హైదరాబాద్ : ఐర్లాండ్(Ireland) రాజధాని డబ్లిన్(Dublin) మహా నగరంలో వాసవి మాత(Vasavi Matha) అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో అలంకరించిలలిత సహస్రనామ పఠనం, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత చక్కగా సమన్వయము చేసారు. తరువాత విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు, పెద్దలు ఆనందంగా ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాల ఆనందంగా ఉందని కోర్ కమిటీ సభ్యుల్లో ఒకరైన అనిల్ అన్నారు.
కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ అయిన బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. అలాగే దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలనుకు కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర కుమార్, గంగా ప్రసాద్, కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్, మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.