ముంబై : ఐదు లక్షల రూపాయల విలువైన పది తులాల బంగారాన్ని మురికి కాలవలో ఎలుకల నుంచి స్వాధీనం చేసుకున్న ఘటన ముంబైలోని గోకుల్ధాం కాలనీలో వెలుగుచూసింది. చెత్త కుండీ నుంచి కొన్ని ఎలుకలు జ్యూవెలరీ బ్యాగ్ను సమీపంలోని డ్రైనేజ్లోకి తీసుకువెళుతున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గమనించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
బ్యాంకులో జ్యూవెలరీని డిపాజిట్ చేసేందుకు వెళుతున్న మహిళ మార్గమధ్యలో వడపావ్ ఉన్న కవర్ను చిన్నారికి ఇవ్వబోతూ పొరపాటున బంగారు ఆభరణాలు ఉన్న కవర్ను ఇచ్చింది. తీరా బ్యాంక్కు వెళ్లి చూసిన తర్వాత జ్యూవెలరీ ఉన్న బ్యాగ్ను ఇచ్చినట్టు గుర్తించి వెనక్కి రాగా చిన్నారి కనిపించలేదు.
ఆపై మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి జ్యూవెలరీ ఆచూకీ రాబట్టారు. ఎలుకల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని మహిళకు అప్పగించామని స్ధానిక ఎస్ఐ జీ. గార్గే తెలిపారు.