ప్రపంచంలో మొట్టమొదటి కరెంటు బల్బు ఆవిష్కరించిన ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో ఆయన తల్లి పాత్ర ఎంతో కీలకమైంది. ఎడిసన్ చిన్నతనంలో అయన తల్లి చేసిన ఒక పని వల్ల ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యారు . ప్రపంచానికి చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చాడు. ఒకవిధంగా చూస్తే ఆయన తల్లి వల్లే ఇదంతా సాధ్యమైంది. అదెలాగంటే..
అవి థామస్ అల్వా ఎడిసన్ పాఠశాలలో చదువుకుంటున్న రోజులు.. ఒక రోజు ఎడిసన్ స్కూలు నుంచి వస్తూ తనతో పాటు ఒక లెటర్ తీసుకువచ్చాడు. దానిని తన తల్లికి ఇచ్చి.. ఇది స్కూలులో తనకు ఇచ్చారని, దానిలో ఏముందో గట్టిగా చదవి వినిపించమన్నాడు. తల్లి ఆ లెటర్ను తెరిచి, చదవడం ప్రారంభించింది. ఆ లెటర్ చదువుతున్న ఆమెకు కన్నీళ్లలో మునిగిపోయింది. తన కుమారుడు థామస్ను దగ్గరకు తీసుకుని ఏడ్చింది.
అది చూసిన చిన్నారి థామస్.. ‘అమ్మా అందులో ఏమి రాశారు?’ అని అడిగాడు. అప్పుడు ఆమె ఆ లెటర్ను బిగ్గరగా చదవడం ప్రారంభించింది… “మీ కుమారుడు ఒక జీనియస్, థామస్ అద్భుతమైన తెలివితేటలు కలిగినవాడు , అయితే మేము ఇటువంటి కుర్రాడికి మా స్కూలులో చదువు చెప్పలేము, ఇక్కడ థామస్కు చదువు చెప్పడల సరైన ఉపాధ్యాయులు లేకపోవడమే దానికి కారణం. అందుకే థామస్కు మీరు ఇంట్లోనే చదువు చెప్పండి” అని రాశారు అంటూ ఆమె థామస్కు చెప్పింది.
ఆ రోజు నుంచి థామస్ ఇంట్లోనే తన తల్లి వద్ద చదువు నేర్చుకున్నాడు. తల్లి థామస్ చదవు గురించి శ్రద్ధ తీసుకొని అతడిని ఒక గొప్ప మేధావిగా తీర్చిదిద్దింది. తరువాతి కాలంలో థామస్ ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా మారారు. కరెంటు బల్బును కనిపెట్టి 1093లో దానికి పేటెంట్ పొందారు. తరువాత విజయవంతమైన బిజినెస్ మ్యాన్గా మారారు. థామస్ విజయపరంపర కొనసాగిస్తున్న సమయంలోనే ఆయన తల్లి కన్నుమూసింది. ఒకరోజు థామస్ తన ఇంట్లోని పాత వస్తువులు తొలగిస్తుండగా.. ఒక లెటర్ కనిపించింది. అది తాను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఉపాధ్యాయులు తనకు ఇచ్చిన లెటర్.
ఆ లెటర్ చదివిన థామస్కు ఒక్కసారిగా షాక్ తగిలింది. అందులో ‘మీ కుమారుడు థామస్ మానసికంగా చాలా బలహీనుడు. ఇలాంటి కుర్రాడికి మా స్కూలులో చదువు చెప్పలేం. దయచేసి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే చదువు నేర్పండి’ అని వుంది. ఈ లెటర్ చదవగానే థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
అప్పుడు థామస్కు.. తన తల్లి పడిన ఆవేదన, తనను ఇంతవాడిని చేయడానికి ఆమె పడిన కష్టం గురించి అర్థమైంది.
ఒకవేళ ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్లు తన తల్లి చదివివుంటే.. తాను ఇన్ని ఆవిష్కరణలు చేసే అవకాశమే ఉండేదికాదని అనుకుంటూ.. థామస్ తన తల్లికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపారు.
థామస్ జీవితంలోని ఈ ఘటన ద్వారా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. సాధారణంగా చాలామంది ఎదుటివారి లోపాలను చూసి వారిని కించపరిచి, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటారు. ఇలా చేయడం వలన వారు మరింత కుంగిపోతారు. దీనికి బదులు లోపాలున్నవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయాలి.