Telangana | తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జరిగిన చర్చ తెలంగాణ అభివృద్ధి వాదులను ఒకింత ఆందోళనకు గురి చేసింది. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది ఈసారి కష్టమే అని. ఇట్లాంటి మాటలు మీడియాలో, బయటా చక్కర్లు కొట్టాయి. ప్రజల్లో వచ్చిన అసంతృప్తే దీనికి కారణమని ఎవరికి వారే తీర్పులిచ్చారు. ఇవన్నీ చూసిన అభివృద్ధివాదుల అప్పటి ఆందోళన వాస్తవమైందే. కానీ ఓట్లు వేసేటప్పుడు గుర్తుంచుకుని మరీ కారుపై వేసి 88 సీట్లల్లో గెలిపించి మరోసారి ప్రగతి పాలనకు ప్రజలు పట్టం కట్టారు. నాటి తెలంగాణ రాష్ట్రసమితి నేటి భారతీయ రాష్ట్రసమితి సరికొత్త అభివృద్ధి నమునాను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
తొలి విడత కేసీఆర్ పాలనా కాలంలో ఎవ్వరికీ పెద్దగా అర్థం కాలేదు. కానీ తమ జీవితాల్లో మంచి మార్పే జరుగుతున్నట్టుందనే అనుభ వం వారికి వచ్చింది. ఎవరు తమకు మేలు చేస్తారు. ఎవరు మాటలు చెప్తారనే విషయాలను చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తించింది.తాజాగా ప్రజలు బీఆర్ఎస్ పాలన పట్ల గులుగుతున్నారనే చర్చ జరుగుతున్నది. మునుపటి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెందుకు వేశారు? వారు గుర్తించిన అంశాలేమిటి? మరి ఇప్పుడు గులుగుడు విషయం ఎందు కు వచ్చింది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు చాలా సులభంగానే దొరుకుతాయి. తెలంగాణ ప్రజ ల ఆలోచనను లోతును అర్థం చేసుకోవాలంటే ముందుగా కేసీఆర్ ఆలోచనను ప్రజలు అర్థం చేసుకున్న తీరు తెలియాలి. ఇది తెలిస్తే గులుగుడు వెనుకున్న కారణాలు తెలుస్తాయి. ఇంతకు ముందెప్పు డూ తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి గురించి ఆలోచించిన నాయకులు లేరు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సకల జనుల సర్వే నిర్వహించా రు. ఉద్యమ సమయంలో తాను అధ్యయనం చేసిన సమస్యలకు పరిష్కారాలను ప్రజల ద్వారా తెలుసుకునే గొప్ప ప్రయత్నం చేశారు. ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. అందుకు అనుగుణమైన ఆర్థిక నమూనాను తయారు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసి గ్రామ ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు. ఆ తర్వాత రైతుబంధు పథ కం తీసుకొచ్చారు. సాగునీటి రంగంలో సముూల మార్పులకు నాంది పలికారు. ఐదేండ్ల కాలంలో కొన్ని ఫలితాలు సాధించారు. ఆ తర్వాత ఇంక చేయడానికి ఏముంది? కొత్తగా ఏముంటుంది? ఇట్లా కొందరు ప్రచారాలు ప్రారంభించారు.
