NRI News | సింగపూర్లో (Singapore) శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను గత మూడేండ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన యాత్ర మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. ఈ భక్తి యాత్రలో బాగంగా సింగపూర్లో ఉన్న 11-12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు.
సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి 210 మంది భక్తుల్లో బస్సుల్లో బయల్దేరారు. వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. దీంతో ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మారుమ్రోగాయి.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీకి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహించిన ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కిరణ్ కైలాసపు, లక్ష్మణ్ రాజు కల్వ, పెరుకు శివ రామ్ ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ పరమశివుడు తరచుగా ధ్యానంలో ఉంటాడనని నానుడి. మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లోనే ఉండి ఉపావాసం, జాగారం భక్తుల కోసం హార్ట్ఫుల్నెస్ సింగపూర్ సహకారంతో, జూమ్ ద్వారా మెడిటేషన్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరలు యాత్రను విజవంతం చేసినందుకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత మూడేండ్లుగా నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమానికి సింగపూర్లో వర్కిండ్ అయినప్పటికీ భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న సభ్యులు, స్పాన్సర్స్కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.