నేడు చేకూరి రామారావు జయంతి
తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పేరుగాంచిన మేధావి చేకూరి రామారావు. ‘చేరా’గా అందరికీ సుపరిచితులైన ఆయన తెలుగు వాక్యాన్ని విశ్లేషించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్త విమర్శ ధోరణిని ప్రవేశపెట్టారు.
చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లందుపాడు గ్రామంలో 1934 అక్టోబర్ 1న జన్మించారు. తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ (ఎంఏ) పట్టా తీసుకున్నారు. ‘తెలుగు భాషా పరివర్తన సిద్ధాంతం’పై పరిశోధన పట్టా పొందారు. నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి సాహిత్యానికి కొత్త మార్గాన్ని చూపారు. కొత్త విమర్శ ధోరణిని ప్రవేశపెట్టా రు. చేరా రాసిన ‘స్మృతి కిణాంకం’ వ్యాస సంపుటికి 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
తెలుగు వాక్యం, పద వర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై ఆయన చేసిన పరిశోధన అతి తక్కువ కాలంలోనే మన్ననలు పొంది వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశమైంది. పోటీ పరీక్షలకు, ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగపడింది. తెలుగులో వెలు గులు అనే లోతైన పరిశీలన వ్యాసాల సంకలనం రచించి ఆచార్య నాయని కృష్ణకుమారికి అంకితం ఇచ్చారు. చేరా మాస్టారు ‘సాహిత్య విమర్శ-పరా మర్శ’ పేరిట వివిధ కవుల ప్రక్రియలు, వాదాలు, విధానాలు, కవిత్వ ఉద్య మాలపై, ‘చేరాతలు’ రచించారు.
తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలు చేసి, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చేకూరి రామారావు 201 4 జూలై 24న 70 ఏండ్ల వయసులో పరమపదించారు. ఆయన భౌతికంగా మనల్ని విడిచిపెట్టి వెళ్లినా, ఆయన సాహిత్యానికి చేసిన సేవలు ఆయనను కలకాలం బతికిస్తాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అలాంటి సాహిత్య విమర్శకుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించు కోవడం భాషాభి మానుల కర్తవ్యమే కాదు, బాధ్యత కూడా.
యాడవరం చంద్రకాంత్గౌడ్
94417 62105