క్రైస్తవులు ఎన్నో పండుగలు జరుపుకొంటారు. కానీ Christmas festivalకు ఉన్న ప్రాధాన్యం వేరు. ఇది క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పం డుగ. ఏటా డిసెంబర్ 25న ఈ పండుగను జరుపుకొంటారు. క్రిస్మస్ ను 24వ తేదీన క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే అనే పేర్లతో మూడురోజుల పాటు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ప్రకారం.. జీసస్ ఒక పశువుల పాకలో జన్మించారు. జీసస్ జన్మించగానే మేరీ మాత ఆయన్ను వస్ర్తాలతో చుట్టి కొట్టంలోనే వదిలివెళ్లారని బైబిల్ చెప్తున్నది. బైబిల్ ప్రకారం.. జీసస్ పుట్టిన రాత్రి పక్క ఊరి పొలాల్లో కాపర్లు గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పు డు ఒక దేవదూత ఆకాశం నుంచి గొర్రెల కాపర్ల ముందు దిగారు. ఆ దేవదూత వెలుగులకు గొర్రెల కాపరులు భయపడ్డా రు. అప్పుడు దేవదూత గొర్రెల కాపరుల తో ‘భయపడకండి. మీకు ఒక శుభవార్త చెప్తాను. బెత్లెహేంలోని ఓ పశువుల కొట్టంలో లోక రక్షకుడు జన్మించారు. ఆయన అందరికీ ప్రభువు.. రక్షకుడు. వస్ర్తాలు చుట్టిన ఓ పసికందు పశువుల పాకలోని దానా తొట్టెలో పడుకున్నాడు. మీకు ప్రభువు ఆనవాళ్లు చెప్తాను’ అని అంటుండగా.. ఆ పొలం మొత్తం దేవదూతలతో నిండిపోయింది. దేవదూతలందరూ జీసస్ను కీర్తిస్తూ గీతాలు ఆలపించారు. అనంతరం వారు అదృశ్యమయ్యారు.
వెంటనే గొర్రెల కాపరులు పాకకు వెళ్లారు. తొట్టెలో ఉన్న పసికందును చూసి ఆశ్చర్యపోయారు. దేవదూత చెప్పినది నిజమని వారంతా నమ్మారు. రెండు వేల ఏండ్ల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి ఏసుక్రీస్తు జన్మించిన రోజు రాత్రి జరిగిన ఘటన ఇది. అందువల్ల ఏసుక్రీస్తు జన్మించిన మరుసటి రోజు డిసెంబర్ 25న క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకొంటారు.
ఈ పండుగ సందర్భంగా క్రైస్తవులు తమ ఇండ్లు, చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. క్రిస్మస్కు ముందురోజు రాత్రి శాంతాక్లాజ్ గగనం నుంచి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తారని క్రైస్తవులు నమ్ముతారు. పండుగ రోజు వెదురు కర్రలు, రంగు రంగుల కాగితాలతో నక్షత్రాన్ని తయారుచేస్తారు. దాన్ని ఇంటి కప్పుపై అలంకరిస్తారు. ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఏర్పాటుచేస్తారు. చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గీతాలు ఆలపిస్తారు. బంధువులు, స్నేహితుల ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్తారు. పేదలకు వస్ర్తాలు, బియ్యం, నగదు దానం చేస్తారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు విరబూశాయి. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ఈ పండుగ ప్రాధాన్యాన్ని అప్పటి తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. క్రైస్తవుల సాధక బాధకాలను అర్థం చేసుకోవడంతో క్రైస్తవుల జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది.
-జాధవ్ పుండలిక్ రావు పాటిల్
94413 33315