అదానీ కనీసం హైస్కూల్ చదువు కూడా పూర్తి చెయ్యని ఒక స్కూల్ డ్రాపౌట్.ముందు చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా మొదలు పెట్టిన జీవితం, తరువాత చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెట్టి ఓడ రేవులు కొనే స్థాయికి ఎదిగాడు.
2000 తరువాత మోదీతో పరిచయం ఇతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
మోదీకి, ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి ఇతను పూర్తి బినామీ. కార్పొరేట్లకు, ప్రభుత్వాలకు మధ్య ఇలాంటి అవినాభావ సంబంధాలు మామూలే. ఎవరు పాలనలో ఉంటే వారికి పదో పరకో ఇచ్చి, కోట్లల్లో లాభపడుతుంటారు కార్పొరేట్లు. పార్టీలకు ఫండ్స్ కావాలి, ఇలాంటి వారికి ప్రోత్సహించని పార్టీ అంటూ ఉండదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రం మొత్తం రాసి ఇచ్చేశాడు అదానీకి. ప్రధాన మంత్రి అయ్యాక మొత్తం దేశాన్ని.
ఒక ప్రధాన మంత్రి, అదీ మన ఇంత పెద్ద భారత దేశపు ప్రధాని అనుకుంటే కానిది ఏముంటుంది. తాను అనుకున్న వ్యాపారాలు అదానీకు దక్కాయి. తాను ఇష్టపడ్డ, కన్ను పడ్డ వ్యాపార సంస్థలు, ప్రాజెక్టులు అన్నీ నయానో భయానో సాధించుకున్నాడు.
ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు అంబానీలు ఉంటారు. అందుకే మోదీ ప్రత్యామ్నాయం చూసుకున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లవేళలా తనకు విశ్వాస పాత్రుడిగా, విధేయుడిగా నిలిచే ఆర్థిక స్తంభాన్ని ప్రతిష్టించుకున్నాడు.
దశాబ్దాలుగా వ్యాపారాలు చేసి అంబానీలు సాధించుకున్న మొదటి కుబేర స్థానాన్ని అ దానీ కైవసం చేసుకున్నప్పుడే ప్రతి పౌరుడికి అర్థం అవ్వాలి ఇతను చేస్తోంది దగా, మోసం,కుట్ర అని.
2014 ఎన్నికల ముందు నుంచి మోదీ జాతీయ స్థాయి ఖర్చులన్నీ అదానీయే భరించాడు.2014కు ముందు బీజేపీలో అంతగా బలమున్న వ్యక్తి కాదు మోదీ. రాష్ట్రంలోనూ, బయటామోదీ రాజకీయ ఖర్చులు, అవసరాలు అన్నీ అదానీయే భరించేవాడు.పక్కా బీజేపీవాదిలా విశ్వాస పాత్రుడిలా ఉన్న అదానీనీ చూసి మోదీ మురిసి పోయేవాడు. సోదరోత్సాహం, పుత్రోత్సాహంతో పొంగి పోయే వాడు మోదీ.అదానీకి కావలసిన దాని కంటేఎక్కువ రుణాలు బ్యాంకుల నుoచి తన కంటి సైగలతో ఇప్పించాడు మోదీ. ప్రధాని తలచుకుంటే రుణాలు పెద్ద విషయమే కాదు కదా.
అదానీ ఆశ ఎక్కడో ఒక చోట సంతృప్తి చెందాలి, అది జరగలేదు. అంబానీనీ దాటి పోయి భారత దేశపు అపర కుబేరుడు అయ్యా డు. మొదటి స్థానం కూడా పొందాడు.తాను పెరట్లో పెంచుకుంటున్న మొక్క ఆకాశానికి అంటాలని మోదీ కోరిక.ప్రపంచ కుబేరుడిని చెయ్యాలి. ‘మీ దేశంలోని ప్రాజెక్టులన్నీ అదానీకే ఇవ్వాలి’ అని ప్రతి దేశంపైన ఒత్తిడి చేయించాడు.‘సరే ఒక చోట మోదీకి ఉపయోగ పడితే ఇంకో చోట మోదీ మనకు ఉపయోగ పడుతాడులే’ అనిచాలా దేశాలు అదానీకే కట్టబెట్టాయి ప్రాజెక్టులు. దేశ ప్రయోజనాలను అదానీ అభివృద్ధి కోసం మోదీ తాకట్టు పెట్టాడు ఇలా.
