ఇజ్రాయిల్ : శీతల తుఫానుతో జెరూసలేం గురువారం మంచు దుప్పటి కప్పుకుంది. నగరంలోని ఐకానిక్ గోల్డెన్ డోమ్ ఆఫ్ ది రాక్ మంచుతో నిండిపోయింది. పర్వత, ఎత్తైన ప్రాంతాలను మంచు ముంచెత్తింది. హిమపాతంతో జెరూసలేం ప్రధాన రహదారులు మరియు ఇతర రోడ్లను మూసివేశారు. మంచుతో నిండిన వీధులను క్లియర్ చేయడానికి మునిసిపల్ సిబ్బంది శ్రమిస్తుండటంతో స్కూళ్లు, వాణిజ్య సంస్ధలను మూసివేశారు.
మంచుతో రోడ్లు కప్పివేయడంతో ప్రమాదాలను నివారించేందుకు ఇజ్రాయెల్ పోలీసులు పర్వతాల వెస్ట్ బ్యాంక్లోని ప్రధాన రహదారులను కూడా మూసివేశారు. జెరూసలేం చుట్టూ ఉన్న కొండలలో మంచు కురవడం అరుదుగా జరుగుతుందని, శీతాకాలంలో ఒకసారి ఇలాంటి పరిస్ధితి ఎదురవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక శీతల తుఫాను తూర్పు మధ్యధరా ప్రాంతాన్ని వణికిస్తుండగా, శీతల తుఫాన్తో మధ్యప్రాచ్యంలో భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత పెరిగింది. ఇక ఈ వారం ప్రారంభంలో ఇస్తాంబుల్, ఏథెన్స్ ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి.