సింగపూర్లో ఉగాదిని పురస్కరించుకుని తొలిసారిగా శ్రీమద్భావగత సప్తాహం నిర్వహించనున్నారు. ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితిస, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డాక్టర్ మేడసాని మోహన్ గారితో వారంపాటు భాగవత ప్రవచనసుధ ఉంటుంది.
ఈ కార్యక్రమాలను ఏప్రిల్ 2, 2022 నుంచి మొదలుకొని ఏప్రిల్ 8,2022 వరకు జూమ్ ద్వారా నిర్వహించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 7:00pm SGT, 4:30pm IST, శని, ఆదివారాల్లో 1:00pm SGT, 10:30pm ISTలలో కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్షప్రసారం ఉంటుందని వెల్లడించారు. తమ ఈ ప్రయత్నానికి సహాయ సహకారాలను అందించి, భాగవత విశిష్టతను తెలుసుకోవాలని తెలుగు ప్రజలను నిర్వాకులు కోరారు.