కోల్కతా : తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికులకు జీవనోపాధినీ కల్పిస్తోంది.
విష్ణుపూర్, జైపూర్, రాయ్పూర్, సారెంగ ప్రాంతాల్లోని స్ధానికులు ఈ పండ్లను అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. తీపిని పంచే మహుల్ పండ్ల సేకరణ స్దానికులకు తలకుమించిన భారంగా మారింది. చెట్ల కింద గంపలను ఉంచి ఈ పండును స్దానికులు సేకరిస్తుంటారు. మహుల్ చెట్ల నరికివేత, అడవులు అంతరించిపోవడంతో పాటు ఏనుగుల భయం వంటి ఎన్నో ఇబ్బందులు స్ధానికులను వెంటాడుతున్నాయి.
ఈ పండును సేకరించేందుకు వీరు సోనాముఖి అడవులకు చేరుకుని ఆపై మహుల్ పండ్లను స్ధానిక హోల్సేల్ వ్యాపారులకు విక్రయించి ఉపాధి పొందుతుంటారు. తమ అమ్మకాలు పెరిగి మంచి రాబడి ఆర్జించేందుకు ప్రభుత్వం అటవీ ఉత్పాదనలకు సరైన ధర నిర్ణయించాలని స్దానికులు కోరుతున్నారు.