డీఆర్డీఓ లాంటి ప్రతిష్ఠాత్మక రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. ఇక్కడ
డిఫెన్స్ కారిడార్కు అవసరం ఉన్నంత మేర భూమి అందుబాటులో ఉన్నది.
అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఈ నగరంలో డిఫెన్స్ కారిడార్ పెట్టమని
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
కానీ, కేంద్రం మూడో కంటికి తెలియకుండా ఆ కారిడార్ను ఉత్తరప్రదేశ్కు కేటాయించింది.ఈ నిర్ణయం రాత్రికి రాత్రే జరగడం శోచనీయం. ఈ విషయమై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అడిగితే ఆమె ఆ నిర్ణయం జరిగిపోయిందని చెప్పడం విడ్డూరం!
కేంద్రమంత్రి హోదాలో కిషన్రెడ్డి హైదరాబాద్కు ‘ఆయుష్ హెల్త్ సెంటర్’ ప్రకటించారు. ఆయన హోదాకు, ఆయన చేసిన ప్రకటనకు కనీస గౌరవం ఇవ్వకుండా దాన్ని కూడా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు తరలించింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై చిత్తశుద్ధి లేదనే విషయం మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబా ద్లో ప్రతిష్టాత్మక ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సహకారంతో కేసీఆర్ నేతృత్వంలో ఇది ఏర్పాటైంది. ఇది ఓర్వలేని కేంద్రం వెంటనే గుజరాత్లోని గాంధీనగర్లో పోటీగా మరో ‘అంతర్జాతీయ అర్బిట్రేషన్ సెంటర్’ను నెలకొల్పింది.
మొన్నటికి మొన్న ‘బల్క్ డ్రగ్ పార్క్’ విషయంలోనూ ఇదే తంతు. హైదరాబాద్ ఫార్మా రంగంలో ముందు వరుసలో ఉన్నది. ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరున్నదనే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్తూ ‘బల్క్ డ్రగ్ పార్క్’ హైదరాబాద్లో పెట్టండని దరఖాస్తు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దాన్ని కూడా గుజరాత్లోని జంబుసార్లో నెలకొల్పుతున్నారు. ఇక విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లాంటి హామీలను కేంద్రం కావాలనే అటకెక్కించింది. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఎంత తీవ్ర అన్యాయం చేస్తున్నదో తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటివి బోలెడున్నాయి.
మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఏమైనా పెట్టారంటే, అది వెనుకబడిన రాష్ట్రం అనుకోవచ్చు. కానీ గుజరాత్ ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. అయినప్పటికీ అన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలను అక్కడికి తరలించడానికి గల కారణమేంటో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? ఆ మాటకొస్తే దేశంలో అత్యధిక పన్నులు కడుతూ దేశాభివృద్ధికి దోహదపడుతున్న మొదటి ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. దీన్ని కేంద్ర ప్రభు త్వం కాదనగలదా? మరి తెలంగాణపై ఎందుకీ వివక్ష? ఎందుకీ చిన్నచూపు? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? ఇదేనా టీమ్ ఇండియా? గతంలో సీమాంధ్ర పాలకుల వివక్షకు గురై ఆ సంకెళ్లు తెంచుకొని స్వీయ పాలనలో ఇప్పుడిప్పుడే తెలంగాణ వడివడిగా అభివృద్ధి బాట పడుతున్నది. మళ్లీ ఇప్పుడు ఉత్తరాది నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ వివక్షకు గురి కావాల్సిందేనా? మళ్లీ వెనకబాటుతనానికి లోనవ్వాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వం ఇంత వివక్ష చూపుతున్నా రాష్ట్ర బీజేపీ నాయ కులు నోరు మెదపరు! సరికదా వారికి మంగళ హారతులు పడుతూ, ఆహా మోదీ… ఓహో మోదీ అంటూ అందలం ఎక్కిస్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైతే ఏకంగా మోదీని దేవుడంటూ కీర్తిస్తున్నారు! మొన్నటికి మొన్న ఆయన కేంద్ర హోం మంత్రి షా చెప్పులు మోయడం గర్హనీయం. ఆయనకు పదవి ఇచ్చి, రాష్ర్టానికి ఎంత ద్రోహం చేసినా పట్టించుకోనితనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల తెలంగాణ ఇంతటి వివక్షకు గురైతుంటే, ఇంకా ఏం మొహం పెట్టుకొని పోలోమని బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు? రాష్ర్టానికి కేంద్రం వల్ల ఏమి ఒరిగిందని ‘ఓకే ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ అధికారం కోసం అభ్యర్థిస్తున్నారు?
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఎవరికి తెలంగాణ అంటే చిత్తశుద్ధి ఉన్న దో గుర్తిస్తారు. వారికే పట్టం కడతారు. లేని పక్షంలో తెలంగాణ వందేండ్ల వెనకబాటుకు లోనయ్యే అవకాశం ఉన్నది సుమా! తస్మాత్ జాగ్రత్త!!
కేంద్ర ప్రభుత్వం ఇంత వివక్ష చూపుతున్నా రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు మెదపరు! సరికదా వారికి మంగళ హారతులు పడుతూ, ఆహా మోదీ… ఓహో మోదీ అంటూ అందలం ఎక్కిస్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైతే ఏకంగా మోదీని దేవుడంటూ కీర్తిస్తున్నారు! మొన్నటికి మొన్న ఆయన కేంద్ర హోం మంత్రి షా చెప్పులు మోయడం గర్హనీయం. ఆయనకు పదవి ఇచ్చి, రాష్ర్టానికి ఎంత ద్రోహం చేసినా పట్టించుకోనితనాన్ని
తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
-త్రిగుళ్ళ సాకేత రామ శర్మ