డెన్మార్క్ ఉత్తర ఐరోపాలో ఉన్న దేశం. ఈ దేశంలో రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థ అమల్లో ఉన్నది. దాని రాజధాని కోపెన్ హేగన్. వారి మాతృభాష డానీష్. మతం క్రైస్తవం. ఈ దేశంలో సహకార పాల ఉత్పత్తి పరిశ్రమ ప్రసిద్ధి గాంచింది. ఆదాయం కూడా ఆశించిన స్థాయిలోనే ఉన్నది. డెన్మార్క్లో ముప్పై ఏండ్ల కిందట ఒకటిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల్లో వచ్చిన అభిప్రాయ భేదాలతో విడిపోయింది. దీంతో ఒక వర్గం డెన్మార్క్ కమ్యూనిస్టు పార్టీ (డీకేపీ)గాను, మరో వర్గం కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ డెన్మార్క్ (కేపీఐడీ )గా రూపాంతరం చెందాయి. అయితే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ రెండు పార్టీలు తిరిగి ఒకటయ్యాయి.
సహజంగా డెన్మార్క్లో పలు రంగాల్లో కార్మికు లు, శ్రామికులు ఎక్కువ. వారి మద్దతు కోసం, వారి హక్కుల కోసం గతంలో ఈ రెండు పార్టీలు పోరాడాయి. కార్మిక హక్కుల సాధన కోసం రెండు పార్టీలు కృషిచేశాయి. రెండు పార్టీల ఆశయం ఒకటైనప్పుడు విడిపోయి సాధించేదేమీ లేదు. అందుకోసమే చిత్తశుద్ధితో రెండు పార్టీలు ఒకటిగా ఉండాలని తీర్మానించుకున్నా యి. కార్మికుల అభ్యున్నతే వీరి లక్ష్యం. అందుకు రెండు పార్టీలు కృషిచేశాయి. సమస్యల సాధనకు ఒకటిగా ఉం డాలని నిర్ణయించుకున్నాయి. విడిపోయిన ముప్పై ఏండ్ల తర్వాత ఇప్పుడు ఒకటిగా కలసిపోవడం స్వాగతించవలసిన విషయం.
రెండు పార్టీలు కార్మికోద్యమాన్ని బలోపేతం చేయడం, విభేదాలు లేకుండా ఐక్యంగా ముందు కువెళ్లటం అనే ప్రధాన సూత్రంపై ఒక అంగీకారానికి వచ్చాయి. డెన్మార్క్ ప్రజలు కూడా ఈ విలీనాన్ని సమ్మతించారు. పార్టీకి అండగా ఉంటామని చెప్పారు. విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ సహకారం తమకు ఉండాలని రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. డెన్మార్క్లో సహకార పాల ఉత్పత్తి ద్వారా ఆదాయం బాగా వస్తోంది. అక్కడ కార్మికులకు అందవలసిన హక్కులపై గతంలో రెండుపార్టీలు తీవ్రంగా కృషిచేశాయి. వాటిలో కొన్ని నెరవేరి, కొన్ని అసంపూర్తిగా మిగిలాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఏకం కావడంతో ఆ కార్మికుల్లో ఆశ లు చిగురించాయి.
రాజధాని కోపెన్ హెగన్లో రెండు పార్టీల విలీనం జరిగింది. ఇక ఏ విభేదాలు లేక అం దరం కలసికట్టుగా ముందుకు సాగుతామని రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. అంతర్జాతీయ శాంతి కోసం తమ పార్టీ కృషి చేస్తుందని, ఆ దిశలో ఉద్రిక్తతలు తొలగించడానికి కృషిచేస్తామని ఉమ్మడిగా ప్రకటించారు. ముఖ్యంగా ‘అంతర్జాతీయ శాంతి కావాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి’ అని ఆ రెండు పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. ఆ దిశలో కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఐక్య కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ‘ఇక మాకు ఏ విభేదాలు ఉండవు. విడిపోవడం కంటే, విడిపోయి కలవటం అనేది గొప్ప చర్య’ అని ఐక్య కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.
‘కార్మికుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తామని ఆ వర్గాలకు మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఇలా ముప్పై ఏండ్ల కిందట విడిపోయిన కమ్యూనిస్టులు ఏకం కావడం ఒక స్ఫూర్తినిచ్చే విషయం. మన దేశంలోనూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా విడిపోయాయి. డెన్మార్క్ పరిణామం చూసిన తర్వాత మన దేశంలోనూ కమ్యూనిస్టులు ఒకటైతే వారికి ఎదురుండదు. కమ్యూనిస్టులు ఎప్పుడూ పేద ప్రజల పక్షమే. వారి కోసం పోరాటాలు చేస్తారు. కమ్యూనిస్టుల పంథానే పోరా టం. అంత మంచి ఉన్నత లక్ష్యం ఉన్న కమ్యూనిస్టులు డెన్మార్క్లో ఒకటిగా కలవడం స్వాగతించాల్సిందే. మనదేశంలోనూ కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఉమ్మడిగా ప్రజల కోసం పోరాడాలని కోరుకుందాం.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027