బలపడ్డారు. కులవృత్తులను బలోపేతం చేయడం ద్వారా మారుమూల గ్రామాలు సైతం పునరుజ్జీవనమై పరోక్ష, ప్రత్యక్ష ఉపాధి కేంద్రాలుగా మారాయి.
ఈ క్రమంలో.. పేదవర్గాలకు నాణ్యమైన విద్య అందితేనే తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని భావించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యావిప్లవానికి శ్రీకారం చుడుతూ గురుకుల విద్యావ్యవస్థను ఎంతో పటిష్టం చేశారు. 2014 కు ముందు కేవలం 19 గురుకులాలలో 8 వేలమంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను 310కు పెంచి వాటికి మహాత్మ జ్యోతిబాఫూలే పేరు పెట్టారు.
వీటిలో 294 రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, 2 మహిళా రెసిడెన్షియల్ వ్యవసాయ కళాశాలలు, 14 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలోని బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 1,65, 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ‘మహాత్మా జ్యోతిబా పూలే’ పేరుతోనే ప్రభుత్వం విదేశా ల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక్కో బీసీ వి ద్యార్థికి 20 లక్షల ఉపకార వేతనాన్ని తెలంగాణ ప్ర భుత్వం అందజేస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2,976 మం ది విద్యార్థులకు రూ.264 కోట్ల ఉపకార వేతనాలను అందించింది. అన్ని వర్గాల వారికి విద్య అందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వేర్వేరుగా 1000కి పైగా గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేయడం గొప్ప విషయం. రాష్ట్రంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కొత్తగా 11 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసింది. డిగ్రీ గురుకులాల ద్వారా వయోజన, ఉన్నత విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం సహకరించకున్నా నర్సింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలను కొత్తవాటిని ఏర్పాటు చేసి తెలంగాణలో విద్యారంగాన్ని సీఎం కేసీఆర్ మరింత పరిపుష్టం చేస్తున్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన ఆహారం, ఉపకారవేతనాలు పెంపు, బాలికలకు ప్రత్యేక కిట్లు, ఉచిత దుస్తుల పంపిణీ వంటి అనేక వసతి సదుపాయాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీసీలకే అత్యధికంగా లబ్ధి చేకూరిం ది. బీసీ కమిషన్ ఏర్పాటు, బీసీలకు వందశాతం సబ్సిడీ రుణాలు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ, 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, ఉచితంగా దాణా, గొర్రెల సం తలు, వధశాలల ఏర్పాటు, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఉచితంగా చేపపిల్లల పంపిణీ – చేపల అమ్మకం కేంద్రాలకు సబ్సిడీ, గీత, మత్స్య కార్మికులకు రూ. 5లక్షల ప్రమాద బీమా, చేనేత కార్మికుల సంక్షేమం – చేనేతరంగం అభివృద్ధికి చర్యలు, నేతన్నకు ‘చేయూ త’ పొదుపు పథకం, బీమా, మరమగ్గాల ఆధునీకరణకు పూర్తిస్థాయి సబ్సిడీ, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్, అప్పరెల్ పార్క్, చేనేత కార్మికుల రుణాలు మా ఫీ, యాభై శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు, వస్ర్తాల కొనుగోలు పథకం, గీత కార్మికుల సంక్షేమం కల్లు దుకాణాల పునరుద్ధరణ, రజకులకు నాయీ బ్రాహ్మణుల కు ఉచిత విద్యుత్, బీసీల్లోని ఇతర వర్గాలకు నేరుగా రుణాలు ఇలా దేశంలో ఎక్కడాలేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం ద్వారా బీసీల ఆత్మగౌరవాన్ని పెంచారు.
పూలే తన జీవితకాలంలో శిశువులు, మహిళలు, గర్బిణీలు, వితంతువుల సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేశాడో.. తెలంగాణ రాష్ట్ర సారథి సీఎం కేసీఆర్ పాలనలో గర్బస్థ శిశువుల నుంచి వృద్ధాప్య మహిళల వరకూ మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి, సాధికారతల కోసం నిరంతర తపనతో అనేక పథకాలను అమలు చేస్తూ, అద్భుతమైన విజయాలను సాధించుకుంటున్నాం.
బాలింతలకు న్యూట్రిషన్ ఫుడ్, ఆరోగ్య పరీక్షలు, ప్రసూతి, కేసీఆర్ కిట్, బాలికలకు ఉచిత విద్య, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, స్వయం సహాయక గ్రూపులకు రుణాలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధాప్య మహిళలకు పిం ఛన్లు..ఒక్కటేమిటీ సమాజం సుసంపన్నమయ్యేందు కు ప్రతి ఒక్కటి అడగకుండానే అమలుచేస్తున్న గొప్ప సంస్కరణశీలి సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో అనేక రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మారి అమలు చేయబడుతుండటం, అభివృద్ధి, సంక్షేమంలో ‘తెలంగాణ మాడల్’ దే శానికే ‘రోల్ మాడల్’ గా మారడం మనందరికీ ఎంతో గర్వకారణం. సీఎం కేసీఆర్ మహాత్మ జ్యోతి బాపూలే ఆశయాలను నెరవేరుస్తూ, ఆయన కలలను సాకారం చేస్తున్నారు. ఈ అభివృద్ధి ఆత్మగౌరవ పతాకను తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా ఎగురవేయడానికి మనంద రం సమష్టి కృషితో ముందు కెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
కోతి కిశోర్ గౌడ్
99125 06685