‘ఇవన్నీ కాదు, ఇంకా ఎదగాలి, అడ్డదిడ్డంగా అయినా సరే, అనైతికంగా అయినా సరే’ అని అదానీలో చల్లారని కోరిక. విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టడం, అదానీ భారతీయ కంపెనీల్లో ఆ డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టించు కోవడం, తన కంపెనీ షేర్లు కొనిపించడం తద్వారా తన కంపెనీ షేర్ వ్యాల్యూ పెంచుకోవడం.అక్కడ విదేశాల్లో ఇతను స్థాపించిన డొల్ల కంపెనీలకు ఒక ఉద్యోగి ఉండడు కనీసం ఒక లాండ్లైన్ ఫోన్ నంబర్ కూడా ఉండదు.
షేర్ మార్కెట్ మొత్తం ఒక మోసపు క్రీడ.సగo సగం జ్ఞానం, లేదా అసలు జ్ఞానం లేకుండా దిగి జీవితాలు అల్లకల్లోలం చేసుకున్న వారు ఎందరో.కానీ దీన్ని లోతుపాతులు క్షుణ్నంగా తెలిసిన వారు కోట్లు సంపాదించు కోవచ్చు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారం మొదట్లో షార్ట్ సెల్లింగ్ చేసి శుక్రవారంమళ్లీ కొని చాలా మంది బాగానే లాభ పడ్డారు.ఇక్కడ అంతా సంస్థలు, ప్రమోటర్లదే ఆట.మనము కేవలం పావులం మాత్రమే. ఇప్పట్లో పడ్డ మార్కెట్ వచ్చే ఎన్నికలు అయ్యేవరకు కోలుకోదు. దశాబ్దాలుగా వ్యాపారాలు చేసి అంబానీలు సాధించుకున్న మొదటి కుబేర స్థానాన్ని అ దానీ కైవసం చేసుకున్నప్పుడే ప్రతి పౌరుడికి అర్థం అవ్వాలి ఇతను చేస్తోంది దగా, మోసం, కుట్ర అని.
ఏం జరగవచ్చు: ఇలాగే మరో రోజు అదానీ కంపెనీ షేర్లు పతనం అయితే మొత్తానికే భారతదేశంలో ట్రేడింగ్ను సెబీ స్తంభింపచేయవచ్చు.డీ మ్యాట్ అకౌంట్లు ఏవీ క్రయ విక్రయాలకు పని జేయక పోవచ్చు.పరిశీలనల తరువాత అదానీ కంపెనీల షేర్ల ట్రేడింగ్ని ఆపి మిగితా వాటికి సడిలింపు ఇవ్వచ్చు. అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమైతే వాటిని కొన్న వారికి లాక్ ఇన్ పిరీయడ్ పెట్టచ్చు. వీటిల్లో ఏదైనా జరగవచ్చు.ఇప్పటికీ అందరిలో మిణుకు మిణుకు మంటున్న ఆశ ఏమంటే మోదీ ఉన్నాడు ఇతనికి అండగా. కా బట్టి ఒడ్డున పడేస్తాడు అని.నేను ఎక్కువగా అంకెల జోలికి టెక్నికల్ పదాల జోలికి వెళ్లటం లేదు.ఈ పోస్ట్ ప్రతి ఒక్కరికీ అర్థం అవ్వాలి కదా అని.
ప్రధాన మంత్రి అండతో ఇలాంటి ద్రోహులు దేశ సంపదను ఎల్లలు దాటిస్తూ ఇక్కడ మన దేశ ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేయడం దేశ ద్రోహమే.
‘నా 56 ఇంచీల ఛాతితో దేశానికి కాపలా ఉంటాను’ అని ఊదర గొట్టిన మోదీచేసిన నిర్వాకం ఇది.మోదీ ప్రోద్బలం లేకుంటే అందరినీ మింగే బకాసురుడు అయ్యేవాడే కాదు అదానీ.అదానీకు ఎంత ప్రమేయం ఉందో ఈ నేరంలో మోదీకు అంతకు మించి ఉంది.
