తెలంగాణ ప్రజలు మరోసారి తమ చరిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు అధికారం కట్టపెడుతున్నారు. అంతే కాదు, ఇప్పటికే వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించిన తెలంగాణ సమాజం వచ్చే పదేండ్లలో మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీయడానికి నేటి ప్రజాతీర్పు శ్రీకారం చుట్టనున్నది.
ఒకప్పుడు తెలంగాణలో పనుల్లేక పొట్టచేత పట్టుకొని బొంబాయి, దుబాయి పోయేది. కడుపు నిండా తిండిలేక, కంటి నిండా కునుకు లేక బతికేది. కానీ, తొమ్మిదేండ్లలో తెలంగాణ ఎంత మారిపోయింది! మంచి నీటికి బాధలేదు. సాగునీటి కలవరం లేదు. కరెంటుకు కొదువ లేదు. సడక్లు బాగుపడ్డయి. వృద్ధులకు ఆసరా పింఛన్ వస్తున్నది. ఎరువులు, విత్తనాలు దొరుకుతాయో లేదో అనే రంది లేదు. రైతుబంధుతో రైతుల కష్టాలు తీరాయి. వ్యవసాయ సంక్షో భం తొలగిపోయింది. దేశానికే అన్నం పెట్టే స్థితికి చేరుకున్నం. ఇవన్నీ ఆగకూడదు.మనం ఇంకా ముందుకు పోవలసి ఉన్నది.
ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఈ సమితులకు సమావేశ మందిరాలను, నిధులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా పెద్ద ఎత్తున నియమించింది. రైతులు మార్కెట్ పరిస్థితులను బట్టి రాష్ట్రస్థాయి వరకు తమ సమస్యలు చర్చించుకొని పరిష్కారాలు సాధించవచ్చు. వ్యవసాయం ఒక్కటే కాదు, గ్రామీణ వృత్తులన్నీ పునరుజ్జీవం పొందేందుకు కేసీఆర్ కృషి చేశారు. గొల్లకుర్మలకు లక్షలాది గొర్రెలు ఇచ్చారు. ఉచిత చేపపిల్లలతో చెరువులు నింపారు. చేపలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు పొందవచ్చు. గొర్రెలతో పాటు మాంసం ఎగుమతి చేయవచ్చు
స్వయం సహాయక బృందాల్లోని లక్షలాది మంది మహిళలు వడ్డీలేని రుణాలు తీసుకుని ఆర్థిక స్వావలంబన సాధించారు. రేపు గ్రామీణ ప్రాంతంలో వ్యవసా యం, చేతి వృత్తుల ఆధారంగా పరిశ్రమలు వస్తే వీరి శక్తిని మరింతగా ఉపయోగించుకోవచ్చు. ఐటీ రంగం జిల్లాలకు విస్తరించింది. దీనిద్వారా దేశ విదేశాల్లో తెలంగాణ బిడ్డలు శాసించే స్థితిలో ఉంటారు.
కేసీఆర్ మానవీ య సంక్షేమంతో గ్రామీణులకు, పేదలకు, పిల్లలకు, వృ ద్ధులకు, మహిళల కు, యువతకు ఇ లా అన్ని వర్గాల వా రికి అవకాశాలు అం దివస్తున్నాయి. ఆ ఒరవడి కొనసాగాలంటే మళ్లీ అధికా రం కట్టబెడుదాం.
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817