లండన్ : హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో గణపతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ నగరం సమీపంలోని రీడింగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం వైభవంగా సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబురాల్లో పాల్గొన్నారు. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డుని జీవన్, సుమన్ గోలి, మధు గులాయిగారి కలిసి వేలం పాటలో £1500 పౌండ్స్ కి దక్కించుకున్నారు. అనంతరం థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో అశోక్ దూసరి, జాహ్నవి దుసరి, సతీష్ రెడ్డి, శ్రీకత్ రెడ్డి జింకల, సుస్మిత, శ్రీనివాస, లక్ష్మి, హర్ష రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, సుమన్ గోలి, నీలిమ, మధు గులైగారి, భావన, జీవన్, మమత, మహేందర్, శ్వేతా, అనిల్, మల్ల రెడ్డి, శుశమున, శేఖర్, అనిత, హరి నవాబుపేట్, స్నేహ, వీర్, సృజన, సైది రెడ్డి, హారిక యడవల్లి, అభిలాష్ రావు, సమిత, , సంతోష్, వర్ష, నాగార్జున, అనూష, వేణు, నీలిమ, భాను, శ్రీకాంత్ జెల్ల, శైలజ, పవన్, మాధురి, నరేష్ జక్కుల, శశి దొడ్లే, మౌనిక అవినాష్, ప్రత్యూష, భూషణ్, మధు, శివ సిన్నం, సంజీవ్, నిహారిక, సురేందర్, రూప్, వీణ, శ్రీమన్నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, సంధ్య, సత్యపాల్ రెడ్డి, విద్య, మోహన్ , త్రివేద్, నాగరాజు పాల్గొన్నారు.