ముస్లింల పైన ద్వేషాన్ని నింపుతూ ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారు’ అని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ, వల్లకాడుల సామ్రాజ్య స్థాపన వైపు వడి వడిగా అడుగులు వేస్తున్న మోదీ ఇంతగా దత్త పుత్రుడికి దోచి పెడుతుంటేఅమిత్ షా ఊరుకుంటాడా. తన సొంత కొడుకును వేల కోట్లకు అధిపతిని చేశాడు.జూనియర్ షా డైరెక్టర్గా ఉన్న కంపెనీలన్నీ వేల కోట్ల లాభాలు ఆర్జించాయి.క్రికెట్ రాని, ఇంగ్లిష్ ముక్క రాని తన కొడుకును క్రికెట్ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు అమిత్ షా.
ఇలా దేశ సంపదను మొత్తం దోచుకుంటూ ఉంటే ధరలు పెరగక ఏం చేస్తాయి.సామాన్యుడి పైననే దెబ్బ. బ్యాంకులకు ఖచ్చితంగా పెద్ద దెబ్బ పడుతుంది ఈ అదానీ స్కాం వలన.ప్రతి వ్యాపారం పైన దీని ప్రభావం పడుతుంది.నిరుద్యోగం ఇంకాస్త పెరుగుతుంది.ప్లేట్లు, గరిటలు తీసుకొని వాయించుకోవడమే ఇక మిగిలింది.
2019 వరకు ఒక తరహా దోపిడీ చేస్తే, 2019 తరువాత మోదీ, అదానీ స్పీడ్ పెంచారు.దేశ వనరులను తక్కువ అంటే నామ మాత్రపు ధరలకు దోచుకోవడం మొదలు పెట్టారు. ప్రతి రాష్ట్రంలో వేల ఎకరాలు ఉచితంగా లాక్కున్నారు.చివరి రెండు సంవత్సరాల అదానీ సంపాదన చూస్తే అర్థం అవుతుంది.రాకెట్ స్పీడ్ కంటే అధికంగా పరుగెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.అంతా స్కాం…బోగస్…దోపిడీ…
మోదీకు ఎక్కడి డబ్బు సరి పోవడం లేదు.అత్యధిక విరాళాలు సేకరిస్తున్న పార్టీ బీజేపీ.ఇక వసూళ్లు మామూలే.ఇక అవినీతి ద్వారా వచ్చేది అదనం.అంతా మన దేశపు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవడానికి ఉపయోగించు కోవడానికే.ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి…ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి….ఒక పార్టీ ఆర్థికంగా ఎంత బలవంతురాలు అవుతుంటే…ప్రజాస్వామ్యం అంత దిక్కు లేనిది అవుతుంది.
దేశాన్ని దోచుకొని, పేద పరిచి మళ్ళీ దేశాన్ని టోకు ధరకు కొని పడేస్తున్నారు.ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేట్పరం జేస్తూప్రజల జీవితాలను అగమ్యగోచరం చేస్తున్నారు.ఇక పెట్రోల్ ధర ఎందుకు తగ్గుతుంది, గాస్ ధర గాల్లోనే ఉంటుంది. డాలర్ మన రూపాయికి కిలోమీటర్ దూరం పరిగెడుతుంది.
మన మోదీగారు ప్రధాని అయ్యాక దేశం పేరు మీద 100 లక్షల కోట్లు అప్పులు జే శారు.అదానీ ఒక్కడు ఈ రెండు సంవత్సరాల్లో తన సంపదను 30 రెట్లు చేసుకున్నాడు.ఇటు దేశపు అప్పులు పెంచుతూ అతని సంపదను హెచ్చింపు చేస్తూ ముందుకు సాగారు మోదీ. ఖజానాకు కాపలా ఉండాల్సిన మోదీ, తలుపులు బార్లా తెరిచి అదానికి పంచి పెట్టాడు.
సుచేత దళాల్ అన్న విలేకరి రెండు ఏండ్ల క్రితమే అదానీ ఆర్థిక అవకతవకల గురించి బహిరంగపరిచారు. అప్పుడే స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు. మనకు జరుగుతున్న అన్యాయాలను, దుర్మార్గాలను విదేశీ సంస్థలు చెబితే గానీ స్పందించని స్థితిలో మనం ఉన్నాం. అందులోనూ నలభై శాతం మంది మళ్లీ అన్యాయం వైపే.ఈ సుచేతా దళాల్ ఆషామాషీ ఆవిడ కాదు. హర్షద్ మెహతా తీగ లాగి డొంకను అంతా కదిలించిన వారిలో ఒకరు.
