మొన్న ఒకరోజు యథాలాపంగా దినపత్రికలు చదువుతున్నప్పుడు నేను చూసిన ఒక మూడు వార్తలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నాయకులు తమ తప్పులను, తమ పార్టీల తప్పుడు విధానాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఎంత నాటకీయంగా వ్యవహరిస్తారో ఆ మూడు వార్తలు చెప్పకనే చెప్పాయి. ఆ మూడు వార్తల్లో మొదటిది వీధిలో కూరగాయలు అమ్ముకునే రామేశ్వర్తో రాహుల్గాంధీ భోజనం. రెండవది ఎర్రకోట దగ్గర శ్రీకాకుళం కార్మికురాలు కాంతమ్మతో మోదీ ముచ్చటించడం, మూడోది చనిపోయిన ప్రజా గాయకుడు గద్దర్ ఇంటికివెళ్లి చంద్రబాబు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం. ఆపై ‘గద్దర్పై జరిగిన కాల్పులతో నాకేం సంబంధం లేదు, మేమిద్దరం కలిసి పనిచేశా’మని చంద్రబాబు చెప్పడం.
చెయ్యగలిగేదే చెప్పడం, చెప్పింది చెయ్యడం, ప్రజల కోసం నిరంతరం పాటుపడే కేసీఆర్ వంటి నాయకుడి తక్షణావసరం ఇవ్వాళ రాష్ర్టానికి, దేశానికి ఎంతో ఉన్నది. సమర్థత, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోగల కేసీఆర్ నాయకత్వం నేడు రాష్ర్టానికి, రేపు దేశానికి శ్రీరామ రక్ష. కనుక మరోసారి కేసీఆర్కు మాటిద్దాం.. ఓటేస్తామని. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తును భద్రంగా నిలబెట్టుకుందాం.
సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధపడుతుంది.
అధికారంలో ఉంటే ఆర్థిక సంస్కరణలు అధికారం పోతే పేదింటి పాటలు: 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతాన్ని దాదాపు 50 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీనే పాలించింది. అంతేకాదు, రాహుల్గాంధీ, సోనియా గాంధీ పదేండ్ల పాటు యూపీఏ ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు. మన్మోహన్సింగ్ ప్రధాని అయినప్పటికీ.. అధికార కేంద్రం మొత్తం రాహుల్ ఇంట్లోనే ఉండేది. ఆ పదేండ్లు రాహుల్గాంధీ రైతుల గురించి, వారి సంక్షేమం, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఉంటే ఇవ్వాళ రామేశ్వర్ కన్నీరు పెట్టుకునేవారా? అప్పుడే 2009లో వాల్మార్ట్ను, 2011లో బిగ్ బాస్కెట్ను, 2013లో అమెజాన్ను ఆ తర్వాత అంబానీ, అదానీ లాంటి వారికి భూములను, కూరగాయల మార్కెట్లను అప్పగించే తంతును అడ్డుకొని ఉంటే ఇవ్వాళ రామేశ్వర్ పరిస్థితి ఇంత దీనంగా ఉండే దా? రాహుల్ పార్లమెంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్-2016కు వ్యతిరేకంగా పోరాడి ఉంటే చిన్న, సన్నకారు రైతులకు దేశంలో ఈ పరిస్థితి దాపురించేదా? ఇదే కాదు ప్రధానిగా మన్మోహన్సింగ్ తీసుకున్న అనేక నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు మద్దతు పలికి, ప్రైవేటైజేషన్కు బాటలేసి ఇప్పుడు పేదల పాలిట పెన్నిధిలా నటించడం దేనికి సంకేతం. ఇలా ఒక్కటని కాదు, బక్కచిక్కిన రైతును బండకేసి కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీ అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నది. ఆ పార్టీ భవిష్యత్తు నాయకుడిగా చలామణి అవుతున్న రాహుల్గాంధీ నటిస్తున్న ఈ నటన ఇవ్వాళ కొత్తతరం మరిచిపోవచ్చుగాక.. కానీ, ఆ రోజుల్లో దిగాలుపడ్డ ప్రతీ రైతుకు తెలుసు, వారి నిర్ణయాలతో పేదల భూముల్లో పెద్దలు గద్దల్లా వాలి భూములను గుంజుకుపోయిన ప్రతీ రైతుకు తెలుసు. ఇంకా ఈ నటనలు దేనికోసం. ప్రపంచ నాయకత్వం.. సామాజిక సమానత్వం, విద్య, వైద్యంలో ప్రగతి కోసం ప్రయత్నిస్తుంటే రాహుల్ మాత్రం ఇంకా పేదలకు భోజనం పెట్టి తానొక శిబి చక్రవర్తిలా ఫీలవడం దగ్గరే ఆగిపోవడం ఈ దేశ దౌర్భాగ్యం కాక మరేమిటి?
నటనకు నడకలు నేర్పుతున్న నరేంద్ర మోదీ: వాట్సప్లో డీపీలు పెట్టమని పిలుపునివ్వడం, రింగుటోన్లతో ప్రచారం చేసుకోవడం, రేడియో ప్రసంగాలతో దేశం వెలిగిపోతుందని ఊదరగొట్టడం వంటి అభూత కల్పనలు, ప్రచార ఆర్భాటాలతో కూడా పనిచేస్తున్నట్టు నటించవచ్చని నిరూపించిన ప్రపంచ ప్రచార చక్రవర్తి మన ప్రధాని మోదీ. పేదలకు పెద్దన్నలా ఆయన ఒలకబోసే ప్రేమను చూస్తే నటులంతా అవాక్కయిపోతారు. అందులో ఒక మచ్చుతునకే ఎర్రకోట దగ్గర శ్రీకాకుళం కార్మికురాలు కాంతమ్మతో మోదీ ముచ్చటించడం. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ.. 2021-22 సంవత్సరంలో 1,49,51,247 జాబ్ కార్డులు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5,18,91,168 జాబు కార్డులను తొలగించకపోయి ఉంటే కాంతమ్మలాంటి ఎందరో వ్యక్తులు ఇవ్వాళ తమ రెక్కల కష్టం మీద బతికేవారు. వారి జీవితంలో చీకట్లు కమ్ముకోకపోయి ఉండేవి. ఇక తెలంగాణలో 2021-22 సంవత్సరంలో 61,278 జాబ్ కార్డులు, 2022-23లో 17,32,936 మంది జాబు కార్డులకు కోత పెట్టకపోయి ఉంటే ఇవ్వాళ తెలంగాణలో 17,94,214 కాంతమ్మలు, వారి పిల్లల్లాంటివారు ఎందరో ఆత్మగౌరవంతో బతికేవారు. ఇలా సంవత్సరంలో లక్షల మందిని ఉపాధికి దూరం చేసి ఒక్క కాంతమ్మను ఢిల్లీకి పిలిచి మోదీ దేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి? ఇదొక్కటే కాదు, దుర్మార్గమైన రైతు చట్టాలు తెచ్చి వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. అన్యాయంగా ప్రజల సొమ్మును అదానీకి, అలాంటి అనేకమంది బడా వ్యాపారులకు దోచిపెట్టి పేదలను మరింత పేదరికంలోకి నెడుతూ.. కాంతమ్మను ఢిల్లీకి పిలిచి దేశానికి ప్రధాని ఇచ్చిన సందేశం ఏమిటీ?.
అప్పుడు గద్దర్ది తీవ్రవాదం, ఇప్పుడు స్ఫూర్తినాదం: చంద్రబాబు వైఖరి కాలానుగుణంగా మారుతుంది. అందుకు బాకా ఊదే పత్రికలు సైతం అద్భుతమైన అక్షరాలు, కాలం మరిచిపోయిన సాక్షులతో బాబు గొప్పదానాన్ని, బాబుపై పడిన మరకలను సర్ఫ్ ఎక్సెల్తో కడిగేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుంటాయి. అందులో ఒకటి ఈ మధ్య గద్దర్ మరణం, ఆ తర్వాత గద్దర్ కుటుంబానికి చంద్రబాబు పరామర్శ. గద్దర్ ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని.. ప్రజా చైతన్యానికి గద్దర్ ప్రతీ క అని, ఆయన నిరంతరం పేద, బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడేవారని చంద్రబాబు కీర్తించ డం. ఒక అడుగు ముందుకేసి.. గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదని పేర్కొనడం. ఆ తర్వాత.. గద్దర్పై 1997లో జరిగి న కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేయ డం. ఆ ఘటన తర్వాత గద్దర్ తనతో చాలాసార్లు మాట్లాడారని ఆ తర్వాత ఆయన మీడియాతో చెప్పుకోవడం. నిజంగా ఆయన మాటలకు సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందేమో అనే భయం కలిగింది నాటి చంద్రబాబు పాలన రోజుల పట్ల స్పృ హ కలిగిన ప్రతీ ఒక్కరికి. ప్రజా గొంతుకలను చం ద్రబాబు అణచివేసినంతగా మరెవరు చేయలేదు. గ్రేహౌండ్స్ సృష్టికర్తగా తనకు తాను ప్రకటించుకున్న బాబు.. అధికారం పోగానే ఇలా తన నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తుంటే ఊసరవెల్లి కూడా రంగుల మార్చే పోటీ నుంచి తప్పుకుంటుందేమోనన్న సందేహం కలుగక మానదు.
