ఆనంద వినోదాలకో, వ్యాపారాభివృద్ధికో చేసే యాత్రలే పర్యాటకం. యాత్రికుల ఆకర్షణ, వసతి, వినోదం, వ్యాపారం పర్యాటకంలో భాగం. స్వదేశీ పర్యటనలతో ప్రాంతీయ సంస్థలకు లాభం. అంతర్జాతీయ పర్యాటకం విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావం చూపుతుంది. దుఃఖ మరణాలతో చారిత్రక సంబంధాలున్న ప్రదేశాల యాత్రలు చీకటి పర్యాటకం.
స్థల ప్రభావ ప్రత్యేక లక్షణాలే యాత్రికులను చీకటి పర్యాటకానికి పురిగొల్పుతాయి. ఆసక్తికర రహస్య కుట్ర లు తెలుస్తాయని చాలామంది చీకటి ప్రదేశాలకు వెళతా రు. 16వ శతాబ్దంలో లండన్ బహిరంగ ఉరిశిక్షలను ప్రజలు ఆసక్తిగా చూశారు. 1815లో నెదర్లాండ్, నెపోలియన్ మధ్య బెల్జియంలో వాటర్లూ యుద్ధాన్ని ప్రజలు బండ్లపై నుంచి తిలకించేవారు. మృత్యుచర్యలను చూడ టం ప్రజల చిరకాల సంప్రదాయ అలవాటు. ఇటీవల ఈ అలవాటును సైద్దాంతికంగా అధ్యయనంచేశారు. అమెరికా పాత్రికేయ రాజకీయ వ్యంగ్యవాది, పాట్రిక్ జేక్ ఓ‘ రూర్కె’ 1988లో తన వార్సా, మనాగువ, బెల్ఫాస్ట్ యాత్రను ‘నరకంలో సెలవు’గా వర్ణించారు. లండన్ సిటీ వర్సిటీ సామాజికశాస్ర్తాల ఆచార్యుడు క్రిస్ రోజేక్ 1993 లో ‘నల్లమచ్చ పర్యాటకం’ అన్నారు. స్కాట్లండ్ గ్లాస్గోలో ఈ అంశంపై మొదటి అధ్యయనం జరిగింది. 1996లో గ్లాస్గో కాలెడోనియన్ వర్సిటీ అధ్యాపకవర్గ సభ్యులు జాన్ లెనన్, మాల్కోల్మ్ ఫోలేలు చీకటి పర్యాటక పదకల్పనచేశారు. 1996లోనే గ్లాస్గో స్కాట్లండ్ వర్సిటీ పర్యాటక మార్కెటింగ్ ఆచార్యుడు ఏవీ సీటన్ ‘థాన’ పర్యాటక పదం వాడారు. 2014 నాటికి ఈ అంశంపై అనేక అధ్యయనాలు జరిగాయి. చీకటి పర్యాటకం మీద అనుభవాధార పరిశోధనలు తక్కువగా జరిగాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 112 దేశాల్లో 900 చీకటి పర్యాటక స్థలాలున్నాయి. వీటిలో సాధు జంతువులను చంపిన దృశ్యాల ప్రదర్శనశాల ‘రోమ్ కొలోజియం’, మత మారణహోమాల్లో తలలు తెగిన శవాల శ్మశానాలు ‘కాటకూంబ్స్’ వంటివి ఉన్నాయి. బ్రిటన్లో లండన్ టవర్, ఎడింబర్గ్ కోట లాంటి అమానవీయ ఘటనాస్థలాలను వారసత్వ కేంద్రాలు చేశారు. పలువురిని బాధితులుగా మార్చిన బెర్లిన్ గోడ ప్రత్యేక ఆకర్షణ స్థలంగా ఉండేది. నేడు కూలిన గోడ పర్యాటక స్థలం. 1688 రక్తరహిత విప్లవంలో రెండవ జేమ్స్ను గద్దెదింపారు. ఆయన సమర్థకులను జాకొబైట్స్ అంటా రు. 1746 ఏప్రిల్ 16న బ్రిటిష్ సైన్యం జాకొబైట్స్ను ఓడించింది. ఈ కులోడెన్ యుద్ధ స్థలం చీకటి పర్యాటక ప్రదేశం.