వ్యాపారాలు అయినా, ఆర్థిక వనరులు అయినా ఒకే కుటుంబం దగ్గర కానీ, ఒకే వ్యక్తి వద్ద కానీ మిగిలి పోవడం దేశానికి, ప్రజలకు ఎప్పుడూ హానికరమే. అంబేద్కర్ చాలా దూరపు ఆలోచన చేసే రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలు అందరికీ ఈ ఫలాలు అందాయి.రిజర్వేషన్స్ కనుక లేకుండా ఉండి ఉంటే, వ్యాపారాలు అన్నీ ఒక చోట గుమికూడినట్లే ఉద్యోగాలు కూడా ఒక వర్గపు ప్రజల వద్దే ఆగిపోయేటివి.
వ్యాపారులు, కార్పొరేట్ వర్గాలు ఉండకూడదు అని కాదు. కానీ అన్నీ ఒకరికే దోచిపెట్టడం వలన నిరుద్యోగం పెరుగుతుంది, మనుషుల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది.దీనికి పెద్ద లెక్కాచారాలు వద్దు, కాస్త ఆలోచన పెడితే క్రమంగా అర్థం అవుతుంది. ఈ మొత్తం స్కాంలో అదానీకి ఎంత భాగస్వామ్యం ఉందో మోదీకి అంతే ఉంది.మోదీకి తెలియకుండా, అతని ప్రోద్బలం లేకుండా అదానీ ఇవన్నీ చేయగలడా ఆలోచించండి.
ఒకసారి అంటే 1998లో అదానీ కిడ్నాప్కు గురయ్యాడు, వారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే ఇతడిని మూడు రోజుల తరువాత విడుదల చేశారు.కోర్టులో కేసు బాగానే నడిచింది. ఏమైందో ఏమో అదానీ వాయిదాలకు హాజరు అవ్వడం మానేయడంతో కేసు కొట్టివేశారు.తాజ్ హోటల్పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డప్పుడు అక్కడే హోటల్లో అదానీ ఉన్నా సురక్షితంగానే బయట పడ్డాడు.ఇప్పుడు కూడా మోదీ దయతో బయట పడుతాడేమో చూద్దాం.విదేశాల్లో దాచుకున్న నల్ల ధనం ఇంత కంటే మంచి కార్యానికి దేనికి ఉపయోగించాలి ఇద్దరూ.
‘నేను ఫకీరును నాకు ఎందుకు డబ్బులు, ఐశ్వర్యం అంటూ’మోదీ చెప్పేదంతా అబద్ధం. ఏ ప్రధాన మంత్రి దోచుకోనంతగా అదానీ పేరు చెప్పుకొని దోచుకుంటున్నాడు. ‘నువ్వు ఇలా ఎంత నిజాయితీతో రాసినా, లాభం లేదు. బత్తాయిలు ఇంకా దగ్గర అవుతారు మోదీకి, బీజేపీకు. నీ రాతల వల్లనష్టమే కానీ లాభం లేదు’ అని కొందరు అన్నారు. ‘అయితే అన్ని పోరాటాలు విజయం కోసం చెయ్యరు, ప్రశ్నించడానికి కొందరం ఉన్నాం అని తెలియజేయడానికే’ అని నేనన్నాను.
మోదీ ఇప్పటికిప్పుడు మీడియాతో పూర్తి ప్రెస్ కాన్ఫరెన్సు జరిపితే అక్కడికక్కడే తన పది కోట్ల సూట్ ఊడిపోతుంది.
ఇప్పుడు కూడా మీరు మోదీని ప్రశ్నించకుంటే, మీకంటే దేశ ద్రోహులు ఇంకొకరు లేరు.ఇప్పుడు కూడా మీరు దీన్ని స్కాంగా గుర్తించడం లేదంటే, బీజేపీ అంటే ఇంకా అభిమానం ఉందంటేఅది కేవలం మీకు ముస్లింలపైన ఉన్న ద్వేషం ఒక్కటే కారణం.
చివరలో ఒక విషయం, అదానీకి రుణాలు ఇచ్చిన బ్యాంక్లన్నింటిలో ఒక్క ముస్లిం డైరెక్టర్ కూడా లేడు. సో ఈ ఆర్థిక తీవ్రవాదిని పెంచి పోషించింది ఎవరు?
(సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు)