హైదరాబాద్ : ‘వీధి అరుగు- నార్వే’, ‘దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు పాల్గొని తెలుగు భాషా ఔన్నత్యాన్ని సోదాహరణంగా వివరించారు. భారతదేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పిన 16 సూత్రాలను అనుసరిస్తే తెలుగు భాషా పరిరక్షించబడి ఫరిడ విల్లుతుందని చక్కటి సందేశాన్ని ఇచ్చిన ఆయనకు నిర్వాహకులు కృజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాడుకభాషలో విజ్ఞానం చేరాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి వాడుక భాష ఉద్యమాన్ని చేపట్టారని తెలియజేశారు. పత్రికల భాష వాడుక భాషకు మంచి కొలమానం! భాష పట్ల భక్తి మంచిదే కానీ భాషను శక్తితో నింపే ప్రయత్నం ఇంకా గొప్పది. ఇప్పుడు మనం చేయాల్సింది ఇదేనని తెలిపారు.
గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనవడు డా.గిడుగు రామదాసు గిడుగురి జీవిత విషయాలు ముఖ్యంగా వారు పట్టుదల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిజేశారు. తిరుమల – తిరుపతి- దేవస్థానం బోర్డు చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ. గిడుగు ఉద్యమ ఫలితంగా విద్యాలయాలలో, పాలన పరంగా వాడుక భాషగా తెలుగును తీసుకొచ్చారని కొనియాడారు.
అలాగే డా. సతీశ్ రెడ్డి వాడుక భాషలో ఉన్న అచ్చ తెలుగు పదాలను సోదాహరణంగా చాలా చక్కగా వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు భాషను ఉపయోగిస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలుగుభాష అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు.
శ్రీకర రెడ్డి జానపద కళలకు నేర్పించే వారికి పారితోషికాన్ని రాయబార కార్యాలయం ద్వారా ఇస్తారనే మంచి విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించిన వక్తలకు నిర్వాహకులు పేరుపేరున కృజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన