దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించడం సాధ్యమేనా? నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ విషయం ప్రకటించినప్పుడు, జాతీయ రైతు సంఘాల నేతలతో ప్రస్తావించినప్పుడూ దీని గురించి చర్చ జరిగింది. తెలంగాణలో 26 లక్షల పంపు సెట్లకు నిరంతర ఉచిత విద్యుత్తును అందిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హామీని విశ్వసించాల్సి ఉంటుంది. జాతీయ పార్టీలకు సవాల్గా మారిన ఈ ఉచిత విద్యుత్తు అంశం సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ…
మన దేశంలో 355 మిలియన్ ఎకరాల నికర సారవంతమైన సాగు భూమి అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 138 మిలియన్ ఎకరాల భూమికి మాత్రమే సాగునీటి లభ్యత ఉంది. పంజాబ్, హర్యానా, యూపీ, ఏపీ, తెలంగాణ వంటి రాష్ర్టాలను కలుపుకొంటే కాలువల ద్వారా 34 శాతం భూమికి; బావులు, బోరు బావుల ద్వారా 56% భూమికి సాగు నీరు లభిస్తోంది. చెరువులు తదితర సాంప్రదాయ నీటి వనరుల ద్వారా 6% భూమికి నీరందుతోంది.
దేశ వ్యాప్తంగా కరెంటుపై ఆధారపడిన బా వులు, బోరు బావులు 2 కోట్లకు పైగా ఉన్నా యి. 75 లక్షల వరకు డీజిల్ పంపు సెట్లు వాడకంలో ఉన్నట్లు అంచనా. రైతులు ప్రతీ సంవత్సరం 2 లక్షల 50 వేల నుంచి 5 లక్షల వరకు కొత్తగా బోరు బావులను తవ్వుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం సగటున 91కు వేలకు పైగా కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇస్తోంది. మిగతా రాష్ర్టాల్లో కొత్త వ్యవసాయ కనెక్షన్లు తీసుకోవడం చాలా కష్టంతో కూడుకుని పనిగా తయారైంది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 5 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 2 లక్షల 5 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది.
2021-22 సంవత్సరానికి గాను 1520 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇందులో వ్యవసాయ వినియోగం 22 శాతం మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 45,100 మెగావాట్ల డిమాండ్తో వ్యవసాయ వినియోగం సుమారు 334 బిలియన్లు ఉంటుంది. యూపీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు 75 నుండి 85 శాతానికి పైగా విద్యుత్తును వాడుకుంటున్నాయి. 5000 మెగావాట్ల సౌర విద్యుత్తును ప్రభుత్వ రంగంలో తీసుకు రాగలిగినట్లయితే రైతులకు కనీసం పగటి పూట విద్యుత్తు సాధ్యపడుతుంది. ఇందుకోసం మెగావాట్కు రూ.4 కోట్లు ఖర్చు చేసినా రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయి. దీని వల్ల 25 సంవత్సరాల వరకు ఉచిత సౌర విద్యుత్తు లభ్యమవుతుంది. ఒక మెగావాట్ ద్వారా సుమారు 350 పంపుసెట్లకు కరెంటు ఇవ్వవచ్చు. అంటే, 1.75 కోట్ల పంపుసెట్లకు పగటి పూట ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది.
నిర్ణీత సమయాలలో 5 లేదా 6 గంటలు కరెంటు సరఫరా చేయడం వల్ల రైతులందరూ ఒకేసారి మోట్లార్లు స్విచ్ ఆన్ చేయడం వల్ల ఒక్కసారిగా గ్రిడ్ మీద ఒత్తిడి పెరిగి, లోఓల్టేజీ సమస్యలు, ఫ్రీక్వెన్సీలో మార్పులు తలెత్తడంతో పాటు తరచుగా మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులకు, విద్యుత్ సంస్థలకు ఆర్థిక నష్టం కలుగుతున్నది. 24 గంటల విద్యుత్తు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం గణనీయంగా తగ్గింది. దీని వల్ల రైతులకు ఏడాదికి సుమారు రూ.20-25 వేల రూపాయలు వృథా ఖర్చు కాకుండా ఆదా అవుతున్నది. లో డ్ గ్రాఫ్ కూడా సమాంతరంగా ఉంటున్నది.
2021-22 సంవత్సరానికి గాను 1520 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇందులో వ్యవసాయ వినియోగం 22 శాతం మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 45,100 మెగావాట్ల డిమాండ్తో వ్యవసాయ వినియోగం సుమారు 334 బిలియన్లు ఉంటుంది.
ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న విద్యుత్తును లెక్క గట్టే సమయంలో మార్కెట్లో అత్యధిక ధర పలికే థర్మల్ విద్యుత్తు రేట్లలో లెక్క గట్టి ఎక్కువగా చూపిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే అతి చౌక హైడల్ జల విద్యుత్తు నిజానికి రైతుల సంపదే. యూనిట్ సుమారు రూ.2.50లకు లభిస్తున్న జల, సౌర, పవన తదితర పునరుత్పాదక విద్యుత్తును పరిగణనలోనికి తీసుకున్నట్లయితే రైతులకు ఇస్తున్న విద్యుత్తు పాలకులు చెబుతున్నట్లుగా ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా దేశ వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల పైచిలుకు వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల విద్యుత్తును అందించడానికి రూ.1.25 లక్షల కోట్లకు మించి ఖర్చవదు.
రైతులు మంచి దిగుబడులు సాధించినప్పుడు దేశ జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది. రైతులు సహకార పద్ధతిలో వ్యవసాయం చేసి తమ ఉత్పత్తులను నేరుగా వ్యాపారులకు అమ్మకుండా ఆహార శుద్ధి పరిశ్రమలకు తరలించి వాటిని పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చి మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ ఆహార శుద్ధి పరిశ్రమలను దగ్గరలో ఉన్న పట్టణాల్లో రైతు స్థాపించుకోవాలి. ఇలా చేసినప్పుడు అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి. విద్యుత్ సంస్థలు ప్రధానంగా సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకోవాలి. రైతులు ఎనర్జీ ఎఫిషియన్సీ పంపు సెట్లు వాడేలా ప్రోత్సహించి బోర్ల దగ్గర, ఫీడర్ల చివరన, సబ్-స్టేషన్ల వద్ద కెపాసిటర్లు బిగించాలి. 24 గంటలు కరెంటు అందుబాటులో ఉన్నప్పుడు రైతులు ఇబ్బడిముబ్బడిగా మోటార్లు ఆన్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి. తెలంగాణ ఆచరించి చూపిన ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు’ నమూనా భారత దేశ రైతులందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రాత్మక పాత్ర పోషించాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: తుల్జాసింగ్ ఠాకూర్ , 78930 05313 , అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)