వరంగల్, ఉదయ్పూర్ డిక్లరేషన్లను పక్కన పడేసి, తాజాగా రేవంత్రెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు వినికిడి. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులుగా కర్ణాటకకు గాలి జనార్దన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు కిరణ్కుమార్రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తుందట. రేవంత్రెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రెడ్డి కులస్థులకు పార్టీ పగ్గాలు అప్పగించాలి, ముఖ్యమంత్రులుగా కూడా వారినే చేయాలి. దీంతో అన్ని రాష్ర్టాలలో రెడ్డి నాయకుల కోసం కాంగ్రెస్ హైకమాండ్ గాలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్కడో డౌట్? తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్గా రేవంత్రెడ్డికే కదా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు అప్పగించింది. మరి అలాంటప్పుడు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి ఎందుకు రాలేదు. పైగా అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది? ఈ పాయింట్ కూడా రేవంత్ తన డిక్లరేషన్లో ఎక్కడైనా రాసాడేమోనని కొందరు వెతికే పనిలో పడ్డారట.
– వెల్జాల