న్యూ జీలాండ్ : న్యూ జీలాండ్లోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యూ జీలాండ్ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు జగన్ రెడ్డి మాట్లాడుతూ..ఎంతో మంతి అమరుల త్యాగం, కేసీఆర్ పోరాట పటిమతో స్వారాష్ట్ర కాంక్ష నెరవేరిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు మనందరి సహకారం ఉండాలన్నారు.
కార్యక్రమంలో అరుణ్ ప్రకాష్ , నర్సింగ రావు ఇనగంటి , ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ విజయభాస్కర్ రెడ్డి కొసన , కళ్యాణ్ రావు కాసుగంటి, మోహన్ రెడ్డి బీరపు, పానుగంటి శ్రీనివాస్, గిరిధర్ మోర్ల, బాల వెను బీరమ్, కృష్ణారెడ్డి ఆరేపల్లి, వ్యాపారవేత్తలు, కృష్ణ కుమార్ పూసర్ల శ్రీని, స్నిత ప్రజ్ఞ అల్లం, తదితరులు పాల్గొన్నారు.