రొమేనియా జాతీయ స్మారకచిహ్నం ‘బ్రాన్ కోట’, ‘పొయెనరి శిథిల కోట, వేల్స్లో ‘బ్యూమరీస్ గావోల్ జై లు’, లండన్ చెరసాలలో ఘోర హంతకుడు జాక్ రిప్పన్ ప్రదర్శనశాల, జపాన్ హిరోషిమా శాంతి స్మారకవనం, ఉక్రెయిన్ అణుప్రమాద చెర్నోబిల్, గ్రౌండ్జీరో(న్యూ యార్క్లో 2011 సెప్టెంబర్ 11న కూల్చి వేతకు గురైన ప్రపంచ వాణిజ్య కేంద్రం ) ఆస్చ్విట్జ్ కేంద్రీకరణ శిబిరం (రెండవ ప్రప ంచ యుద్ధంలో ఆక్రమిత పోలండ్లో నాజీ లు నడిపిన కేంద్రీకరణ భవనం), చైనా పాత రాజధాని నాంజింగ్ లో 1937 డిసెంబర్ 13 సామ్రాజ్యవాద జపాన్ సైన్య నరమేధ నాంజింగ్ స్మారక మందిరం, తుయో ల్ స్లెంగ్ నరమేధ ప్రదర్శనశాల (కాంబోడి యా రాజధాని నాంపెన్లో 17 లక్షల పౌరు లను, 17 వేల ఖైదీలను చంపా రు), దక్షిణ కొరియా జెజు తిరుగుబాటు స్థలాలు (కొరియా విభజనకు వ్యతిరేకంగా 1948-49 మధ్య జెజు తిరుగుబాటు జరిగింది), కెనడా క్యూబెక్ రాష్ట్రంలో లా ఫర్మ్ వద్ద స్పిరిట్ సరస్సు నిర్బంధ కేంద్రం, వాషింగ్టన్ హోలొకాస్ట్ మెమోరియల్ మ్యూజియం, కెనెడీ హత్యాస్థలం జెట్టిస్బర్గ్, అమెరికా అణుపరీక్షా స్థలం బికిని అటా ల్, 1936-39 మధ్య అంతర్యుద్ధం జరిగిన స్పెయిన్ లోని బాల్చైట్, ఐర్లండ్ లీప్ కోట, అలంకరణకు 50 వేల కళేబరాలు వాడిన చెచియా, సెడ్లాక్ ఒసువరి క్యాథలిక్ చర్చి, ఇటలీ పాంపోయి శిథిలాలు ప్రపంచ ప్రసిద్ధ చీకటి పర్యాటక ప్రదేశాలు.
1982లో ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ పై దండెత్తింది. తీవ్రవాద బృందం హెజ్బుల్లా ప్రతిఘటించింది. వేల పాలస్తీనియన్ పౌరులు చనిపోయారు. 2010లో హెజ్బు ల్లా సైనికస్థావరం మ్లీట్లో స్మారకచిహ్నం నిర్మించారు. చైనా సిచువాన్ రాష్ట్రంలో 2008 మే 12 నాటి భూకంపంలో పిల్లలతో సహా 90 వేల మంది చనిపోయారు. 2009లో యింగ్సివు పట్టణంలో స్మారక భవనం కట్టారు. 1994 ఏప్రిల్-జూలైలలో తుత్సి మైనారిటీల నిర్మూలనకు రవాండా హుతు మెజారిటీలు 8 లక్షల మందిని చంపారు. హతుల ఎముకలు, పుర్రెలతో రవాండాలో నరమేధ స్మారకం నిర్మించారు.
జలియన్వాలాబాగ్లో బ్రిటిష్ పాలకులు నిరాయుధులైన వేలమందిని కాల్చి చంపారు. భారతీయ యుద్ధ వీరులను బంధించిన అండమాన్ నికోబార్ ద్వీపాలలోని కాలాపానీ జైలు, గాంధీని చంపిన స్థలం ఢిల్లీ గాంధీ స్మృతి. భోపాల్ విషవాయు దుర్ఘటన, ఉత్తరాఖండ్ రూపకుంద్ అస్థిపంజరాల సరస్సు ఇవన్నీ పర్యాటక ప్రాంతాలే.
(వ్యాసకర్త : ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)
-సంగిరెడ్డి హనుమంతరెడ్డి
94902 04545