తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయ ని మరోసారి నిరూపితమైంది. కేంద్రం ప్రకటించిన 46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడమే దాని కి తాజా ఉదాహరణ.
జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమల్లో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. వివిధ విభాగాల్లో కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ 13 అవార్డులు దక్కించుకొని తొలిస్థానంలో నిలవడం రాష్ట్ర ప్రజానీకానికే గర్వకారణం.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాలు ఊసులోనే లేకుండాపోయాయి. దాదాపు ప్రతి విభాగంలో నూ తెలంగాణ గ్రామాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఒక్కో విభాగంలో మూడు ర్యాం కులకుగాను ఒక్కో రాష్ట్రం నుంచి ఒక గ్రామా న్నే ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ది. ఆయన పాలనలో పల్లెలకు పట్టాభిషేకం జరిగిందనడంలో సందేహం లేదు. ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి తాగునీరు అందుతున్నది. సీఎం కేసీఆర్ వచ్చా క ఆసరా పింఛన్లు అందుతున్నాయి. మొత్తంగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయనడానికి ఈ అవార్డులే సాక్ష్యం.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న ‘రైతుబంధు’, ‘రైతుబీమా’, ‘24 గంటల ఉచిత విద్యుత్’ పథకాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించాలి. అంతేకాకుండా గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్న ది. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులు గా చేసేందుకు ‘రైతు వేదిక’లను ప్రభుత్వం నిర్మించింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచేందుకు ‘కేసీఆర్ కిట్’ లాంటి పథకాలను అందిస్తున్నది. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. స్వరాష్ట్ర ఫలాలు కళ్ళముందు కనపడుతున్నా యి. తెలంగాణలో పల్లె, పట్నం, తండాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ దిక్కు దేశమంతా చూస్తున్నది. ఇలాంటి అభివృద్ధి, సంక్షేమం తమ రాష్ర్టాల్లో ఎందుకు జరగడం లేదని పొరుగు రాష్ర్టాల ప్రజలు అక్కడి నాయకులను నిలదీస్తున్నారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తమ రాష్ట్రంలో పోటీ చేస్తే బాగుండేదని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు తమక్కూడా అందేవని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంగా ప్రజలు భావిస్తున్నారు.
(వ్యాసకర్త: ప్రజా సంబంధాల అధికారి)
ఆలేటి రమేశ్
99487 98982