తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో చదువుకునే అవస్థ ఉండకూడదని,పౌష్టికాహారానికి లోటులేకుండా విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 23లక్షల మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ను అందిస్తుండటం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలితీర్చేందుకు ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథ కాన్ని ప్రారంభించింది. తొలిసారిగా హైస్కూల్ విద్యార్థులకూ బ్రేక్పాస్ట్ను అమలు చేయనున్నారు. బడి పిల్లలకు మెనూలో వేడి వేడి ఇడ్లీ సాంబార్.. పూరీ ఆలుకుర్మా.. ఉగ్గాని పల్లిచట్నీ.. రాగిఇడ్లీ పల్లీ చట్నీ.. రవ్వకేసరి తదితర టిఫిన్లు అందించనున్నారు. మిల్లెట్స్కూ ప్రాధాన్యం ఇచ్చి, రాష్ట్రంలో 23 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చేలా విద్యాశాఖ ఈ పథకాన్ని రూపొందించింది. విద్యా ర్థులకు నాణ్యమైన విద్యనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో పోషకాహారాన్ని అందిం చేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. బడి ప్రారంభానికి ముందే ఉదయం 9.30 గంటలకు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ను వడ్డిస్తారు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు దీన్ని అమలుచేస్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం పూట భోజనంలో సన్నబియ్యం, రాగిజావా, కోడిగుడ్లు, పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉన్నది. ప్రస్తుత పథకం ద్వారా మొత్తం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పనిదినాలలో బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు. ఈ పథకానికి దాదాపు రూ.400 కోట్ల వ్యయం కాగలదని అంచనా. ఇప్పటికే గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యా హ్న భోజనం, వారంలో 3 రోజులు కోడిగుడ్లు ఇస్తున్నారు.
సర్కార్ బడిలో ఇచ్చే ఈ పోషకాహారం ప్రాముఖ్యం:
పిల్లలలో తగ్గిన అభ్యాస సామర్థ్యాలకు ప్రధాన కార ణం పోషకాహార లోపం. చిన్నతనంలో ఆహార అభద్రత కారణంగా పఠనా సామర్థ్యం, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. దీనివల్ల చాలామంది పసి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పథకాల ద్వారా పిల్లలను తిరిగి పాఠశాలకు రప్పించడంతో పాటు పౌష్ఠికాహారం అందించడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తిని పెంపొందించడం, తద్వారా ఉన్నతులుగా తీర్చి దిద్దడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేం ద్రంగా చేసి బంగారు భవితకు బాటలు వేస్తున్నది. ప్రభు త్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం, రాగిజావా వంటివి అందిస్తున్న ప్రభుత్వం తాజాగా సీఎం బ్రేక్ఫాస్ట్ను ప్రారంభించింది. దీనిద్వారా రెండు పూట లా ఆహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నది.
-సీవీవీ ప్రసాద్
80196 08475