బహ్రెయిన్ : బహ్రెయిన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం కేక్ను కట్ చేసి ఆనందోత్సాలతో రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు సంగేపు దేవన్న, చెంన్నమనేని రాజేందర్ తదితరులు ఉన్నారు.