కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనీ, సదరు కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తున్న డిమాండ్ను ఆ పార్టీలో మెజార్టీ నాయకులు తప్పుపట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎన్నికలకే పోలేదు. అప్పుడే కాంట్రాక్టుల గురించి మాట్లాడితే.. పార్టీకి విరాళాల కోసమే ఇదంతా చేస్తున్నట్టు తప్పుడు సంకేతాలు వెళతాయని వాపోయారట. పైగా ఇటీవల ఒక ప్రెస్మీట్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు అందరి నుంచి కమీషన్లు తీసుకునేవారని షర్మిల అన్నారు. తమకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఎందుకు ఇవ్వటం లేదని పరోక్షంగా అర్థం వచ్చేలా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోలింగ్ అవుతున్నాయో చూపిస్తూ, వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని వైఎస్ఆర్టీపీ నేతలు హితవు పలికినట్టు లోటస్ పాండ్ వర్గాల కథనం.