తెలంగాణను, ముఖ్యమం త్రి కేసీఆర్ను ఇష్టపడే ఓ కలం మూగబోయింది. ముక్కుసూటిగా, నిష్కర్షగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజకీయ విశ్లేషకుడు, రచయిత ఇలపావులూరి మురళీమోహనరావు సోమవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందడం తెలంగాణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిం ది. పుట్టింది ఆంధ్రాలోనే అయినప్పటికీ, ఏండ్ల కిందటే ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీపడని ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఇలపావులూరి నిర్మొహమాటంగా సమర్థించేవారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదని పేర్కొనేవారు. తనకు తెలంగాణ అంటేనే ఇష్టమని ఆయన చాలాసార్లు చెప్పారు.
ఇలపావులూరి మురళీమోహనరావు రచనాశైలి తెలంగాణ ప్రజలకు నచ్చేది. ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు ఆయన సోషల్మీడియాలో రాసుకునే ఆర్టికల్స్ను బాగా ఇష్టపడేవారు. క్రమంగా కేసీఆర్ అభిమానించే సైన్యంలో ఆయన ఒదిగిపోయారు. ‘నాకు కేసీఆర్ అంటే ఇష్టం. మీకు నచ్చకపోతే నా పోస్టులు చూడకండి’ అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ఏడాదిన్నర కిందట ఆయనకు ‘టీ’ న్యూస్ యాజమాన్యం నుంచి పిలుపు వచ్చింది. అప్పటినుంచి ఆయన ఆ ఛానల్లో రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. ఆగస్టు 1న ఆయన ఫేస్బుక్లో ‘ముఖ పుస్తకంతో ప్రయాణానికి పదేండ్లు’ శీర్షికతో ఒక పోస్ట్ను విడుదల చేశారు. అందులో చివరలో ఇలా రాశారు.
‘నా జీవితాన్ని మేలిమలుపు తిప్పిన ఒక మహానాయకుడి గురించి వివరంగా చెప్పాలి. సమయం వచ్చినపుడు రాస్తాను. ఆయనకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదు.’
ఈ మాటలు ఇలపావులూరి ఎవరి గురించి రాసి ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి విషయాలనైనా ధైర్యంగా రాయ డం ఆయన నైజం. తెలంగాణ మట్టిలోనే ప్రేమ ఉంది. నిజాయితీ ఉన్నవాళ్లు ఎవ్వరైనా తెలంగాణలో ఉంటూ తెలంగాణను ఇష్టపడకుండా ఉం డలేరు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనసున్నవా ళ్ళు ఎవరైనా అభినందించకుండా ఉండలేరు. ఆయన స్వతహాగా మంచి రచయిత. తెలంగాణ పట్ల, కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని దాచుకోలేకపోయారు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా, రచయితగా తెలంగాణ ప్రేమను సంపాదించుకొని మన నుంచి హఠాత్తుగా సెలవు తీసుకున్న ఇలపావులూరి మురళీమోహనరావుకు తెలంగాణ ప్రజల తరఫున నా కన్నీటి నివాళి.
-మిట్ట సైదిరెడ్డి
(వ్యాసకర్త: ముఖ్యమంత్రి పీఆర్వో)