సింగపూర్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నది. ‘సంప్రదాయక కథాగానం’ హరికథా చూడామణి కాళ్ల నిర్మల భాగవతారిణి, బృందం వారిచే హరికథప్రోగ్రాం ఉంటుంది.
అలాగే బుర్రకథ కళాకారులు శ్రీ విఘ్నేశ్వర కళా బృందం, యడవల్లి కృష్ణ ప్రసాద్చే బుర్రకథ , సింగపూర్ గాయనీగాయకులచే శివభక్తి గీతాలాపన ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలను తేదీ: 19/11/2021 శుక్రవారం సమయం: సా.7:00 గంటలకు (సింగపూర్ కాలమానం) నిర్వహించనున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని
https://www.facebook.com/events/280125374025438/ లింక్లో వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.