హైదరాబాద్ : లండన్(London) ఎన్ఆర్ఐ(NRI) బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు(TelanganaState formation day) ఘనంగా నిర్వహించారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లండన్ బీఆర్ఎస్ శాఖ సభ్యుడు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇన్చార్జి సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల, బోనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాల ఉన్నారు.