అసలు విషయం ఇక్కడే ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పటికే లక్షలాది మందికి వచ్చాయి. కేసీఆర్ పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. అందుకున్నవారు ఆనందంగా ఉంటే అందుకోనివారు గులుగుతున్నారు. అయితే ఒకేసారి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కనుక మరోసారి కేసీఆర్ సీఎం అయి తే తమకూ వస్తుందనే ఆశ మాత్రం వారిలో సజీవంగా ఉన్నది. ఆ ఆశనే గులిగేవారి చేత కారు గుర్తు పై ఓటేసేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు ‘ప్రజా ఆలోచన వేదిక’ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల గోపాలరావు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజాకర్షక పథకాలని, అవి నేడు సత్ఫలితాలిస్తున్నాయని, కాకపోతే అర్హులైన లబ్ధిదారులందరికీ ఒకేమారు అందకపోవడం వల్లే ఈ గులుగుడు సమస్య తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ పథకాలు కొనసాగి అందరి దరి చేరాలంటే తిరిగి మరొక్కమారు కేసీఆర్ సర్కార్ రావాల్సిందేనని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
ఆచరణ సాధ్యం కాని ప్రతిపక్షాల హామీలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేర ని, తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధిని కండ్ల్లారా చూసిన ఇక్కడి ప్రజానికం దూద్ కా దూద్, పానీకా పానీ తెలుసుకోలేని స్థితిలో లేరనేది వాస్తవం. దళితబం ధు, బీసీబంధులాంటి పథకాల విషయంలోనూ ఇదే వరుస.వచ్చినవారు కారు గుర్తుకు ఓటెసేందుకు సిద్ధ్దమయ్యారు. ఇక రానివారు తమకు తప్పక వస్తుందనే ఆశతో ఉన్నారు. ఒక వేళ మరెవరైనా తప్పీదారి అధికారంలోకి వస్తే మొత్తానికే మోసం వస్తుందనే అభిప్రాయంతో కూడా తెలంగాణ ప్రజలు ఉన్నారనే విషయం చర్చకు రావడం గమనార్హం. ఇదే వరుస అన్ని పథకాల విషయంలోనూ కనిపిస్తున్నది. వీటికి తోడు మరికొన్ని అంశాలు కూడా ప్రజలను కారు గుర్తు వైపుకు కదిలేలా చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు మాత్రం తమ జీవితాల్లో వచ్చిన మార్పును ఇప్పుడు అనుభవ పూర్వకంగా చూస్తున్నారు. వాస్తవిక అనుభవానికి, చిన్నపాటి మానసిక సంఘర్షన ను సమాజపు ఆలోచనగా చూపిస్తూ వ్యతిరేకత అనే విషయాన్ని కొంతమంది తెరపైకి తీసుకొచ్చారు.
ఈ మధ్య తెలంగాణలో ప్రము ఖ కవి ఒకరు ఒక సందర్భంలో చెప్పారు. ‘తాము సాహిత్యాన్ని సృష్టించేందుకు వస్తువుల కొరత ఏర్పడిందని. అంటే గతంలో తెలంగాణలో కరువు మీద, వలసల మీద. ప్రభుత్వ నిర్బంధాల మీద, తెలంగాణ యాస, గోస మీద ఒకటేమిటి జీవితపు సంఘర్షణలన్నింటినీ కథలు, కవిత్వం, పాటలుగా మలిచేవారు. ఇప్పుడు జీవితాల్లో కొత్త మార్పులు వచ్చాయి. విధ్వంసం స్థానంలో అభివృద్ధి వచ్చి చేరుతున్నది.
గులుగుడు ప్రభావం ప్రబలంగా ఉంటే ఇప్పటికే సాహిత్యరూపంలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమయ్యేది. వందలాది మంది కవులు, రచయితలు తమ కలాలకు ఎప్పుడో పని చెప్పేవారు. అలాంటి స్పందనలు లేవంటే ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, గులుగుతూనే కారు గుర్తుపై ఓట్లు గుద్దుతారనే విషయం నిజం కాబోతున్నది. ఇప్పుడు తెలంగాణ మారుతున్నది. మార్పునకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు.
ఇక్కడ మరో విషయం గుర్తించాలి. ఈ మధ్య కేటీఆర్ ఓ మాట పదే పదే అంటున్నారు. గతంలో తా ము మెజారిటీ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకొంటే వాటిని పునః సమీక్షించి సరిదిద్దుకుంటామని.
వీటన్నింటిని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే నాటి ఉద్యమకారులంతా మళ్లీ ఉద్యమ నాయకు డు కేసీఆర్ వద్దకు చేరుకున్నారు. ఈ సమీకరణాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా మునుపటిలాగే గులుగుతూనే కారు గుర్తు పై ఓటేస్తారని తేలిపోయింది. అం టే గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అని.
ఆస్కాని మారుతి సాగర్
90107 56666