ఇంత దారుణమైన వ్యక్తిత్వాలు, వ్యక్తులు ఇవ్వాళ దేశాన్ని, రాష్ర్టాలను నడిపించేందుకు ప్రయత్నించడం.. వారే దేశ నాయకులుగా, విజనరీలుగా ప్రచారం చేసుకోవడం, గొప్ప నాయకులుగా చలామణి కావడం మన దౌర్భాగ్యం కాక మరేమిటి?
ఇలా వ్యక్తిత్వం లేని నాయకులు,దేశం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, నాయకత్వ విలువల పట్ల ఏ మాత్రం నమ్మకం లేని నాయకులు దేశాన్ని నడిపిస్తామంటే దేశం వెనక్కిపోకుండా ముందుకెలా నడుస్తుంది. ఇప్పటికే దేశం సంక్షోభానికి దగ్గరవుతున్నది. ఇప్పుడు వీళ్లను నమ్ముకొని దేశాన్ని తాకట్టుపెడదామా? నటన వైపు, అబద్ధాల వైపు ఉండి దేశాన్ని, జీవితాలను నాశనం చేసుకుందామా? ప్రజలంతా ఆలోచించుకోవల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణ బిడ్డలుగా గర్వపడదాం: ఇలాంటి నాయకులను చూసిన తర్వాత.. తెలంగాణ బిడ్డలుగా మన రాష్ట్ర నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సిన సందర్భం ఇది. తొమ్మిదేండ్లలో ఒక కొత్త రాష్ర్టాన్ని దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన నాయకుడు కేసీఆర్ది. బీడు భూముల నుంచి పచ్చని పంటల మాగాణంగా, చీకట్ల నుంచి 24 గంటలు వెలిగే కాంతిరేఖగా, 200 నుంచి రెండువేల దాక పింఛన్, వికలాంగులకు నాలుగు వేల ఆసరా దాక, రైతుకు బంధువుగా, రైతుకు ధీమాగా, దళితులకు అండగా, బీసీలకు తోడుగా, మైనారిటీలకు నీడగా.. వెలుగుతు న్న పల్లెలు, అభివృద్ధిలో దూసుకుపోతున్న పట్టణాలతో నభూతో న భవిష్యతి అనేట్టుగా దేశంలో ప్రగతికి చిరునామాగా తెలంగాణ మారింది. అద్భుతమైన పరిణతితో కూడిన నిర్ణయాలతో దేశం మొత్తం తెలంగాణ నాయకత్వం వైపు చూస్తున్న సందర్భం మనకు గర్వకారణం. చెయ్యగలిగేదే చెప్పడం, చెప్పింది చెయ్యడం, ప్రజల కోసం నిరంతరం పాటుపడే కేసీఆర్ వంటి నాయకుడి తక్షణావసరం ఇవ్వాళ రాష్ర్టానికి, దేశానికి ఎంతో ఉన్నది. సమర్థత, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోగల కేసీఆర్ నాయకత్వం నేడు రాష్ర్టానికి, రేపు దేశానికి శ్రీరామ రక్ష. కనుక మరోసారి కేసీఆర్కు మాటిద్దాం.. ఓటేస్తామని. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తును భద్రంగా నిలబెట్టుకుందాం.
-శ్రీపాద రమణ